ఆవుకు మూడు లేగదూడల జననం

తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జలాల్‌పూర్‌లో రైతు లక్ష్మప్పకు చెందిన ఆవుకు ఒకేసారి మూడు లేగ దూడలు పుట్టాయి.

Updated : 05 Dec 2022 04:38 IST

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జలాల్‌పూర్‌లో రైతు లక్ష్మప్పకు చెందిన ఆవుకు ఒకేసారి మూడు లేగ దూడలు పుట్టాయి. సాధారణంగా ఆవులు ఒకసారి ఒకే దూడకు జన్మనిస్తాయి. కొన్ని సందర్భాల్లో రెండు లేగ దూడలు పుట్టిన సంఘటనలు ఉన్నా మూడు పుట్టడం చాలా అరుదని మండల పశువైద్యాధికారి హతీరాం తెలిపారు. ప్రస్తుతం వాటి ఆరోగ్య పరిస్థితి బాగుందని రైతు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని