ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు.
దళితులు, గిరిజనులకు జగన్ ద్రోహం
ఉపప్రణాళిక నిధులు యథేచ్ఛగా మళ్లింపు
నాలుగేళ్లలో రూ.29 వేల కోట్ల కోత
వారి ప్రత్యేక పథకాలన్నీ రద్దు
ఈనాడు, అమరావతి
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. వారికి చట్టబద్ధంగా అందాల్సిన ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులకు కోతవేసి.. కేటాయించిన వాటినీ పక్కదారి పట్టించి.. తీరని ద్రోహం చేశారు!
‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అని చెబుతూనే.. చరిత్రలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా దళిత, గిరిజనుల అభివృద్ధిని ఘోరంగా దెబ్బతీశారు సీఎం జగన్. బలహీనవర్గాల అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాల ద్వారా సంపాదించుకున్న ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక(కంపొనెంట్) చట్టాన్ని నిర్వీర్యం చేశారు. జనాభా దామాషా ప్రకారం వారికి నిధులు కేటాయించాలని చట్టం చెబుతున్నా... దాన్ని తుంగలో తొక్కారు. దళిత, ఆదివాసీ వ్యక్తులు, కుటుంబాలకు, వారు నివసిస్తున్న దళితవాడలు, తండాల అభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయించాల్సిన ఈ నిధుల్ని ఇష్టానుసారం దారి మళ్లించారు. దళితులు, గిరిజనులకు ప్రత్యేక సాయమంటూ లేకుండా చేశారు. అందరికీ ఇచ్చే పథకాలనే వారికి వర్తింపచేస్తూ అదే తాము చేసేదే గొప్ప సాయమనే ప్రచారం చేసుకున్నారు. అణగారిన వర్గాలకు అండ అనేదే లేకుండా చేసి తనను మించిన పెత్తందారు మరొకరు లేరని నిరూపించుకున్నారు.
కేటాయింపుల్లో ప్రతి ఏడాదీ కోతలే...
రాష్ట్రంలో ఎస్సీలు 16.4% ఉన్నారు. ఏటా బడ్జెట్లో ఆ మేరకు ఉప ప్రణాళిక నిధులు కేటాయించాలి. 2019-20లో 11%, 2020-21లో 11.9%, 2021-22లో 13.8%, 2022-23లో 12.1% మేర మాత్రమే కేటాయించారు. అంటే రూ.23 వేల కోట్లు కోతవేశారు. ఎస్టీల జనాభా 5.3% ఉండగా... 2019-20లో 3.7%, 2020-21లో 3.9%, 2021-22లో 4.9%, 2022-23లో 4% కేటాయించారు. అంటే రూ.6,547 కోట్లు కోతపడింది. మొత్తంగా రూ.29 వేల కోట్లు తగ్గించారు. వాటినీ పూర్తిగా ఖర్చు చేయలేదు. ఇప్పటికీ 2023-24 సంవత్సరానికి సంబంధించిన లెక్కలు వెల్లడించలేదు.
ఉపప్రణాళిక చట్టానికి తూట్లు....
ఉప ప్రణాళిక చట్టంలోని సెక్షన్ 11(ఎ), 11(బి) నిబంధనల ప్రకారం 100% నిధుల్ని దళిత, ఆదివాసీ వ్యక్తులు, కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పథకాలకు లేదా వారు నివసిస్తున్న దళితవాడలు, గిరిజన తండాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఒకవేళ ఇతర ప్రాంతాల్లో వినియోగిస్తే అక్కడి ఎస్సీ, ఎస్టీల జనాభాను బట్టి నిధులను కేటాయించాలి. గత ప్రభుత్వాలు ఈ నిబంధనలకు ప్రాధాన్యమిచ్చి పనులు కేటాయించాయి. కానీ వైకాపా ప్రభుత్వం వీటిని పూర్తిగా పక్కన పెట్టి.. నిధులను ఇష్టారీతిగా ఖర్చు చేసింది.
