18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల

భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Published : 10 May 2024 05:25 IST

తిరుమల, న్యూస్‌టుడే: భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం ఈనెల 20 ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌  టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నంలోపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

  • ఈనెల 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు.
  • ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం కోటా, మధ్యాహ్నం మూడింటికి వృద్ధులు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.
  • ఈనెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్ల కోటా విడుదల, మధ్యాహ్నం మూడింటికి వసతి గదుల బుకింగ్‌ ఉంటుంది.
  • 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవాకోటా, 12 గంటలకు నవనీత సేవాకోటా, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవా కోటాను విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోరారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని