Putin: పాశ్చాత్య దేశాలకు తలొగ్గేదే లేదు.. వారి ఆధిపత్యాన్ని సహించం!
ఉక్రెయిన్ విషయంలో రష్యా అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్ఘాటించారు.
దేశద్రోహులను హెచ్చరించిన వ్లాదిమిర్ పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ విషయంలో రష్యా అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్ఘాటించారు. ఈ సమయంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సహించమన్న ఆయన.. వారికి తలొగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై దాడికి నిరసనగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఉక్రెయిన్కు తటస్థ స్థితిపై చర్చించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్న పుతిన్.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉక్రెయిన్పై సైనిక చర్య కొనసాగుతుందన్నారు.
గడిచిన మూడు వారాలుగా ఉక్రెయిన్పై రష్యా చేస్తోన్న దాడులను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి టెలివిజన్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పాశ్చాత్య దేశాలు విధిస్తోన్న ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయని అంగీకరించిన ఆయన.. ఇటువంటి దెబ్బలను రష్యా తట్టుకొని నిలబడగలదనే ధీమా వ్యక్తం చేశారు.
రష్యాను నాశనం చేసేందుకే..
రష్యాను ఆర్థికంగా బలహీన దేశంగా మార్చాలని పశ్చిమదేశాలు కోరుకుంటున్నాయని వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. అంతేకాకుండా పశ్చిమదేశాలన్నీ కలిసి తీసుకుంటున్న చర్యల వెనుక భౌగోళిక రాజకీయ లక్ష్యాలున్నాయని ఆరోపించారు. రష్యాను బలమైన, సార్వభౌమాధికార దేశంగా చూడడం వారికి ఇష్టం లేదని పుతిన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రష్యా విచ్ఛిన్నమవుతుందని లేదా ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందని వారు భావిస్తే.. రష్యా ప్రజల గురించి, మా చరిత్ర గురించి వారికి తెలియదు అంటూ పుతిన్ పశ్చిమ దేశాలను మరోసారి హెచ్చరించారు.
దేశద్రోహులకూ హెచ్చరిక..
దేశాన్ని నాశనం చేయడానికి రష్యాలోని కొందరు ద్రోహులను పశ్చిమ దేశాలు పావులుగా వాడుకుంటున్నాయని అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. రష్యా కంటే పశ్చిమదేశాల వాదనకు సానుకూల గళాన్ని వినిపించే వారిని దేశద్రోహులుగా అభివర్ణించిన ఆయన.. అటువంటి వారిని రష్యన్ ప్రజలు తేలికగా గుర్తించగలరని అన్నారు. రష్యాను విభజించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని మరోసారి పేర్కొన్న ఆయన.. ‘ఫిఫ్త్ కాలమ్’ (రష్యాన్ మీడియాలో పుతిన్కు వ్యతిరేకంగా ఇటీవల ఓ జర్నలిస్ట్ నిరసన తెలిపిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ) సహాయంతో ఇక్కడి పౌరుల్లో ఘర్షణలు రేకెత్తించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలా వారి ఏకైక లక్ష్యం రష్యాను నాశనం చేయడమేనని.. అయినప్పటికీ అటువంటి ప్రయత్నాలను రష్యా తిప్పికొడుతుందని వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.