అంతా ముందస్తు వ్యూహం ప్రకారమే..
ఐదేళ్ల జగన్ పాలన తీరులో ఉప ప్రణాళికను అమలు చేసిన తీరును చూస్తే.. ఆ నిధుల్ని ఇతర వాటికి మళ్లించే నిర్ణయం ఎన్నికలకు ముందే జరిగినట్టుంది. ఉప ప్రణాళికను పారదర్శకంగా అమలు చేస్తామనే హామీని వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలు ఉంటే వాటికి నిధుల్ని కేటాయించాల్సి వస్తుంది. అందుకే అధికారం చేపట్టగానే వారి కోసం ఏళ్లుగా అమలవుతున్న పథకాలన్నింటినీ రద్దు చేయడమో, నిలిపేయడమో, నామమాత్రంగా మార్చడమో చేశారు. ఆపైన ఉప ప్రణాళిక నిధులను ఇష్టానుసారంగా వాడారు.
పింఛన్లు ఇప్పుడే కొత్తగా ఇస్తున్నారా?
ఎస్సీ, ఎస్టీల ఉపప్రణాళిక నిధులన్నింటినీ జగన్ నవరత్నాలకు మళ్లించారు. పింఛన్లు, ఉపకార వేతనాలు, బోధనా రుసుములు, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాల కింద చిన్నారులకిచ్చే గుడ్లు, మధ్యాహ్న భోజనం, ఇతర పథకాల్లోని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల సంఖ్య, వారికి కేటాయించిన నిధుల్ని తీసి... ఉపప్రణాళిక నిధుల కింద చూపించారు. ఈ పథకాలను జగన్ మాత్రమే కొత్తగా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ వారిని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. మరోవైపు దశాబ్దాలుగా ఎస్సీలకు అమలవుతున్న భూమి కొనుగోలు పథకాన్ని ఎత్తేశారు. ప్రతిభావంతులైన దళిత, గిరిజన విద్యార్థులకు ఉపయోగపడే ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ పథకాన్ని నిర్వీర్యం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ ఇచ్చే స్వయం ఉపాధి రుణాల పథకాలకు మోకాలొడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధికి ప్రోత్సాహం లేకుండా చేశారు.
చట్టం లేకుండా చేసే ఎత్తుగడనా...
ఉపప్రణాళిక చట్టం గడువు పదేళ్లు. అది 2023 జనవరితో ముగియనుందని తెలుసు. దీని అమలుపై వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గడువు రాకముందే పొడిగింపుపై నిర్ణయం తీసుకునేది. కానీ, ఆయా సంఘాలు గొంతెత్తి పోరాటం చేశాకనే స్పందించింది. పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఉప ప్రణాళిక నిధుల్ని ప్రభుత్వం ఎలా ఖర్చు చేసిందనే వివరాల్ని పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాలని చట్టం చెబుతోంది. కానీ ప్రభుత్వం ఆ వివరాల్ని ఎక్కడా బహిర్గతం చేయడం లేదు. సామాజిక తనిఖీ లేదు.
ఉప ప్రణాళికని సక్రమంగా అమలు చేయని జగన్.. ఎన్నికల ముందు కులగణన పేరిట కొత్త నాటకాన్ని నడిపించారు. గతేడాది అక్టోబరు నుంచి ఎస్సీ, ఎస్టీలు రాష్ట్రంలో ఎందరున్నారో తేలుస్తామంటూ.. సర్వే చేయించారు. ఈ సర్వేతో ఇక ఎస్సీ, ఎస్టీల జీవితాలు ఇట్టే బాగు పడతాయనేలా మాట్లాడారు వైకాపా నేతలు. రాష్ట్రంలోని సమస్త కుటుంబాల సమాచారాన్ని... ఫిబ్రవరి నెలాఖరుకే సేకరించి తమ గుప్పిట పెట్టుకున్నారు. ఆ వివరాలను విడుదల చేయకుండా తమ రాజకీయ అవసరాలకు వినియోగిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