Putin: మళ్లీ అలాంటి ఉగ్రచర్యకు పాల్పడ్డారో.. ఉక్రెయిన్కు పుతిన్ వార్నింగ్!
కెర్చ్ వంతెన కూల్చివేత నేపథ్యంలో ఉక్రెయిన్ పై తమ సేనలు క్షిపణి దాడులతో విరుచుకుపడటంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఉగ్ర చర్యకు పాల్పడినందుకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్టు స్పష్టం చేశారు.
మాస్కో: కెర్చ్ వంతెన కూల్చివేత నేపథ్యంలో ఉక్రెయిన్(Ukraine)పై తమ సేనలు క్షిపణి దాడులతో విరుచుకుపడటంపై రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) స్పందించారు. ఉగ్ర చర్యకు పాల్పడినందుకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్టు స్పష్టం చేశారు. క్రిమియా-రష్యాను అనుసంధానం చేసే కీలక వంతెనను పేల్చివేయడం ఉగ్రచర్య అని.. ఉక్రెయిన్ ప్రత్యేక బలగాలే ఈ దాడి వెనుక ఉన్నాయని పుతిన్ మండిపడ్డారు. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. టర్కిష్ స్ట్రీమ్ పైపులైన్ని సైతం పేల్చి వేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి ఉగ్రచర్యలకు పాల్పడితే మరింత కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. తమ రక్షణ మంత్రిత్వ శాఖ సూచన మేరకే రష్యా జనరల్ స్టాఫ్ ఓ ప్లాన్ ప్రకారం ఉక్రెయిన్లోని ఇంధనం, మిలటరీ, కమ్యూనికేషన్ స్థావరాలపై దాడులు జరిపినట్టు వెల్లడించారు. తమ భూభాగంలో ఇలాంటి ఉగ్రదాడులకు ప్రయత్నిస్తే మాత్రం తగిన విధంగా ప్రతిస్పందిస్తామని.. ఈ విషయంలో ఎలాంటి సందేహాలూ అవసరం లేదని పుతిన్ తేల్చి చెప్పారు.
ఇది ఆరంభమే.. దిమిత్రి మెద్విదేవ్
రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్విదేవ్ కూడా ఈ అంశంపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఉక్రెయిన్ అంతటా నీరు, విద్యుత్ సేవలకు అంతరాయం కలిగించేలా జరిపిన క్షిపణి దాడులు కేవలం ఆరంభం మాత్రమేనన్నారు. ఉక్రెయిన్ ఇంధనం, మిలటరీ కమాండ్, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్టు రష్యా రక్షణశాఖ తెలిపింది. దాడులు విజయవంతమయ్యాయని.. తమ లక్ష్యం నెరవేరినట్లు ప్రకటించుకుంది.
అక్కడ ఓటమితో పుతిన్ నిరాశ చెందడం వల్లే..
ఉక్రెయిన్లో ఇంధన మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా రష్యా దాడులు జరిగాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ కార్యాలయాల సేవలకు విస్తృతంగా అంతరాయం కలిగినట్టు తెలిపారు. రష్యాపై ఒత్తిడి పెంచాలని ఫ్రాన్స్, జర్మనీ నేతలను కోరినట్టు జెలెన్స్కీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇంకోవైపు, ఈ దాడులు ప్రేరేపితమైనవి కాదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా అన్నారు. తూర్పు ఉక్రెయిన్ భూభాగంలో తమ సైన్యాన్ని ఎదుర్కోలేక ఎదురైన పరాజయాలకు పుతిన్ నిరాశకు గురయ్యారని.. అందుకు యుద్ధాన్ని తనకు అనుకూలంగా మలచుకొనేందుకే క్షిపణులతో విరుచుకుపడ్డారని కులేబా అభిప్రాయపడ్డారు.
పుతిన్ బలహీనతకు నిదర్శనం: యూకే
ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ అన్నారు. ఈ చర్యలు పుతిన్ బలహీనతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఇంధన సౌకర్యాలతో పాటు కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడంతో కీవ్ నగరంలోని విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు ల్వీవ్ మేయర్ ఆండ్రీ సడోవి తెలిపారు. ఒకవేళ అత్యవసరమైతే తప్ప ఈరోజు కీవ్ నగరానికి వెళ్లకపోవడమే మంచిదని ఆ నగర మేయర్ విటాలీ క్లిట్ష్కో అన్నారు. మరోవైపు, పుతిన్ సేనల దాడుల్లో కీవ్లో కనీసం 11మంది మృతిచెందగా.. 64మందికి పైగా గాయపడినట్టు ఉక్రెయిన్ పోలీసులు వెల్లడించారు. సెంట్రల్ షెవ్కెంకో జిల్లాలో విశ్వవిద్యాలయంతో పాటు మ్యూజియంలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ పేలుడు ధాటికి అనేక చెట్లు, కొమ్మలు కాలిపోయాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత