Prawn: రొయ్యకు ఉక్కపోత
విద్యుత్తు కోతలతో ఆక్వా రంగం కుదేలవుతోంది. ఊపిరాడక రొయ్య ఉక్కిరిబిక్కిరవుతోంది. వాటిని కాపాడుకునేందుకు రైతులు జనరేటర్లు వేసి ఏరియేటర్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. అదనపు భారం పడుతోంది.
విద్యుత్తు కోతలతో రైతుల అవస్థలు
జనరేటర్లతో ఆక్సిజన్ సరఫరా
ప్రాసెసింగ్ ప్లాంట్లలోనూ తగ్గిన శుద్ధి ప్రక్రియ
ఈనాడు, అమరావతి: విద్యుత్తు కోతలతో ఆక్వా రంగం కుదేలవుతోంది. ఊపిరాడక రొయ్య ఉక్కిరిబిక్కిరవుతోంది. వాటిని కాపాడుకునేందుకు రైతులు జనరేటర్లు వేసి ఏరియేటర్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. అదనపు భారం పడుతోంది. రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లకూ విద్యుత్తు కష్టాలు తీవ్రంగానే ఉన్నాయి. 50% విద్యుత్తు మాత్రమే వినియోగించుకోవాలనే నిబంధనతో.. రొయ్యల కొనుగోలు తగ్గించేశారు. ప్రాసెసింగ్ ప్లాంట్లలో పనిచేసే కార్మికులకు ఉపాధి పోయింది. సాగు ఖర్చు పెరిగినా, రొయ్యలకు కిలోకు రూ.30 వరకు ధర తగ్గింది. రూ.లక్షల్లో నష్టాలొస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఎనిమిదేళ్లలో ఎప్పుడూ లేని పరిస్థితి ఇప్పుడు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనరేటర్ లేకుంటే.. రొయ్య గల్లంతే
ఆక్వాసాగులో విద్యుత్తు సరఫరా కీలకం. ఏరియేటర్లను ఆడించి రొయ్యలకు ఆక్సిజన్ అందిస్తారు. గంట పాటు సరఫరా నిలిచినా.. రొయ్యలు ఉక్కిరిబిక్కిరవుతాయి. రూ.లక్షల్లో పెట్టుబడి నష్టపోవాల్సిందే. కాకినాడ జిల్లా పరిధిలో అచ్యుతాపురంలో శుక్రవారం పగలు, రాత్రి నాలుగేసి గంటలు విద్యుత్తు సరఫరా నిలిచింది. దీంతో రైతులు జనరేటర్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. 15 ఎకరాల చెరువుకు రోజుకు రూ.20వేల వరకు ఖర్చవుతోందని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. ఈ లెక్కన నెలకు రూ.6 లక్షల ఖర్చు అదనంగా అవుతోందని చెప్పారు. ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాంతంలో రోజుకు మూడు గంటల చొప్పున విద్యుత్తు సరఫరా నిలిచిపోతోంది.
ప్రాసెసింగ్ ప్లాంట్లలో కష్టాలు
రాష్ట్రంలో 70కి పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఒక్కో దానిలో సగటున 50 టన్నుల రొయ్యలను శుద్ధి చేస్తారు. విద్యుత్తుకోతలతో ఇక్కడ పరిస్థితి తారుమారైంది. గతంలో వినియోగించే విద్యుత్తులో 50% మాత్రమే వాడుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికితోడు వారానికోరోజు సెలవు ఇస్తున్నారు. దీంతో ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు కొనుగోలు తగ్గించేశారు. జనరేటర్కు గంటకు 130 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. దీంతో సేకరణ తగ్గించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో రోజుకు 50 టన్నులు కొనేవాళ్లమని, ఇప్పుడు 27 టన్నులే తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ప్లాంటువారు చెప్పారు. ప్లాంట్లలో గతంలో వెయ్యిమంది పనిచేస్తుండగా.. ఇప్పుడు 400-500 మందే వస్తున్నారని వివరించారు.
12 గంటల్లో ఐస్ వచ్చేదెలా?
ఐస్ తయారు కావాలంటే 24 గంటలు నిరతరాయంగా సరఫరా ఇవ్వాలి. ఇప్పుడు 12 గంటలే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అంటే మిగిలిన 12 గంటలు జనరేటర్ వేయాలి. ఇలాగైతే మూసేసుకోవడమే మేలని నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ఐస్ప్లాంట్ యజమాని వివరించారు. ఐస్క్రీమ్ ఫ్యాక్టరీలకు మినహాయింపు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా.. ఫ్యాక్టరీలో క్రీమ్ లేదంటూ 12 గంటలే వినియోగించుకోమంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. విద్యుత్తు కోతలతో ఇప్పటికే పలు ప్లాంట్లు మూతపడ్డాయన్నారు. రొయ్యలతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేసే చేపలకూ ఐస్ అవసరం. మొత్తంగా చూస్తే ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని రైతులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు వాపోతున్నారు.
* సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చెరువుల్లోని రొయ్యలకు ఆక్సిజన్ తగ్గకుండా చూసుకోవాలి. ఏ మాత్రం తగ్గినా రొయ్య నీటిపై తేలుతుంది. అందుకే రైతులు ఏరియేటర్ల ద్వారా వాటికి ప్రాణవాయువు అందిస్తుంటారు. ఎడాపెడా కోతలతో జనరేటర్లపై ఆధారపడక తప్పడం లేదు. 15 ఎకరాల రొయ్యల చెరువు ఉంటే.. రోజుకు రూ.20వేలు అదనంగా ఖర్చవుతోంది.
* చెరువు నుంచి పట్టిన తర్వాత నుంచి ప్రాసెసింగ్ వరకు కిలో రొయ్యలకు 5 కిలోల ఐస్ అవసరం అవుతుంది. విద్యుత్తు కోతలతో ఐస్ కొరత తీవ్రమైంది. మొన్నటివరకు క్యాన్ ధర రూ.150 ఉండగా.. ఇప్పుడు రూ.300-400 పెట్టినా దొరకడం లేదు. దీంతో ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు రొయ్యల కొనుగోలు తగ్గించేశారు.
రొయ్యల చెరువుల వద్ద జాగారం!
నెల్లూరు, న్యూస్టుడే: సమయపాలన లేకుండా విద్యుత్తు సరఫరా నిలిపేస్తుండటంతో ఆక్వా రైతులు చెరువు కట్టలపై జాగారం చేస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో దాదాపు 700 ఎకరాల్లో ఆక్వా సాగు చేపట్టారు. రెండేళ్లు కరోనా ప్రభావంతో ఇబ్బందులుపడి, నవంబరులో సాగుకు ఉపక్రమించినా వరదలకు చెరువులన్నీ కొట్టుకుపోయాయి. ఇన్ని కష్టాలుపడి ఈ ఏడాది మార్చిలో సాగు ప్రారంభిస్తే విద్యుత్తు కోతలు శాపంలా మారాయి. గంగపట్నంకు చెందిన భాస్కర్రెడ్డి మూడెకరాల చెరువులో వనామీ రకం రొయ్యల సాగు చేపట్టారు. రూ.1.50 లక్షలు పెట్టి చెరువు బాగు చేసి, సీడ్, ఫీడ్ కోసం రూ.5 లక్షలు వెచ్చిస్తే.. సీడ్ వేసిన 15 రోజుల నుంచే జనరేటర్లు పెట్టి ఏరియేటర్లు వినియోగించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో 30కేవీ, 40కేవీ జనరేటర్లకు నెలకు రూ.10వేల అద్దె ఉండగా.. 63కేవీ జనరేటర్లకు రూ.12వేలు వెచ్చించాల్సి వస్తోంది. వీటిని రోజులో నాలుగు గంటలు నడిపినా రూ.2వేల దాకా భారం పడుతోందని వాపోతున్నారు.
- ఈనాడు నెల్లూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..