Ukraine Crisis: ఉక్రెయిన్ యుద్ధం కీలక దశకు..!
ఉక్రెయిన్లో యుద్ధం కీలకదశకు చేరినట్లు అమెరికా సహా పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పోరాటం యుద్ధం
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్లో యుద్ధం కీలకదశకు చేరినట్లు అమెరికా సహా పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పోరాటం దీర్ఘకాలిక ఫలితాన్ని నిర్ణయిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆర్థిక ఒత్తిళ్లను లెక్క చేయకుండా ఉక్రెయిన్కు మద్దతిస్తున్న పశ్చిమదేశాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొనేందుకు ఇది పురిగొల్ప వచ్చని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై పనిచేస్తున 50 దేశాల గ్రూపుతో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ భేటీ కానున్న నేపథ్యంలో ఈ విశ్లేషణలు వెలువడటం విశేషం. ఈ సందర్భంగా అమెరికా సరికొత్త ఆయుధ ప్యాకేజీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం సంక్షోభ పరిస్థితిపై నాటో సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం యుద్ధం ఎవరో ఒకరు నిర్ణయాత్మక ఫలితాన్ని సాధించే దశకు చేరింది. రష్యా దళాలు స్లోవియాన్స్క్, క్రమాటోర్క్స్ చేరుకోవచ్చు. లేదా ఉక్రెయిన్ వారిని అక్కడకు చేరుకోకుండా అడ్డుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న బలగాలతో ఒకవేళ ఉక్రెయిన్ అడ్డుకొంటే అది చాలా కీలకం’’ అని పేర్కొన్నారు. మూడు రకాల ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక్కడ రెండు ప్రావిన్సుల్లో రష్యా మెల్లగా మరిన్ని భూభాగాలను కైవశం చేసుకొంటూ ముందుకు పోవచ్చు. లేకపోతే.. యుద్ధంలో మరింత ప్రతిఘటన ఎదురై ఫలితం తేలకపోతే.. దీర్ఘకాలం పోరాటం కొనసాగే అవకాశం ఉంది. ఇది భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలను మిగులుస్తుంది. లేకపోతే రష్యా తన లక్ష్యాలను మార్చుకొని.. తాను విజయం సాధించినట్లు ప్రకటించుకొని యుద్ధం ఆపేందుకు మార్గం సృష్టించవచ్చు. ఈ పరిస్థితిపై పశ్చిమదేశాల విశ్లేషకులకు పెద్దగా ఆశలు లేవు.
తూర్పున విజయం సాధించిన ప్రాంతాలను రష్యా సమీకృతం చేసుకొని భవిష్యత్తులో ఉక్రెయిన్ను మరింత వెనక్కి నెట్టేందుకు యత్నించవచ్చని పశ్చిమదేశాలు భయపడుతున్నాయి. మరోపక్క పశ్చిమదేశాలు ఆయుధాలు ఇవ్వకపోతే ఉక్రెయిన్కు సాధ్యం కాదని ఆ దేశ అధ్యక్షుడు జలెన్స్కీ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ‘‘వారు మరింత ముందుకెళితే.. ఉక్రెయిన్ తట్టుకొని నిలబడలేదని కచ్చితంగా చెప్పగలను. మాతో కలిసి పశ్చిమ దేశాలు బలం చూపించాల్సిన అవసరం ఉంది. పశ్చిమ దేశాలు వేగంగా ఆయుధాలను అందించాలి’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.