ఆందోళనకు రక్త పరీక్ష!
ఆందోళన (యాంగ్జయిటీ) సమస్య తరచూ చూసేదే. కొందరిలో ఇది రోజువారీ వ్యవహారాలకూ విఘాతం కలిగిస్తుంటుంది. దీన్ని ప్రస్తుతం మాట్లాడటం ద్వారానే గుర్తిస్తున్నారు. ఇలా ఆందోళనకు గురయ్యేవారి భావాలను తెలుసుకుంటున్నారు. మందులను సూచిస్తున్నారు. అయితే కొన్ని మందులు అలవాటయ్యే ప్రమాదముంది. ఇది మరిన్ని సమస్యలకు కారణం కావొచ్చు. అందుకే ఆందోళనను గుర్తించటానికి అమెరికా పరిశోధకులు రక్త పరీక్షను రూపొందించారు. ఇది రక్తంలోని ఆర్ఎన్ఏ బయోమార్కర్ల ద్వారా ఆందోళనను గుర్తిస్తుంది. దీని ద్వారా ఆందోళన ముప్పును అంచనా వేయటమే కాదు, తీవ్రతనూ అంచనా వేయొచ్చు. తగిన మందులను ఎంచుకోవటానికీ తోడ్పడుతుంది. అనవసరంగా మందులు ఇవ్వకుండా కాపాడుతుంది. మందులకు బదులు ఆలోచనా తీరును మార్చే చికిత్సలు, జీవనశైలి మార్పులను సూచించటానికి వీలు కల్పిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్గా బెడ్షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు