Narendra Modi: అవమానకరంగా ఆంధ్రా విభజన
కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో విభజించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అహంకారంతో
పెప్పర్ స్ప్రేకొట్టి, మైకులు ఆపి చర్చలు లేకుండా చేశారు
అప్పటి స్పర్థలు ఇప్పటికీ ఏపీ, తెలంగాణలకు నష్టం చేస్తున్నాయి
రాజ్యసభలో కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
ఈనాడు, దిల్లీ: కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో విభజించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అహంకారంతో కూడిన అధికార మత్తులో చేసిన రాష్ట్ర విభజన ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ఆయన గంటన్నరపాటు ప్రసంగించారు. ఇందులో ప్రధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పలుసార్లు గుర్తు చేసుకున్నారు. అంజయ్యకు జరిగిన అవమానం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ప్రయత్నం, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ వీటన్నింటికీ కాంగ్రెసే కారణమని నిప్పులు చెరిగారు. ‘‘కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ అధికారంలో కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారు. మైకులు బంద్ చేసి, పెప్పర్ స్ప్రే చేసి ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్ర విభజన చేశారు. ఇది మంచి పద్ధతా? ఇదేనా ప్రజాస్వామ్యం. వాజపేయీ హయాంలోనూ మూడు రాష్ట్రాలను విభజించి ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. వాజపేయీ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి తుపానూ రాలేదు. అందరూ కూర్చొని శాంతియుతంగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ విషయంలోనూ అలా జరిగి ఉండొచ్చు. మేం తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. కానీ మీ అహంకారం, అధికార మత్తు దేశంలో స్పర్థలను సృష్టించింది. ఆ స్పర్థ ఇప్పటికీ ఏపీ, తెలంగాణలకు నష్టం చేస్తోంది. మీక్కూడా ఎలాంటి రాజకీయ ప్రయోజనం దక్కడం లేదు..’’ అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు.
అంజయ్యకు చేసిన అవమానాన్ని మరిచిపోయారా?
ఇదివరకు రాజీవ్గాంధీ చేతుల్లో ముఖ్యమంత్రి అంజయ్యకు అవమానం జరిగినట్లు ప్రచారంలో ఉన్న సంఘటననూ ప్రధాని మోదీ గుర్తు చేశారు. ‘‘సమాఖ్య వ్యవస్థ గురించి పెద్దపెద్ద ప్రసంగాలు చేసేవారు ఎయిర్పోర్టులో చిన్న విషయం కోసం ముఖ్యమంత్రిని తొలగించడాన్ని మరిచిపోయినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య విషయంలో ఏ జరిగిందో ఈ సభలోని వారందరికీ బాగా తెలుసు. ప్రధానమంత్రి కుమారుడికి ఎయిర్పోర్టులో చెప్పిన స్వాగతం నచ్చకపోవడంతో ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించారు. తద్వారా కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్ను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవమానకరరీతిలో పదవీచ్యుతుడ్ని చేశారు...’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచింది ఎవరు?
ఎన్టీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అంశాన్నీ ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘మొదట అవిశ్వాసం కల్పించడం, తర్వాత అస్థిరపరచడం, తర్వాత డిస్మిస్ చేయడం అన్న మూడు సూత్రాల ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరించింది. ఫరూక్ అబ్దుల్లా, చౌదరీ దేవీలాల్, చరణ్సింగ్, సర్దార్ బాదల్ ప్రభుత్వాలను ఎవరు అస్థిర పరిచారు? మహారాష్ట్రలో బాల్ఠాక్రేని అవమానించడానికి ఎవరు కుటిల ప్రయత్నాలు చేశారు? కర్ణాటకలో రామకృష్ణహెగ్డే, ఎస్ఆర్ బొమ్మై ప్రభుత్వాలను ఎవరు కూలదోశారు? 50వ దశకంలో కేరళలో ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టారు? తమిళనాడులో ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి ప్రభుత్వం, 1980లో ఎంజీఆర్ ప్రభుత్వాలను ఎవరు పతనం చేశారు? ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎవరు ప్రయత్నించారు? కేంద్ర ప్రభుత్వం మాట వినడం లేదని ములాయంసింగ్ను ఇబ్బంది పెట్టింది ఎవరు?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ వైపు వేలెత్తి చూపారు.
* ప్రస్తుతం ఏపీ, తెలంగాణల నుంచి పసుపు ఎగుమతులు పెరగడం తమ ప్రభుత్వ కృషి ఫలితమేనన్నారు. కరోనా సమయంలో ఆయుష్ మంత్రిత్వశాఖ ద్వారా భారతీయ వైద్య పద్ధతులకు ప్రచారం కల్పించడంతో ప్రజల్లో దానిపట్ల ఆసక్తి పెరిగి పసుపు వాడకం పెరిగిందని, దాని వల్ల పసుపు ఎగుమతులు వృద్ధి చెందాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.