నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలి
అత్యధికమందికి ఉపాధినివ్వడమే గాక ప్రభుత్వానికి ఏటా 5 శాతం పైగా ఆదాయం సమకూరుస్తోంది ‘స్థిరాస్తి’ రంగం. గత అయిదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు బిల్డర్లు. నిర్మాణ రంగంలో పాతవి పరిష్కరించేకొద్దీ కొత్త ఇబ్బందులు పుట్టుకొస్తున్నాయని ఏకరవు పెడుతున్నారు.
ప్రభుత్వానికి టీబీఎఫ్ ప్రతినిధుల వినతి
ఈనాడు, హైదరాబాద్
అత్యధికమందికి ఉపాధినివ్వడమే గాక ప్రభుత్వానికి ఏటా 5 శాతం పైగా ఆదాయం సమకూరుస్తోంది ‘స్థిరాస్తి’ రంగం. గత అయిదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు బిల్డర్లు. నిర్మాణ రంగంలో పాతవి పరిష్కరించేకొద్దీ కొత్త ఇబ్బందులు పుట్టుకొస్తున్నాయని ఏకరవు పెడుతున్నారు. పాత డిమాండ్లు కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. పరిశ్రమ హోదా ఇవ్వాలని ఎంతోకాలంగా స్తిరాస్థి సంఘాలు కోరుతున్నాయి. తెలంగాణ బిల్డర్ల సమాఖ్య(టీబీఎఫ్) ప్రతినిధులు తమ సమస్యలను తాజాగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
‘రెరా’ దరఖాస్తుల ఆమోదంలో జాప్యం * అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నపుడు ఎవరైనా ఫిర్యాదు చేస్తే జీహెచ్ఎంసీ అతి జాగ్రత్తతో నిర్మాణాలను ఆపేస్తుంది. ఏదైనా సమస్య ఉంటే ఇద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ చేస్తే మేలు. * రెరాలో దరఖాస్తు చేసుకుంటే నెలరోజుల్లో ఆమోదించాలి. లేదంటే ఆమోదం పొందినట్లే. రెండు నెలలైనా పెండింగ్లో ఉంటున్నాయి. గడువు లోపల చర్యలు తీసుకోవాలి. * రెరా వచ్చింది కాబట్టి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో 10 శాతం మార్ట్గేజ్ నిబంధనలను తొలగించాలి. నిర్మాణదారులకు వచ్చే లాభం ఆ 10 శాతమే. * హెచ్ఎండీఏకు కమిషనర్ లేకపోవడంతో లేఅవుట్, భవన అనుమతుల్లో జాప్యం జరుగుతోంది. * బీఆర్ఎస్ కోర్టులో పెండింగ్లో ఉంది. అయినా మున్సిపల్ అధికారులు అక్రమ భవనాలని చెప్పి జరిమానా వసూలు చేస్తున్నారు. పరిష్కారం అయ్యేవరకు జరిమానా వేయొద్దు. |
రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలి * ఎల్ఆర్ఎస్ లేనివాటికి 14 శాతం ఫీజుతో అనుమతులు మంజూరుచేసేవారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ కోర్టులో పెండింగ్లో ఉంది. త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలి. * టీడీఆర్ జోనల్ స్థాయిలో ఇస్తే ప్రధాన కార్యాలయానికి తిరగాల్సిన తిప్పలు తప్పుతాయి. * పర్యావరణ అనుమతులు పీసీబీలో ఏడాదికాలంగా పెండింగ్లో ఉన్నాయి. కమిటీ వేసి పరిష్కరించాలి. * అందుబాటు ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలి. |
ఎన్వోసీలు ఆలస్యం * మాస్టర్ప్లాన్లో రహదారులు ఇళ్లు, కాలనీల మీదుగా వెళుతున్నాయి. వీటిని చూపి అనుమతులు నిరాకరిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఈ లోపాలను సరిచేయాలి. * బాహ్య వలయ రహదారి(ఓఆర్ఆర్) పక్కనే స్థలాలు ఉన్నా సర్వీస్ రోడ్లకు అనుసంధానం లేవు. టీడీఆర్ ఇస్తే స్లిప్రోడ్కు స్థలాలు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఇరువురికీ ప్రయోజనం కలుగుతుంది. వచ్చే ఐదేళ్లలో ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ చుట్టూ అభివృద్ధి చెందుతుంది. * యాదాద్రి మాస్టర్ప్లాన్ పెండింగ్లో ఉంది. త్వరగా అమల్లోకి తెస్తే మేలు. * నిర్మాణ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలి. పరిశ్రమలకు టీ-ఐపాస్లో అనుమతులు సత్వరం జారీ చేస్తున్న మాదిరి స్థిరాస్తి రంగానికి వర్తింపజేయాలి. * నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం జారీకి ఆరునెలలు పడుతోంది. వీఆర్ఓ, సర్వేయర్, తహసిల్దార్, ఆర్డీఓ, సంయుక్త కలెక్టర్, కలెక్టర్, సాగునీటి శాఖ ఏఈ నుంచి ఎస్ఈ వరకు తిరగాల్సి వస్తోంది. ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో తెలియని పరిస్థితి. కలెక్టర్లు సమావేశం పెడితే సరి.. లేదంటే అంతే. తీవ్ర జాప్యం జరుగుతోంది. * భూములను జియో ట్యాగింగ్ చేయాలి. చెరువులు, అడవులు, బఫర్జోన్ జియో ట్యాగింగ్తో ఎన్వోసీ సులభతరమవుతుంది. * హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ అనుమతి ఉన్న వెంచర్లు, నిర్మాణాల వివరాలు రిజిస్ట్రేషన్ శాఖ చూసుకునే వెసులుబాటు ఇవ్వాలి. వీటికి మాత్రమే రిజిస్టర్ చేస్తే ప్రణాళికతో కూడిన అభివృద్ధి సాధ్యమవుతుంది. |
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!