Telangana Assembly Elections: 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను సీపీఎం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కొలిక్కి రాకపోవడంతో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీకి సిద్ధమైన సీపీఎం (CPM).. 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 3 స్థానాలకు అభ్యర్థులను సాయంత్రం ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ నుంచ జూలకంటి, ఖమ్మం నుంచి శ్రీకాంత్, వైరా నుంచి భూక్యా వీరభద్రం సహా మిగిలిన వ్యక్తులతో మెుదటి జాబితాను వీరభద్రం విడుదల చేశారు.

Updated : 08 Nov 2023 16:38 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను సీపీఎం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కొలిక్కి రాకపోవడంతో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీకి సిద్ధమైన సీపీఎం (CPM).. 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 3 స్థానాలకు అభ్యర్థులను సాయంత్రం ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ నుంచ జూలకంటి, ఖమ్మం నుంచి శ్రీకాంత్, వైరా నుంచి భూక్యా వీరభద్రం సహా మిగిలిన వ్యక్తులతో మెుదటి జాబితాను వీరభద్రం విడుదల చేశారు.

Tags :

మరిన్ని