Ukraine Crisis: ఉక్రెయిన్ చేతికి అత్యాధునిక రహస్య ఆయుధం..!
ఉక్రెయిన్ యుద్ధంలో మార్పులు చోటు చేసుకొనే కొద్దీ విభిన్న వ్యూహాలు తెరపైకి వస్తు్న్నాయి. ఇప్పటికే అమెరికా స్విచ్బ్లేడ్ డ్రోన్ల వంటి అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్కు అందజేసింది. తాజాగా మరో రహస్య ఆయుధాన్ని ఉక్రెయిన్కు
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్ యుద్ధంలో మార్పులు చోటు చేసుకొనే కొద్దీ విభిన్న వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే అమెరికా స్విచ్ బ్లేడ్ డ్రోన్ల వంటి అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్కు అందజేసింది. తాజాగా మరో రహస్య ఆయుధాన్ని ఉక్రెయిన్కు సరఫరా చేయనున్నట్లు పెంటగాన్ ప్రతినిధి జాన్ కెర్బీ వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు. దీని పేరు ‘ది ఫినిక్స్ ఘోస్ట్’ వ్యవస్థగా మాత్రం వెల్లడించారు. ఈ డ్రోన్లను అమెరికాకు చెందిన ఏవెక్స్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని మైదానాల్లో పోరాడటానికి అనుకూలంగా దీనిని అభివృద్ధి చేశారు.
ఈ అంశంపై పెంటగాన్ ప్రతినిధి జాన్ కెర్బీ మాట్లాడుతూ ‘‘ నేను వివరాల్లోకి వెళ్లను. అక్కడి భౌగోళిక పరిస్థితుల్లో ఈ డ్రోన్ కచ్చితంగా లక్ష్యాలను సాధిస్తుంది. ఇది స్విచ్ బ్లేడ్ డ్రోన్లతో సమానంగా పనిచేస్తుంది. కాకపోతే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది పూర్తిగా అటాక్ డ్రోన్. దీనిని అందుకోసమే డిజైన్ చేశారు. దీనికి ఉన్న కెమెరాలు యుద్ధక్షేత్ర పరిస్థితుల సమాచారాన్ని పూర్తిగా అందిస్తాయి. కానీ, దాడి చేయడమే దీని ప్రథమ కర్తవ్యం. ఉక్రెయిన్ డ్రోన్ల అవసరాలు తీర్చేలా సరికొత్తవి అభివృద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. అంతకుమించి వివరాలు వెల్లడించేందుకు పూర్తిగా నిరాకరించారు. ఏవెక్స్ సంస్థ కూడా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది.
ఇప్పటి వరకు అమెరికా ఈ డ్రోన్ను ఏ యుద్ధంలోనూ వినియోగించలేదు. దీనిని రేంజ్, కచ్చితత్వాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. అమెరికా స్విచ్ బ్లేడ్ డ్రోన్లను సరఫరా చేయడానికి ముందు కొంత మంది ఉక్రెయిన్ సైనికులకు శిక్షణ ఇచ్చింది. ఈ ఘోస్ట్ డ్రోన్ల వినియోగానికి అటువంటి శిక్షణ సరిపోతుందని అమెరికా వెల్లడించింది. అమెరికా మొత్తం 400 స్విచ్ బ్లేడ్ డ్రోన్లను సరఫరా చేయడానికి అంగీకరించింది. వీటిల్లో ఇప్పటికే 100 ఉక్రెయిన్కు చేరుకొన్నాయి. త్వరలో మిగిలినవి కూడా యుద్ధక్షేత్రానికి తరలించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు