Vizianagaram Train Accident: ఆ సమయంలో ఏం జరిగింది?
విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్) నేతృత్వంలో విచారణ మొదలైంది.
విద్యుత్తు సరఫరా నిలిచి ఆగిన పలాస రైలు
ఆ వెనుకే 80 కి.మీ.వేగంతో వచ్చిన రాయగడ ప్యాసింజర్
రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీఆర్ఎస్
ఈనాడు, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్) నేతృత్వంలో విచారణ మొదలైంది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ రైల్వే స్టేషన్ల మధ్య భీమాలి వద్ద ఆగి ఉన్న పలాస రైలును వెనుక నుంచి రాయగడ ప్యాసింజర్ ఢీకొన్న నేపథ్యంలో దిల్లీ, భువనేశ్వర్ నుంచి నిపుణుల కమిటీ సోమవారం ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీసింది. కేబుళ్లకు విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో పలాస రైలు ముందుకు కదల్లేదని ప్రాథమిక పరిశీలన అనంతరం గుర్తించినట్లు సమాచారం. ఆ విషయం సమీప స్టేషన్లకు చేరకపోవడంతో అదే ట్రాక్పైకి రాయగడ రైలు వెళ్లేందుకు సిగ్నల్ ఇవ్వడం ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. పలాస రైలును రాయగడ ప్యాసింజర్ ఢీకొన్నప్పుడు దాని వేగం 80 కి.మీ. వరకు ఉండొచ్చని, ఒక్కసారిగా అంత వేగాన్ని నియంత్రించడమూ సాధ్యం కాదంటున్నారు. ఈ రెండు రైళ్ల మధ్య ప్రయాణ కాల వ్యత్యాసం పది నిమిషాలే ఉన్నా..ఆ సమయం ఎక్కువేనని చెబుతున్నారు.
అన్ని కోణాల్లో: మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్ ఇలా పలు విభాగాలకు చెందిన నిపుణుల కమిటీ.. అన్ని కోణాల్లో ఈ ఘటనపై విశ్లేషిస్తోంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో రైల్వే పోలీసులు (ఆర్పీఎఫ్) తనిఖీ చేశారు. రైల్వే ఐజీ, డీఐజీలు ప్రత్యేక బృందాలతో పరిశీలించారు. డాగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయి. విద్యుత్తు సరఫరా ఆగిపోవడం వెనుక విద్రోహుల దుశ్చర్య ఏమైనా ఉందా అని విశ్లేషిస్తున్నారు.
కోణార్క్కు తప్పిన ముప్పు: విశాఖ నుంచి బయలుదేరిన కోణార్క్ కంకటాపల్లికి చేరుకోవడానికి కొద్ది నిమిషాలకు ముందు భీమాలి వద్ద ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలియడంతో సత్వరమే స్పందించి వెంటనే కంకటాపల్లిలో కోణార్క్ను నిలిపేశారు. లేకుంటే ఘోర ప్రమాదం జరిగేదని ప్రయాణికులు చెబుతున్నారు.
గూడ్సు రైళ్లు లేకుంటే: ప్రమాదం జరిగినప్పుడు ప్యాసింజర్ రైళ్లకు రెండు వైపులా గూడ్సు రైళ్లు లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. ఆగి ఉన్న గూడ్సును ఢీకొని అక్కడితో ఆగిపోవడంతో ప్రమాదం రెండు, మూడు బోగీలకే పరిమితమైంది.
