Vivek Ramaswamy: టాయిలెట్లో వివేక్.. మైక్ ఆన్లోనే.. లైవ్లో 23లక్షల మంది శ్రోతలు!
వివేక్ రామస్వామి లైవ్లో మైక్ మ్యూట్ చేయడం మరిచిపోయిన ఘటనపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ (Republican) తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)కి ప్రచారంలో కాస్త ఇబ్బందికర పరిణామం ఎదురైంది. దీనిపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రచారంలో భాగంగా వివేక్ రామస్వామి ఇటీవల ‘ఎక్స్ స్పేస్’ అనే ఆన్లైన్ చర్చా వేదికలో పాల్గొన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్షర్ మారియో నౌఫల్ దీన్ని నిర్వహించారు. ఈ లైవ్ ఆడియోను సుమారు 23 లక్షల మందికిపైగా శ్రోతలు విన్నారు. ఇందులో ఎలాన్ మస్క్తోపాటు అమెరికాలో పాపులర్ రేడియో వ్యాఖ్యాత అలెక్స్ జోన్స్ కూడా పాల్గొన్నాడు. గతంలో అలెక్స్ జోన్స్ ఎక్స్ ఖాతాపై ఉన్న నిషేధాన్ని ఇటీవలే మస్క్ తొలగించారు. ఈ క్రమంలో అలెక్స్ జోన్స్ సోషల్ మీడియాలోకి తిరిగి రావడం గురించి ఎలాన్ మస్క్ లైవ్లో మాట్లాడుతుండగా.. మధ్యలో వివేక్ రామస్వామి కలగజేసుకున్నారు. కార్యక్రమం నుంచి తాను వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆ సమయంలో శ్రోతల్లో చాలా మంది తమకు బ్యాక్గ్రౌండ్లో నీళ్ల శబ్దం వినిపిస్తోందని, ఎవరో టాయిలెట్లోకి వెళ్లి ఫోన్ మైక్ ఆన్లో ఉంచారని చెప్పారు.
ఇక ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినతరం.. సగానికి తగ్గనున్న విద్యార్థి వీసాలు!
అయితే, ఆ సమయంలో వివేక్ మైక్ మాత్రమే ఆన్లో ఉన్నట్లు స్క్రీన్పై చూపిస్తుంది. దీంతో వివేక్ మైక్ ఆన్లో ఉందని, దాన్ని మ్యూట్ చేయలేను’’ అని మారియో చెప్పాడు. వెంటనే వివేక్ రామస్వామి మైక్ను మ్యూట్ చేసి.. తర్వాత శ్రోతలను క్షమాపణ కోరారు. కొద్ది సేపటి తర్వాత ఈ పరిస్థితిపై మస్క్ స్పందిస్తూ.. ‘‘మీరు ఇప్పుడు కాస్త స్థిమితపడినట్లున్నారని’’ వివేక్ను ఉద్దేశించి అనడంతో.. ‘‘అవును నేను బాగానే ఉన్నాను. అలా జరిగినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను’’ అని వివేక్ బదులిచ్చారు. ఈ ఆడియో సంభాషణపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘ఆడియో లైవ్ షోలలో ఇలాంటివి సర్వసాధారణం’, ‘వివేక్ను ఈ విషయం వెంటాడుతూనే ఉంటుంది’, ‘ఇదో సరదా సంఘటన’ అంటూ కామెంట్లు చేశారు.
రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), భారతీయ అమెరికన్లు నిక్కీ హేలీ ( Nikki Haley), వివేక్ రామస్వామితోపాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డి శాంటిస్ (Ron DeSantis), న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ (Chris Christie)లు పోటీ పడుతున్నారు. ఈ రేసులో 60 శాతం రిపబ్లికన్ ఓటర్ల మద్దతుతో డొనాల్డ్ ట్రంప్ అగ్రగామిగా ఉన్నారు. రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉన్నారు. మిగిలిన ముగ్గురు చర్చా కార్యక్రమాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
China: కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్త ఆందోళనకు చైనా దిగొచ్చింది. అతడిని తిరిగి ల్యాబ్లోకి అనుమతించింది. -
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
డాలస్ నుంచి టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
క్యాన్సర్తో బాధపడుతున్న ఓ వ్యక్తి జాక్పాట్ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా రూ. 10 వేల కోట్లకు పైగా గెలుచుకున్నాడు. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
Pakistan: పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరి ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటంటే..? -
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో బుధవారం ఓ హైవే రోడ్డులో కొంత భాగం కుప్పకూలిపోవడంతో19 మంది మృతి చెందారు. -
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసుపై వచ్చిన మీడియా కథనంపై వ్యాఖ్యానించేందుకు అమెరికా విదేశాంగశాఖ అధికారి నిరాకరించారు. ఈ అంశంతో తాము న్యూదిల్లీతో టచ్లోనే ఉన్నామన్నారు. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
ఉక్రెయిన్ తీరప్రాంత నగరమైన ఒడెస్సాలోని హ్యారిపోటర్ కోట(Harry Potter Castle)గా పేరున్న భవనాన్ని రష్యా క్షిపణి ధ్వంసం చేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
Columbia University: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా విద్యార్థులు చేస్తున్న నిరసనలను పోలీసులు క్రమంగా అదుపులోకి తీసుకొస్తున్నారు. తాజాగా కొలంబియా వర్సిటీలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
-
ఆఫ్లైన్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