Farmer:ఏ పంటా మిగల్లేదు..
ఖరీఫ్ పంటల్లో ఒక్కటీ సరిగా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి మిరప సాగు చేస్తే.. తామర పురుగుతో ఎకరాకు 2, 3 క్వింటాళ్లు దిగుబడి రావడమూ గగనమైంది. గులాబీ పురుగు ధాటికి పత్తిలో ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టం వస్తోంది. వేరుసెనగ వేస్తే.. పశువుల మేతకూ మిగల్లేదు. కంది అయినా బాగుంటుందనుకుంటే..
వేరుసెనగ, వరి, పత్తి, మిరప, కంది.. అన్నీ నష్టాలే
భారీ వర్షాలు, తెగుళ్లు, పురుగుల తాకిడే ప్రధాన కారణం
అన్నదాత నెత్తిన రూ.లక్షల్లో అప్పులు..
పెట్టుబడుల రూపంలోనే రూ.16 వేల కోట్లకు పైగా నష్టం
ఉత్పత్తి నష్టం రూ.20వేల కోట్ల పైనే
ఈనాడు - అమరావతి
ఖరీఫ్ పంటల్లో ఒక్కటీ సరిగా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి మిరప సాగు చేస్తే.. తామర పురుగుతో ఎకరాకు 2, 3 క్వింటాళ్లు దిగుబడి రావడమూ గగనమైంది. గులాబీ పురుగు ధాటికి పత్తిలో ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టం వస్తోంది. వేరుసెనగ వేస్తే.. పశువుల మేతకూ మిగల్లేదు. కంది అయినా బాగుంటుందనుకుంటే.. వెర్రితెగులు ఆశించి కాయ కనిపించడం లేదు. వరిలో ఎకరాకు 30 బస్తాల పైన వస్తాయనుకుంటే 15 నుంచి 20 బస్తాల దిగుబడీ కనాకష్టమవుతోంది. ఇందులోనూ ఎకరానికి సగటున రూ.15 వేలకు పైనే నష్టం.. ఖరీఫ్లో భారీవర్షాలు, వరదలకు తోడు తెగుళ్లు, పురుగుతాకిడితో ప్రధాన పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఒక పంట దెబ్బతింటే మరోదానిలో గట్టెక్కొచ్చనే ఆశలూ పోయి రైతులకు రూ.లక్షల్లో అప్పులు మిగిలాయి. ఖరీఫ్లో వరి, వేరుసెనగ, మిరప, పత్తి, కందితోపాటు మినుము, మొక్కజొన్న తదితర పంటల సాగులో సుమారుగా రూ.16 వేల కోట్ల పెట్టుబడిని కోల్పోతున్నారు. ఉత్పత్తి నష్టం రూ.20 వేల కోట్ల పైనే ఉంటోంది. ఖరీఫ్లో వేసిన మినుము, పెసరతోపాటు మొక్కజొన్న సాగులోనూ నష్టాలు తప్పలేదు. రబీలో వేసిన సెనగనూ నల్లతామర పురుగు ఆశించింది.
పొగాకుకు పేనుబంక వచ్చింది. ఒకే సీజన్లో పంటలన్నీ పోవడం మునుపెన్నడూ చూడలేదని.. దీన్ని విపత్తు అనాలా? ఉత్పాతం అనాలా? మా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవాలా? అని రైతులు వాపోతున్నారు. దాదాపు పూర్తిస్థాయిలో పెట్టుబడి పెట్టాక.. పంట చేతికొచ్చే దశలో విపత్తులు విరుచుకుపడ్డాయి. తెగుళ్లు విజృంభించాయి. పురుగుల తాకిడి పెరిగింది. దీంతో అధికశాతం రైతులు పెట్టుబడి మొత్తం నష్టపోయారు. ఎవర్ని కదిల్చినా లక్షల్లో అప్పులపాలయ్యామనే ఆవేదనే వినిపిస్తోంది
85 శాతం పైగా చిన్న, సన్నకారు రైతులే..
సాగుదారుల్లో 85% పైగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వడ్డీ వ్యాపారుల దగ్గర, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి పంటలపై పెట్టారు. కౌలురైతులుగా మారిన వ్యవసాయ కూలీలూ.. పనులకు వెళ్లి సంపాదించుకున్న మొత్తాన్నీ పెట్టుబడిగా పెట్టారు. కౌలు కూడా ముందే చెల్లించారు. ఇప్పుడు రూపాయి చేతికొచ్చే పరిస్థితి లేదని, అప్పులు ఎలా తీర్చాలని కుంగిపోతున్నారు.
గులాబీ ‘కత్తి’
తొలకరి ప్రారంభంలోనే పత్తి క్వింటాలు రూ.7వేలకు పైగా చేరింది. అయినా గతేడాది భారీ వర్షాలతో కొందరు రైతులు ఎకరాకు రూ.15 వేల వరకు నష్టపోవడం, గులాబీ పురుగు తాకిడి గుర్తొచ్చి.. 2 లక్షల ఎకరాల సాగు తగ్గించారు. తొలితీత పత్తినే క్వింటాలు రూ.7 వేల వరకు అమ్మారు. అక్టోబరు నెలాఖరు వరకు అంతా బాగుంది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు వస్తుందని ఆశించారు. ఇంతలోనే భారీ వర్షాలతో కాపు రాలిపోయింది. కాయలు చెట్టుకే కుళ్లిపోయాయి. అయినా మరో కాపు వస్తుందని భావిస్తుండగా గులాబీ పురుగు విజృంభించి, వచ్చేదంతా పుచ్చుపత్తి అయింది. దిగుబడి ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు దాటలేదు. పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి తలెత్తింది.
* పంట: పత్తి
* సాగు విస్తీర్ణం: 13,04,557 ఎకరాలు
* దిగుబడి దెబ్బతిన్న విస్తీర్ణం అంచనా: 80%
* ఎకరాకు సగటు దిగుబడి: 10 క్వింటాళ్లు
* ప్రస్తుతం వస్తున్నది: 2-3 క్వింటాళ్లే
* పెట్టుబడి నష్టం: రూ.1,662 కోట్లు అంచనా (మొత్తం పెట్టుబడి ఎకరాకు రూ.30వేలు, నష్టం.. రూ.15,000)
పొలం అమ్మేశా.. ఇప్పుడు మళ్లీ అప్పులయ్యాయి
నాకు తెలిసిన విద్య వ్యవసాయమే అంటున్న ఈ రైతు పేరు కరీముల్లా.. గుంటూరు జిల్లా పుల్లడిగుంటకు చెందిన ఈయన రెండేళ్ల కిందటే వ్యవసాయంలో అప్పులు తీర్చడానికి ఉన్న ఎకరా పొలాన్ని అమ్మేశారు. ఇల్లొక్కటే మిగిలింది. ఈ ఏడాది ఎకరా రూ.40 వేల చొప్పున ఏడెకరాలు కౌలుకు తీసుకుని మిరప, ఎకరా రూ.25 వేల చొప్పున అయిదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశారు. మొత్తంగా రూ.10 లక్షల పెట్టుబడి అయింది. ఎకరానికి పది క్వింటాళ్లు వస్తుందనుకున్న పత్తి.. వానలు, గులాబీ పురుగుతో రెండు క్వింటాళ్లకు పడిపోయింది. నల్లతామర దెబ్బకు మిరపలో ఎకరాకు మూడు, నాలుగు క్వింటాళ్లూ కష్టమే. ‘బంగారం పెట్టి కొంత, నూటికి నెలకు రూ.2.50, రూ.2, రూ.1.50 వడ్డీకి మరికొంత అప్పు తెచ్చి పెట్టాం. వాటిని ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు’ అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
పశువుల మేతకైనా మిగల్లేదు..
ఎకరా వేరుసెనగకు రూ.35 వేల పెట్టుబడి పెడితే.. కిలో కాయ కూడా రాని రైతులు వేలాది మంది ఉన్నారు. వేరుసెనగ కాయ కోశాక మిగిలిన కట్టెను పశువుల మేతగా వేస్తారు. భారీవర్షాలతో కట్టె నల్లగా మారి.. మేతకూ పనికిరాలేదు. పంటకోత ప్రయోగాల లెక్కల ఆధారంగా చూస్తే.. అనంతపురం జిల్లాలో ఎకరాకు 83 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. నిరుడూ భారీవర్షాలతో వేరుసెనగ దెబ్బతిని, పెద్ద సంఖ్యలో నష్టపోయారు. అయినా పెట్టుబడి రాయితీ కొందరికి మాత్రమే అందిందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాదీ కోలుకోలేని దెబ్బతిన్నామని, సాగు విస్తీర్ణంలో 70% పైనే నష్టం జరిగిందని పేర్కొంటున్నారు.
* పంట: వేరుసెనగ
* సాగు విస్తీర్ణం: 16,47,052 ఎకరాలు
* దెబ్బతిన్న విస్తీర్ణం అంచనా: సుమారు 70%
* నష్టానికి కారణం: భారీ వర్షాలు
* సగటు దిగుబడి: అధికశాతం రైతులకు పంటకు చేతికే రాలేదు
* పెట్టుబడి నష్టం: రూ.2,882 కోట్లు అంచనా (ఎకరాకు రూ.25వేల చొప్పున)
పశువుల మేత కూడా మిగల్లేదు
- పసల రాము, రైతు, మేడాపురం, చెన్నేకొత్తపల్లి మండలం, అనంతపురం జిల్లా
అయిదెకరాల్లో వేరుసెనగకు రూ.2 లక్షల పెట్టుబడి అయింది. ఊడలు దిగినప్పట్నుంచే ఎడతెరిపిలేని వానలు పడ్డాయి. పంట సరిగా రాలేదు. కోత కోశాక 20 రోజులపాటు ఆగకుండా వర్షాలు కురిశాయి. కాసిన కొద్దిపాటి కాయలూ నల్లగా మారి మొలకలొచ్చాయి. కనీసం పశువుల మేత కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు.
తామర దెబ్బకు తలకిందులు
మిరపలో ఏటా వైరస్ ప్రభావం ఉంటుంది. ఒక్కోసారి మొక్క దశలోనే ఆశిస్తే.. కొన్నిసార్లు తొలి కాపు తర్వాత, రెండో కాపులో వస్తుంటుంది. దీంతో ఎకరాకు పది క్వింటాళ్ల లోపైనా చేతికొచ్చేది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో సాగు చేశారు. డిసెంబర్ నాటికే ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. ఇంతలో జెమిని వైరస్ ఆశించి, కొంత నష్టపరిచింది. దీనికితోడు నల్లతామర పురుగు విజృంభించి మొత్తం పంటనే నాశనం చేసింది. పొలాల్లో పూత అనేదే కనిపించని పరిస్థితి. ఎకరాకు రూ.లక్ష వరకు రైతులు నష్టపోయారు. కౌలు రైతులకు ఎకరాకు రూ.30 వేలకు పైగా అదనపు నష్టం వాటిల్లింది. ఇప్పటికీ పురుగు నివారణ కాలేదు. సాగు చేసిన విస్తీర్ణంలో 80 నుంచి 85 శాతం మిరప దెబ్బతింది. మిరపలో గతేడాదీ వైరస్ ప్రభావంతో దిగుబడి తగ్గింది. ధరలు బాగుండటంతో రైతులు కొంత గట్టెక్కారు.
* పంట: మిరప
* సాగు విస్తీర్ణం: 5,13,000 ఎకరాలు
* దెబ్బతిన్న విస్తీర్ణం: సుమారు 85 శాతం
* ఎకరాకు సగటు దిగుబడి: 10 క్వింటాళ్లు
* ప్రస్తుతం వస్తున్నది: రెండు మూడు క్వింటాళ్లే
* పెట్టుబడి నష్టం: రూ.4,360 కోట్లు (ఎకరాకు రూ.లక్ష) అంచనా
నాలుగెకరాల మిరప.. రూ.5 లక్షల అప్పు
- జాగర్లమూడి శ్రీను, మక్కెనవారిపాలెం, సంతమాగులూరు మండలం, ప్రకాశం జిల్లా
నాలుగెకరాల్లో మిరప వేశాను. నల్లతామర పురుగుతో దెబ్బతింది. రెండెకరాల్లో పంట తీసేసి బెండ, మునగ పెట్టా. మిగిలిన రెండెకరాల్లోనూ.. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లే వచ్చేట్లు ఉన్నాయి. కౌలుతో కలిపి నాలుగెకరాలకు రూ.6 లక్షల పెట్టుబడి అయింది. కాయలు అమ్మితే రూ.లక్ష వస్తాయేమో.
వెర్రి తెగులొచ్చి.. కంది పోయింది
భారీవర్షాలతో కందిలోనూ పూత రాలింది. మిగిలిన కొద్దిపాటి పూత అయినా నిలిస్తే ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లయినా కందులొస్తాయి అనుకుంటుండగా వెర్రితెగులు విరుచుకుపడి, కాపు అనేదే లేకుండా చేసింది. 70% విస్తీర్ణంలో దిగుబడుల్ని దెబ్బతీసింది. పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోవాల్సి వస్తోంది. పూత ఎందుకు రావడం లేదో అర్థంకాక.. లీటర్ల కొద్దీ మందులు పిచికారీ చేస్తున్న రైతులకు పెట్టుబడి మరింత పెరుగుతోంది.
