విభూతి రేఖల సంకేతం
ఒకప్పుడు హైందవ ధర్మానికి ప్రతీకగా పురుషులు నుదుట గంధాన్ని, స్త్రీలు కుంకుమను మాత్రమే ధరించేవారు. నొసట నామం, త్రిపుండ్రం దిద్దుకునేవారు కాదు.
ఒకప్పుడు హైందవ ధర్మానికి ప్రతీకగా పురుషులు నుదుట గంధాన్ని, స్త్రీలు కుంకుమను మాత్రమే ధరించేవారు. నొసట నామం, త్రిపుండ్రం దిద్దుకునేవారు కాదు. రామాయణ, భారత, భాగవతాది పురాణేతిహాసాలు ఉద్భవించిన తర్వాత అవి ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోయాయి. అంతకు ముందు త్రిమూర్తులను సైతం నడిపించే శక్తి మరొకటుందని గాఢంగా నమ్మేవారు. శైవ, వైష్ణవ అంటూ విభేదాలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండేవారు. క్రమంగా విష్ణువును ఆరాధించే వారు, శివుణ్ణి పూజించేవారు.. రెండు వర్గాలుగా విడిపోయి కలహించుకోవడం ఆరంభించారు. నుదుట గంధం, కుంకుమలతో నిలువు నామాలు, విభూతి అడ్డరేఖలు అప్పుడే మొదలయ్యాయి. నుదుట మూడు విభూతి రేఖలనే త్రిపుండ్రం అంటారు. ఎవరి నమ్మకం వారిది, త్రిమూర్తులు అందరికీ ఆరాధ్యులేనంటారు ఆధ్యాత్మికవేత్తలు. 3 సంఖ్య బ్రహ్మ సంఖ్యగా భావిస్తారు. మూడు గీతల ఉద్దేశం అదే. నామధారణ అపమృత్యు దోషాలను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందన్నది భక్తుల విశ్వాసం.
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..