సంక్షిప్త వార్తలు (8)
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శిర్డీకి ప్రతి రోజూ విమాన సర్వీసును నిర్వహించాలని ఇండిగో సంస్థ నిర్ణయించింది.
నేటి నుంచి విజయవాడ-శిర్డీ విమాన సర్వీసు
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శిర్డీకి ప్రతి రోజూ విమాన సర్వీసును నిర్వహించాలని ఇండిగో సంస్థ నిర్ణయించింది. ఆదివారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆ సంస్థ ప్రతినిధులు శనివారం వెల్లడించారు. సుమారు 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఈ విమానం.. రోజూ మధ్యాహ్నం 12:25 గంటలకు గన్నవరంలో బయలుదేరి 3 గంటలకు శిర్డీ చేరుకుంటుంది. మరో సర్వీసు శిర్డీ నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి.. 04:26 గంటలకు విజయవాడ వస్తుంది. టిక్కెట్ ధరను రూ.4,639 గా నిర్ణయించారు.
విశాఖలో తాత్కాలిక రెడ్జోన్
జీ-20 సదస్సు నేపథ్యంలో నిర్ణయం
విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్టుడే: జీ-20 సన్నాహక సదస్సు జరగనున్న నేపథ్యంలో విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాలను తాత్కాలిక రెడ్జోన్గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేయడాన్ని నిషేధించినట్లు నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. రాడిసన్ బ్లూ రిసార్ట్స్, ముడసర్లోవ పార్కు, కైలాసగిరి, ఆర్కేబీచ్, కాపులుప్పాడ జిందాల్ ఎనర్జీ ప్లాంట్, మాధవధారలతో పాటు సదస్సుకు హాజరైన ప్రతినిధులు ప్రయాణించే వివిధ మార్గాలు రెడ్జోన్ పరిధిలో ఉన్నాయి. ఈనెల 27 రాత్రి 12 గంటల నుంచి 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఆయా ప్రాంతాలకు 2 కి.మీ. పరిధిలో డ్రోన్లతో ఎలాంటి చిత్రీకరణ చేపట్టకూడదని కమిషనర్ వివరించారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి డ్రోన్లతో సహా ఏమైనా సంప్రదాయేతర వస్తువులను ఎగురవేస్తే వాటిని నాశనం చేయటం లేదా జప్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
దుర్గిలో కాకతీయుల నాటి విగ్రహాలు
వెల్దుర్తి, దుర్గి, న్యూస్టుడే: పల్నాడు జిల్లా దుర్గిలోని శివాలయంలో పురాతన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ పునరుద్ధరణలో భాగంగా రెండు రోజులుగా తవ్వకాలు చేపట్టగా విగ్రహాలు వెలుగుచూశాయి. వాటిని శనివారం చరిత్రకారుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. విగ్రహాలు కాకతీయుల కాలం నాటివన్నారు. మహిషాసురమర్దిని, చతుర్ముఖ బ్రహ్మ, చెన్నకేశవస్వామి, చాముండి, సరస్వతి విగ్రహాలుగా గుర్తించారు.
విద్యా హక్కు చట్టం పరిధిలోకి మరిన్ని విద్యా సంస్థలు
ఈనాడు-అమరావతి: విద్యాహక్కు చట్టం పరిధిలోకి మరికొన్ని విద్యా సంస్థలను తీసుకొస్తూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు సొసైటీలు, సంస్థల పరిధిలో ఉన్న సంస్థలకూ ఇక నుంచి విద్యా హక్కు చట్టం వర్తిస్తుంది.
మంగళగిరి ప్లాట్లకు దరఖాస్తులు చేసుకోండి: సీఆర్డీఏ కమిషనర్
ఈనాడు-అమరావతి: మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని నవులూరులో అభివృద్ధి చేస్తున్న జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్షిప్లో ప్లాట్ల కోసం రాష్ట్రంలో ఎక్కడి ప్రభుత్వ ఉద్యోగులైనా దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం కల్పించిన రాయితీ ఉపయోగించుకోవాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ సూచించారు. లేఅవుట్లో 200 చదరపు గజాల ప్లాట్లు 58, 240 చదరపు గజాల ప్లాట్లు 188 అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చదరపు గజానికి రూ.17,499 ధరగా నిర్ణయించామని తెలిపారు. వచ్చే నెల 30 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇతర సందేహాల నివృత్తి కోసం 0866 2527124 ఫోన్ నంబరులో సంప్రదించాలని కమిషనర్ సూచించారు.
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు గడువు పెంపు
ఈనాడు-అమరావతి: రాష్ట్రంలోని బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒక ప్రకటనలో తెలిపారు. మొదట ప్రకటించిన దాని ప్రకారం ఈ నెల 24తో గడువు ముగిసిందన్నారు.
ప్రభుత్వోద్యోగులు ఎక్కడి ఎంఐజీ ప్లాట్లకయినా దరఖాస్తు చేసుకోవచ్చు
ఈనాడు, అమరావతి: పట్టణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల్లో ఇళ్ల స్థలాల (ప్లాట్ల) కోసం ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పని చేసిన చోట అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లలోనే ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న నిబంధనేమీ లేదని పేర్కొంది. లేఅవుట్లలోని మొత్తం ప్లాట్లలో 10% ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించడంతోపాటు ప్లాట్ విలువలో 20% రాయితీ ఇస్తున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ వెల్లడించింది.
క్షయ నివారణలో ఏపీకి 8 జాతీయ పురస్కారాలు
ఈనాడు డిజిటల్, అమరావతి: క్షయ నివారణకు సంబంధించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది పురస్కారాలు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా వారణాసిలో శుక్రవారం జరిగిన ప్రపంచ క్షయ నివారణ సదస్సులో ప్రధాని మోదీ చేతుల మీదుగా పురస్కారాలను ఏపీ అధికారులు అందుకున్నట్లు పేర్కొంది. ఏపీ నుంచి ఏలూరు జిల్లాకు స్వర్ణం, విశాఖపట్నం, కోనసీమ జిల్లాలకు రజతం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు కాంస్యం అందుకున్నాయి. 2015-2022 మధ్య క్షయ నివారణ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం పనితీరుకు ఈ పురస్కారాలు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నౌక స్వాధీనం ఘటన.. భారత నావికుల్లో ఐదుగురికి ఇరాన్ విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
-
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్