Andhra News:అవిశ్రాంత నిరీక్షణ
ప్రభుత్వోద్యోగం అంటే నెల జీతం మాత్రమే కాదు.. పదవీ విరమణ చేసిన తర్వాత నెలవారీ పింఛనుతో పాటు.. అన్నాళ్లూ తాము ఆదా చేసుకున్నదంతా పెద్దమొత్తంలో ఒకేసారి వస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఇంటి కొనుగోలులాంటి పెద్ద ఖర్చులు దాంతో తీరుతాయి. కానీ, రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా పరిస్థితి తలకిందులైంది. పదవీ విరమణ ప్రయోజనాలు సమయానికి అందక చాలామంది విశ్రాంత ఉద్యోగులు సతమతమవుతున్నారు. పీఎఫ్, ఇతర సొమ్ములు ఎన్నాళ్లయినా జమ కావడం లేదు. పదవీ విరమణ చేసినవారికి ప్రభుత్వం
పదవీ విరమణ ప్రయోజనాలు దక్కక ఇక్కట్లు
రూ.800 కోట్ల వరకు పెండింగ్
మరో 3 నెలలు ఇంతేనా?
ఈనాడు - అమరావతి
ప్రభుత్వోద్యోగం అంటే నెల జీతం మాత్రమే కాదు.. పదవీ విరమణ చేసిన తర్వాత నెలవారీ పింఛనుతో పాటు.. అన్నాళ్లూ తాము ఆదా చేసుకున్నదంతా పెద్దమొత్తంలో ఒకేసారి వస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఇంటి కొనుగోలులాంటి పెద్ద ఖర్చులు దాంతో తీరుతాయి. కానీ, రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా పరిస్థితి తలకిందులైంది. పదవీ విరమణ ప్రయోజనాలు సమయానికి అందక చాలామంది విశ్రాంత ఉద్యోగులు సతమతమవుతున్నారు. పీఎఫ్, ఇతర సొమ్ములు ఎన్నాళ్లయినా జమ కావడం లేదు. పదవీ విరమణ చేసినవారికి ప్రభుత్వం చెల్లించాల్సింది సుమారు రూ.800 కోట్లు ఉంటుందని అంచనా. ఇతర బకాయిలూ కలిపితే రూ.2,100 కోట్లు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. గతేడాది జూన్, జులై నెలల్లో పదవీ విరమణ చేసినవారికీ ఇంతవరకూ ప్రయోజనాలు అందలేదు. ఏప్రిల్లోపు క్రమేణా చెల్లిస్తామని అధికారులు అంటున్నారు.
నిర్దిష్ట గడువేదీ?: పదవీ విరమణ తర్వాత ప్రతి ఉద్యోగికి కమ్యుటేషన్, గ్రాట్యుటీ, పింఛను ఇస్తారు. నిజానికి ఉద్యోగి పదవీ విరమణ గడువుకు 4నెలల ముందే ప్రతిపాదనలు ఏజీ కార్యాలయానికి పంపి పింఛను ఖరారుకు ఏర్పాట్లుచేయాలి. పింఛను చెల్లింపులో జాప్యం జరగకూడదని 2018 జూన్ 27న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దాని ప్రకారం పదవీ విరమణ చేసిన ఉద్యోగికి ఆ తర్వాతి నెల ఒకటో తేదీన పింఛను చెల్లించాలి. ఇంకా ఆర్జిత సెలవు కింద గరిష్ఠంగా దాదాపు 10నెలల వేతనం రిటైరైన ఉద్యోగికి అందుతుంది. ప్రీమియాన్ని, జీతాన్ని బట్టి ఏపీ జీఎల్ఐ (జీవిత బీమా) మొత్తం అందుతుంది. గ్రూప్ ఇన్సూరెన్సు కింద మరికొంత మొత్తం వస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ కింద ఉద్యోగి ఎంత నిల్వ చేసుకుంటే అంత మొత్తం చెల్లించాలి. ప్రస్తుత రోజుల్లో చెల్లింపునకు గడువంటూ లేకుండా పోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. లోగడ పదవీ విరమణ చేసిననాడే ఉద్యోగికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తూ వారికి ఎంత మొత్తం అందుతుందో చెక్కు రూపంలో ఇచ్చేవారమని జలవనరుల శాఖలో పాలనా వ్యవహారాలు చూసే అధికారి ఒకరు చెప్పారు.
* గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని ఒక హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు 2021 జులైలో పదవీ విరమణ పొందారు. డిసెంబరులో పింఛను మొత్తం ఇచ్చారని ఆయన తెలిపారు. ఇప్పటికీ పీఎఫ్, ఆర్జిత సెలవుల సొమ్ము అందలేదు. పదవీ విరమణ చేసిన వారికి ఎన్నో అవసరాలుంటాయని, నెలల తరబడి ఇలా పెండింగ్లో పెట్టడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆయన వాపోయారు.
* గుంటూరు జిల్లాలో ఒక మండల విద్యాధికారిగా పని చేసి జూన్లో పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగిది కూడా ఇలాంటి వ్యథే. పీఎఫ్ సొమ్ములు అందలేదు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచరు జూన్ నెలాఖరున పదవీ విరమణ చేశారు. గ్రాట్యుటీ అందలేదని ఆయన చెబుతున్నారు.
ఆయన కీలకమైన ప్రభుత్వ శాఖలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారిగా పనిచేసి 6నెలల కిందట పదవీ విరమణ పొందారు. ప్రభుత్వంనుంచి ఆయనకు రావాల్సిన ప్రయోజనాలు ఇప్పటికీ దక్కలేదు. పింఛను ఖరారు చేసి ఇటీవలే చెల్లించారు. జీపీఎఫ్, కమ్యుటేషన్, జీఎల్ఐ, సముపార్జిత సెలవు మొత్తం, గ్రూపు ఇన్సూరెన్సు మొత్తాల కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు.
కడప జిల్లా కమలాపురం మండలంలో జడ్పీ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు ఒకరు గతేడాది జూన్ నెలాఖరున పదవీ విరమణ పొందారు. పింఛను, కమ్యుటేషన్ వంటివి ఆలస్యంగానైనా అందాయి. ఇప్పటికీ పీఎఫ్, ఆర్జిత సెలవుల సొమ్ము ఇవ్వలేదు. ఆ డబ్బులొస్తే ఇంటి రుణం తీర్చేద్దామని వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM