CM Jagan: అగ్రవర్ణ పేదలకు అండ
అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని, వారికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు, వారి ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందన్న సంకల్పంతోనే
వారికి మంచి జరగాలనే ఈబీసీ నేస్తం
పథక ప్రారంభోత్సవంలో సీఎం జగన్
ఈనాడు డిజిటల్, అమరావతి: అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని, వారికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు, వారి ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందన్న సంకల్పంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఇది ఎన్నికల వాగ్దానం కాదని, మేనిఫెస్టోలోనూ చెప్పలేదని, పేదవారు ఎక్కడున్నా మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ప్రారంభించారు. 3.93 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.589 కోట్ల నగదును బటన్ నొక్కి జమ చేశారు. అనంతరం మాట్లాడుతూ... ‘ఈ పథకం కింద రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణాల్లోని 45-60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు మేలు చేస్తున్నాం. వీరికి ఏటా రూ.15వేల చొప్పున మూడేళ్లపాటు అందిస్తాం. గృహిణి బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. వారి ముఖంలో సంతోషం ఉంటేనే ఇంట్లో అందరికీ ఆనందం ఉంటుంది’ అని గుర్తుచేశారు.
33 లక్షల మందికి చేయూత
‘వైఎస్సార్ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నేస్తం పథకాల కింద కాపు, బలిజ, ఒంటరి మహిళలకు(45-60 ఏళ్ల మధ్య ఉన్న వారికి) ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తున్నాం. ఈ రెండు పథకాల కింద దాదాపు 29 లక్షల మంది మహిళలకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. ‘ఈబీసీ నేస్తం’తో కలిపితే దాదాపు 33 లక్షల మంది మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నాం’ అని వెల్లడించారు.
డ్వాక్రాలో ఎన్పీఏలు తగ్గడమే మహిళాభివృద్ధికి నిదర్శనం
‘గత ప్రభుత్వం రుణమాఫీ పేరిట డ్వాక్రా మహిళల్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. ఏ-గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి. 18.36% ఎన్పీఏలుగా మారాయి. ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు చేయూత ఇస్తూ ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశాం. దీంతో ఎన్పీఏ, అవుట్ స్టాండింగ్ అకౌంట్ 0.73 శాతానికి తగ్గింది. మహిళాభివృద్ధి జరిగిందనే దానికి ఇదే నిదర్శనం’ అని సీఎం వివరించారు. రాజకీయంగానూ మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చాం. నామినేటెడ్ పోస్టుల్లోనూ 51% సీట్లు ఇచ్చాం. గతంలో గ్రామంలో గుడి, బడి పక్కన కనిపించే మద్యం గొలుసు దుకాణాలను ఇప్పుడు ఎక్కడా లేకుండా కట్టడి చేశాం’ అని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి పలువురు మహిళలు మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు. -
బాణసంచా పేలుళ్లకు బెదిరి.. వృద్ధురాలిని పొడిచిన ఆవు
వైకాపా నాయకులు కాల్చిన బాణసంచా ఒక వృద్ధురాలు గాయపడటానికి కారణమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని రామాపురం సంఘం కాలనీలో కావలి ఎమ్మెల్యే సమీప బంధువు మన్నెమాల సుకుమార్రెడ్డి తన అనుచరులతో ఆదివారం రాత్రి ప్రచారం నిర్వహించారు. -
రండి.. రండి.. ఓటేయగ తరలిరండి!
హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఏపీ ఓటర్లను పోలింగ్ నాటికి ఎలాగైనా సొంత గ్రామాలకు తరలించే పనిలో అక్కడి అభ్యర్థులు, నేతల అనుచరులు నిమగ్నమయ్యారు. -
ల్యాండ్ టైటిలింగ్పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు, లోకేశ్పై సీఐడీ కేసు
తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సహా మొత్తం 10 మందిపైన ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. -
వడగాలులు తగ్గుముఖం.. వర్షాలకు అవకాశం!
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఓ వైపు వడగాలులు తగ్గుముఖం పట్టి వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. -
రెండు నెలలుగా జీతాలందని శాప్ కోచ్లు
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలోని శిక్షకులకు రెండు నెలలుగా జీతాల్లేవు. ఇదిగో అదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. -
పింఛన్కు వెళ్లి.. వడదెబ్బతో వృద్ధుడి మృతి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన గంగదారి సుబ్బారావు(67) వడదెబ్బతో మృతి చెందారు. శనివారం ఉదయం పింఛను కోసం స్థానిక బ్యాంకు వద్దకు వెళ్లారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
ఇదీ సంగతి!
ఉన్న కొద్ది భూమిలో కొంత రీసర్వేలో పోగా.. మిగిలింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పుణ్యమాని మింగేశారు. మరి నువ్వో!!