News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (19-08-2022)
Updated : 19 Aug 2022 22:01 IST
1/31
నెల్లూరులోని వేణుగోపాలస్వామి కళాశాల గ్రౌండ్లో టన్నెల్ ఆకారంలో ఉన్న చేపల అక్వేరియంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని తిలకించేందుకు నెల్లూరు వాసులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
2/31
3/31
4/31
5/31
కర్నూలు నగర శివారులో వెదురుతో ఏర్పాటు చేసిన హోటల్ భోజన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ గుడారాల వంటి నిర్మాణాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నారు. దీంతో పాటు వెదురు మంచెపై అంతస్తులోనూ కూర్చునేందుకు వీలు కల్పించారు.
6/31
7/31
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఓ చేతిగడియారాల స్టోర్ నూతన వాచ్లను లాంచ్ చేసింది. కార్యక్రమంలో బిగ్బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపుతో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్నారు. వివిధ రకాల వాచ్లను ధరించి ఫొటోలకు పోజులిచ్చారు.
8/31
9/31
10/31
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముంబయిలో నిర్వహించిన ఉట్టి కొట్టే వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అందరూ కలిసి పిరమిడ్ ఆకారంలో పైకి వెళ్లి ఉట్టిని కొట్టి వేడుకలు చేసుకున్నారు.
11/31
12/31
13/31
14/31
బీజింగ్లోని ఇచుయాంగ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ సెంటర్లో ‘వరల్డ్ రోబో కాన్ఫరెన్స్’ నిర్వహిస్తున్నారు. ఇందులో చేతులను కదిలిస్తూ పాటలు పాడే రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
15/31
ఉడకబెట్టిన గుడ్డు నుంచి పొట్టును తొలగిస్తున్న సర్జికల్ రోబో. శస్త్ర చికిత్సలు చేసేందుకు దీన్ని వినియోగిస్తారు.
16/31
కొవిడ్ పరీక్ష కోసం లాలాజలం సేకరిస్తున్న రోబో
17/31
లైగర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా సినీ నటుడు విజయ్ దేవరకొండ బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నివాళి అర్పించారు. సినీ రంగానికి ‘అప్పూ’ చేసిన సేవలను విజయ్ గుర్తు చేశారు.
18/31
19/31
20/31
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఓ గ్రామంలోని సంచార జాతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. గాజులు, పూసలు తదితర సామగ్రిని విక్రయించే వారితో మాట్లాడారు. రాష్ట్రంలో సంచార జాతులు సంక్షేమ పథకాలకు నోచుకోవడంలేదని బండి సంజయ్ తెలిపారు.
21/31
22/31
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో ఉన్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ కృష్ణాష్టమి సందర్భంగా తన సతీమణి అక్షతతో కలిసి అక్కడి భక్తి వేదాంత మనోర్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు.
23/31
24/31
కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.
25/31
26/31
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ కుటుంబం శ్రీవారిని దర్శించుకుంది.
27/31
28/31
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో తెలంగాణ ఫొటో జర్నలిస్టుల చాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోష్కుమార్, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పాల్గొని ఫొటోలను తిలకించారు.
29/31
30/31
కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా గన్పౌండ్రి మహబూబియా స్కూల్లో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. మరికొందరు దేశ భక్తుల వేషధారణలతో కనువిందు చేశారు.
31/31
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..