* పంట: కంది
* సాగు విస్తీర్ణం: 6,13,885 ఎకరాలు
* తెగులు, వర్షాలతో దెబ్బతిన్న విస్తీర్ణం అంచనా: సుమారు 60 శాతం పైనే
* ఎకరాకు సగటు దిగుబడి: 4 క్వింటాళ్లు
* ఇప్పుడు వస్తున్నది: క్వింటాలు లోపే
* పెట్టుబడి నష్టం: రూ.1,150 కోట్లు (ఎకరాకు రూ.25 వేల చొప్పున) అంచనా
కంది పంట నాశనం
- గాడపర్తి లక్ష్మినారాయణ, రైతు, శివరాంపురం, తాళ్లూరు మండలం, ప్రకాశం జిల్లా
వరిసాగులో నష్టాలొస్తున్నాయని అయిదెకరాల్లో కంది సాగు చేశా. రూ.75 వేల పైనే పెట్టుబడి పెట్టా. అధిక వర్షాలతో కొంత దెబ్బతింది. తెగుళ్లు పెరగడంతో.. ఎన్ని రకాల పురుగుమందులు వాడినా ఉపయోగం లేకపోయింది. మూడెకరాల కందిని గొర్రెల మేతకు ఇచ్చేశా. ఇంకో రెండెకరాల్లో ఉన్న కందికి వెర్రి తెగులు వచ్చింది. కాయ కూడా వచ్చే పరిస్థితి లేదు.
వరి రైతుకు మిగిలింది కన్నీరే
ఖరీఫ్ నుంచి విడవని వర్షాలే. అయినా తట్టుకుని వరి సాగు చేస్తే పంటకోత దశలో వానలు విరుచుకుపడ్డాయి. కొన్నిచోట్ల పంటను తుడిచిపెట్టేశాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరిని నేల కరిపించాయి. వచ్చే దిగుబడితో పోలిస్తే.. కోత ఖర్చులే ఎక్కువవడంతో కొంతమంది కోయకుండా వదిలేశారు. కోసి ఆరబెట్టిన ధాన్యమూ తడిసి, నీటిలో నాని, రంగు మారింది. నూక శాతమూ పెరిగింది. మిల్లర్లు కొనడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధర వచ్చేవరకు ఎదురుచూద్దామంటే నిల్వ చేసుకునే చోటు లేక, రబీ పెట్టుబడులకు సొమ్ము అవసరమై అడిగిన ధరకు అమ్మాల్సి వస్తోందని వాపోతున్నారు. గతేడాది ఖరీఫ్లోనూ భారీవర్షాలకు రాష్ట్రంలో చాలాచోట్ల వరి దెబ్బతింది. ఈ ఏడాదీ తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, తదితర జిల్లాల్లో భారీగా పంట వర్షార్పణమైంది.
* పంట: వరి
* సాగు విస్తీర్ణం: 39,15,205 ఎకరాలు
* పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న విస్తీర్ణం అంచనా: సుమారు 40%
* ఎకరాకు సగటు దిగుబడి: 35 బస్తాలు
* సగటున వస్తున్నది: 20 బస్తాలు
* పెట్టుబడి నష్టం: రూ.2,250 కోట్లు (ఎకరాకు రూ.15,000) అంచనా
పెట్టుబడి కూడా దక్కదు
-కొప్పినీడి సత్యనారాయణ, కౌలు రైతు, శివకోటి, రాజోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా
కౌలుకు మూడెకరాలు సాగు చేశాను. తుపాను, వర్షాలకు చాలా వరకు పంట దెబ్బతినగా 50 బస్తాల ధాన్యం చేతికొచ్చింది. ఎకరాకు 30 వేలు పైనే ఖర్చు చేశాను. పెట్టుబడీ తిరిగివచ్చేలా లేదు. ఇలాంటి పరిస్థితి ఏనాడూ రాలేదు.
అన్ని పంటలకూ నష్టాలే మిగిలాయి
- కేవీవీ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం
సాగు చేసిన మిరపలో 95% వరకు నల్లతామర పురుగుతో దెబ్బతింది. వరి సాగు గిట్టుబాటు కాకపోవడంతో 25% మంది నాట్లే వేయలేదు. వేసిన పంటలోనూ ఎకరాకు 25 బస్తాలు మించి రావడం లేదు. వర్షాలతో కొంత తడిసింది. రంగు మారింది. యంత్రాలతో కోయించడంతో తేమ శాతం పెరిగింది. పత్తిలో గులాబీ పురుగు దెబ్బకు 70% పైనే నష్టం వస్తుంది. వేరుసెనగ 80% పైనే దెబ్బతింది. కందీ, మినుముకూ నష్టాలే. సెనగ, సుబాబుల్, జామాయిల్, సరుగుడులకు ధర లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..