రసబలీ.. తిన్నారా?
ఒడియా ప్రసిద్ధ పిండివంటల్లో ‘రసబలీ’ మిఠాయి ఒకటి. దీన్నెలా చేయాలంటే.. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో రెండు కప్పుల పాలు పోసి, కాస్త కుంకుమ పువ్వు వేయాలి
ఒడియా ప్రసిద్ధ పిండివంటల్లో ‘రసబలీ’ మిఠాయి ఒకటి. దీన్నెలా చేయాలంటే.. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో రెండు కప్పుల పాలు పోసి, కాస్త కుంకుమ పువ్వు వేయాలి. సన్న సెగ మీద పాలు సగం అయ్యేవరకూ మరిగించాలి. అందులో అర కప్పు పంచదార వేసి.. అది కరిగాక, పావు చెంచా యాలకుల పొడి వేసి.. కలియ తిప్పి దించేయాలి. మరో పాత్రలో కప్పు తురిమిన పనీర్, చెంచా చొప్పున ఉప్మా రవ్వ, గోధుమ పిండి వేసి బాగా కలిపితే.. మెత్తటి పిండిలా తయారవుతుంది. దాన్ని నిమ్మకాయంత భాగాలుగా చేసి, టిక్కీలుగా ఒత్తుకోవాలి. సైజు, మందం అన్నీ సమానంగా ఉండేట్లు చేసి, కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. వీటిని టిష్యూ పేపర్ మీదికి తీస్తే.. అదనంగా ఉన్న నూనె పీల్చేసుకుంటాయి. ఈ టిక్కీస్ను మరిగించిన పాలలో వేయాలి. అరగంట నానితే సరి.. తియ్యటి ‘రసబలీ మిఠాయి’ సిద్ధమైపోతుంది. సులువైన ఈ స్వీటు సూపర్ టేస్టీగా ఉంటుంది. తిని ఆనందించడమే తరువాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!