ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు.
పరిశ్రమల్లో 1.41 లక్షల ఉద్యోగాలు అంటూ అబద్ధాలు
పెట్టుబడులే పెట్టనిది పరిశ్రమలు ఎలా వచ్చాయి?
ఫలితమివ్వని ‘75 శాతం ఉద్యోగాలు స్థానికులకే’ చట్టం
ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఆగని వలసలు
ఈనాడు, అమరావతి
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. పెద్దగా ఎవరికి, ఎలాంటి ఉపాధి కలగకున్నా లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చామని పిట్టకథలు చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లును తీసుకొస్తాం. జిల్లాను యూనిట్గా తీసుకుని, పరిశ్రమలకు అనుకూలంగా వారికి
అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తాం. అందుకు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం
గత ఎన్నికల్లో వైకాపా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ.
మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో రూ.46,280 కోట్ల పెట్టుబడితో 99 భారీ, మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటిలో 62,541 మందికి ఉద్యోగాలు లభించాయి. మరో 55 భారీ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వాటి ద్వారా 78,792 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి
2022లో అసెంబ్లీలో సీఎం జగన్ వెల్లడించిన పారిశ్రామిక గణాంకాలు.
కొండంత రాగం తీసి గోరంత పాడిన చందంలా మారింది కొత్తగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి జగన్ తీసుకొచ్చిన పరిశ్రమలు, వాటి ద్వారా నిరుద్యోగులకు కల్పించిన ఉపాధి పరిస్థితి. ఆయన చెప్పిన మహాగొప్ప ఉపాధి లెక్కలు వింటే ‘ఔరా..’ అని నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. జగన్ దెబ్బకు పెట్టుబడులతో రావాలంటేనే పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో 8.62 లక్షల మందికి పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తానంటూ గాల్లో లెక్కలు చెప్పేశారు. లోతుకు వెళ్తే గానీ ఆ ఉపాధి లెక్కల గొడవ, పరిశ్రమల ఏర్పాటులో ‘జగన్మాయ’ అర్థం కాదు. మసిపూసిన మారేడుకాయతో కనికట్టు చేసి జనాలను ఎలా బురిడీ కొట్టించారో ఇట్టే తెలిసిపోతోంది.
పెట్టుబడుల వికర్షణ!
వైకాపా సర్కారు ఐదేళ్లలో పెట్టుబడుల ఆకర్షణ కంటే వికర్షణకు చేసిన ప్రయత్నాలే అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ విధ్వంసకర చర్యలతో రాష్ట్రం నుంచి తరలిపోయిన పెట్టుబడుల విలువ సుమారు రూ.1.24 లక్షల కోట్లు. రిలయన్స్, అదానీ, టెంపుల్టన్, లులు, జాకీ, అమరరాజా వంటి భారీ పరిశ్రమలు తమ పెట్టుబడుల ప్రతిపాదనలు పూర్తిగా విరమించుకోవడమో, పరిధిని తగ్గించుకోవడమో చేశాయి. జగన్ మాత్రం.. దావోస్ వెళ్లి గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులు తెచ్చానని, అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయించానని పిట్టకథలు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 154 పరిశ్రమల ద్వారా 1,41,333 మందికి ఉపాధి కల్పించనున్నట్లు అబద్ధాలు దట్టించారు. రాష్ట్రంలో డిగ్రీ, ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసుకుని ఏటా సుమారు 2.8 లక్షల మంది పట్టభద్రులు వివిధ విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నారు. జగన్ తీసుకొచ్చిన ‘ఏపీ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్’ చట్టం ప్రకారం చూసినా 1.06 లక్షల మందికి ఆ పరిశ్రమల్లో ఉపాధి దొరికి ఉండాలి. ఈ గణాంకాలే నిజమైతే.. రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగిత 30 శాతానికి పైగా ఎందుకు ఉంది? ప్రభుత్వం చెప్పినట్లు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందిస్తే యువతలో ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె తదితర నగరాలకు వలస ఎందుకు వెళ్తుంది? ఈ ప్రశ్నలకు సీఎంగా జగనే సమాధానం చెప్పాలి.
కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం
నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయంలో జగన్ మోసపూరిత లెక్కలే చెప్పారు. అధిక సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కల్లబొల్లి కబుర్లతో ఐదేళ్లు కాలక్షేపం చేశారు. ‘‘10 ప్రాజెక్టులకు సంబంధించి రూ.91,129.24 కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. వాటి వల్ల 40,500 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రూ.1,06,800 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. వాటి ద్వారా కూడా 72,900 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి’ అని సీఎం జగన్ అసెంబ్లీలో రెండేళ్ల క్రితం ప్రకటించారు. జగన్ చెప్పిన లెక్కల ప్రకారమే ఈ పెట్టుబడుల ద్వారా 1,13,400 మంది యువతకు రాష్ట్రంలో ఉపాధి లభించాలి. కానీ అంతమందికి ఉపాధి దక్కిన జాడనే లేదు. ఎంఎస్ఎంఈల ద్వారా మరో 2.11 లక్షల ఉద్యోగాలు లభించాయంటూ ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. అంతకుమించి యువతకు ఉపాధి కల్పించే విషయమై జగన్ చేసిన కొత్త ప్రయత్నం అంటూ ఏమీ లేదు.
ఇవి కాకుండా గతేడాది మార్చిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో వివిధ సంస్థలతో కుదిరిన రూ.13.12 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాల ద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభిస్తుందంటూ జగన్ గాల్లో లెక్కలు చెప్పారు. ఆ ఒప్పందాలు వాస్తవరూపం దాల్చేది ఎప్పుడు? రాష్ట్ర యువతకు ఉపాధి దక్కేది ఎన్నడు?
ఉపాధి నిజమైతే.. వలసలు ఎందుకు?
రాష్ట్రంలో ఏర్పాటుచేసిన పరిశ్రమల ద్వారా లక్షల మందికి ఉపాధి లభించిందని వైకాపా సర్కారు డాంబికాలు పలుకుతోంది. ప్రభుత్వం చెప్పినట్లు స్థానికంగా ఉపాధి లభిస్తే లక్షల మంది గల్ఫ్ దేశాలకు వలస పోవాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల నుంచి గల్్్ఫ దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రం నుంచి వలస వెళ్లేవారి సంఖ్య ఏటా సుమారు 5 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.
గొప్పలు మినహా మేలు సున్నా..
రాష్ట్రంలో ఏర్పాటుచేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా ప్రభుత్వం ‘ఏపీ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్్స ఇన్ ది ఇండస్ట్రీస్/ఫ్యాక్టరీస్ చట్టం-2019’ తీసుకొచ్చింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆ ప్రాంతంలో మానవ వనరులు అందుబాటులో లేకుంటే.. మానవ వనరులు ఎంత వ్యవధిలో అవసరమో తెలుసుకుని ప్రభుత్వమే శిక్షణ ఇప్పిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకువస్తుంది. కానీ, చట్టం రూపొందించామని జగన్.. గొప్పగా చెప్పుకోవడం మినహా దీని వల్ల నిరుద్యోగ యువతకు పెద్దగా మేలు జరిగింది ఏమీ లేదు.
ఆదేశించడం తప్ప.. ఆచరణలో పెట్టలేదు..
పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉపాధి కల్పించే చట్టాన్ని కట్టుదిట్టంగా అమలుచేయాలని జిల్లా కలెక్టర్లకు హుకుం జారీ చేయడం తప్పించి ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. పరిశ్రమలు తమ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకున్నాయేగానీ.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి.
- ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేసే సంస్థ.. తమకు ఎలాంటి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు అవసరం అనే అంశాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ఇప్పటి వరకు ఏర్పాటైన పరిశ్రమలు ఆ విధానాన్నే పాటించలేదు.. నియామకాలు కూడా చేపట్టలేదు.
- ప్రస్తుతం ఉన్న సంస్థలు.. తమ దగ్గర ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు? వారిలో స్థానికులు 75 శాతం మేరకు ఉన్నారా? అన్న వివరాలను నోడల్ ఏజెన్సీకి సమర్పించాలి. పరిశ్రమల శాఖకు సంస్థలు ఆ వివరాలు అందించిన దాఖలాలే లేవు.
- నియామకాలకు సంబంధించి జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడు నెలలకు ఓ సారి జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి, అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నది నిబంధన. దీన్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల