Kodandaram: కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తాం!: ప్రొ.కోదండరాం
భారాస నిరంకుశ పాలన అంతం కావాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం (Kodandaram) కోరారు. గత పదేళ్లుగా ప్రభుత్వం నిరసనను తెలిపేందుకు కూడా అవకాశం కల్పించకుండా అణిచివేతకు గురిచేసిందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల రద్దుతో పాటు. ఈ-చలాన్ రుసుమును తగ్గించాలని కోరినట్లు తెలిపారు.
Updated : 21 Nov 2023 12:36 IST
Tags :