చాక్లెట్ సమోసా!
కావాల్సినవి: బయటి పిండి కోసం.. మైదా- కిలో, నెయ్యి- 35 గ్రా., యాలకులు- ఐదు.
కావాల్సినవి: బయటి పిండి కోసం.. మైదా- కిలో, నెయ్యి- 35 గ్రా., యాలకులు- ఐదు.
ఫిల్లింగ్ కోసం... చాక్లెట్- 500 గ్రా., బాదం, జీడిపప్పు- 250 గ్రా. చొప్పున, పిస్తా- 100 గ్రా., పంచదార- కేజీ, నూనె- వేయించడానికి సరిపడా.
తయారీ: మైదాలో నెయ్యి, యాలకుల పొడి వేసి నెయ్యి పిండికి పట్టేలా బాగా కలపాలి. నెమ్మదిగా కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ పిండిని తడపాలి. ఆ తర్వాత ఇరవై నిమిషాలు నానబెట్టాలి.
సమోసా లోపల పెట్టడానికి చాక్లెట్ని డబుల్ బాయిలర్.. అంటే చాక్లెట్ని గిన్నెలో ఉంచి దాన్ని మరుగుతున్న నీళ్లున్న మరో గిన్నెలో ఉంచి, చాక్లెట్ని కరిగించుకోవాలి. దీనికి పంచదార జత చేయాలి. తీపి ఎక్కువగా ఉండే చాక్లెట్ వాడితే చక్కెర తక్కువగా వాడుకోవాలి. కరిగిన చాక్లెట్లో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా కలపాలి.
తడిపిన పిండిని చిన్న ఉండల్లా చేసుకుని గుండ్రంగా ఒత్తుకోవాలి. ఇలా చేసిన గుండ్రటి చపాతీని రెండుగా కోసుకోవాలి. ప్రతి సగం ముక్కను కోన్ ఆకారంలో మడుచుకోవాలి. రెండు అంచులను నీళ్లతో అతికించుకుని కోన్ తయారుచేసుకోవాలి. ఈ కోన్లో చాక్లెట్ మిశ్రమాన్ని వేసి అంచులను నీళ్లతో అతికించుకోవాలి.
యాలకులను పొడి చేయకుండా విత్తనాలను సమోసా పిండిలో కూడా కలపొచ్చు. సమోసాకీ ప్రత్యేకమైన రుచి వస్తుంది. వీటిని నూనెలో గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ముందు మంటను మధ్యస్థంగా పెట్టి తర్వాత పెద్ద మంట మీద వేయించుకుంటే సమోసా క్రిస్పీగా వస్తుంది. చివరగా టిష్యూపేపర్పై ఫ్రై చేసిన సమోసాలను వేసి సర్వ్ చేసుకుంటే సరి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?