ఆదివారం కావడంతో రైళ్లలో తక్కువగా రద్దీ
ఈనాడు-విశాఖపట్నం, ఎస్.కోట-న్యూస్టుడే: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనా స్థలిలో ధ్వంసమైన బోగీలను చూస్తే తీవ్ర ఆవేదన కలుగుతుంది. రైలు బోగీలు ఒకదానిౖకి ఒకటి ఢీకొనడం.. పక్కనే ఉన్న గూడ్సు రైళ్లపైకి దూసుకువెళ్లడంతో ఇనుప బోగీలు సైతం అట్టపెట్టెల్లా నలిగిపోయాయి. ఈ ఘటనలో ఏడు బోగీలు దెబ్బతిన్నాయి. ఆదివారం రాత్రి ప్రమాదం తరవాత చిమ్మచీకటిలో సహాయక చర్యలు అనుకున్నంత వేగంగా సాగలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత 12మంది మృతదేహాలను సంఘటనా స్థలంలో వెలికితీశారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోమవారం ఉదయం ప్రమాదానికి గురైన బోగీలను తొలగిస్తే మరింత ప్రాణ నష్టం ఉండొచ్చని అందరూ అనుకున్నా...మృతుల సంఖ్య 13కు పరిమితం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ప్రాణ నష్టం అందుకే తగ్గింది
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం తగ్గడానికి పలు కారణాలున్నట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. పలాస ప్యాసింజర్ రైల్లో దెబ్బతిన్న మూడు బోగీల్లో ఒకటి గార్డు బోగీ. వెనుక నుంచి పలాస రైలును ఢీకొట్టిన రాయగడ రైల్లో నాలుగు బోగీలు దెబ్బతిన్నాయి. ఈ రైలుకు ముందు రెండు ఇంజిన్లు ఉండటంతో అవి తొలుత దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఉన్న దివ్యాంగుల బోగీలో ఇద్దరు ముగ్గురే ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి విశాఖ నగరానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే కార్మికులు, ఉద్యోగుల తాకిడి నిత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆదివారం కావడంతో రద్దీ చాలా తక్కువగా ఉంది.
మూడు మార్గాలు ధ్వంసం: విశాఖపట్నం నుంచి కొద్ది నిమిషాల తేడాతో విజయనగరం వైపు బయలుదేరిన పలాస, రాయగడ రైళ్లు ఒకే ట్రాక్పై ఉన్నాయి. ప్రమాదం జరిగిన భీమాలి వద్ద మూడు రైలు మార్గాలున్నాయి. పలాస, రాయగడ రైళ్లు మధ్య మార్గంలో ఉన్నాయి. ఈ రైళ్ల బోగీలు ప్రమాదం తరువాత...రెండు వైపులా ఆగి ఉన్న గూడ్సు రైళ్లపై పడ్డాయి. దీంతో ఈ మూడు మార్గాలూ దెబ్బతిన్నాయి. విద్యుత్తు సరఫరా వ్యవస్థ సైతం ధ్వంసమైంది. అందుకే ప్రమాదం జరిగిన తర్వాత 47 రైళ్లు రద్దు చేసి...24 రైళ్లను దారి మళ్లించారు.
19 గంటల్లో రైళ్ల రాకపోకల పునరుద్ధరణ
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన వెంటనే అధికారులంతా అప్రమత్తమయ్యారు. వెంటనే సిబ్బంది మొత్తం విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టారు. అరగంటలో డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్, ఇతర సాంకేతిక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దివ్యాంగుల బోగీలో మృతదేహాలు ఉండటంతో ట్రాక్ పునరుద్ధరణ చర్యల్లో కొంత జాప్యం జరిగింది. మృతదేహాలను బయటకు తీసి తరలించే వరకు బోగీలను ట్రాక్పైనే ఉంచారు. ఆ తర్వాత హుటాహుటిన ప్రమాద స్థలంలో రైళ్ల బోగీలను తొలగించి, ట్రాక్లను సిద్ధం చేశారు. మొత్తంగా యుద్ధ ప్రాతిపదికన 19 గంటల్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. తూర్పు కోస్తా రైల్వే మేనేజర్ మనోజ్శర్మ, ఇతర సీనియర్ అధికారులు పనులన్నీ పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. రైళ్ల సేవల పునరుద్ధరణకు దాదాపు వెయ్యి మంది కార్మికులు, వివిధ విభాగాల సూపర్వైజర్లు, సిబ్బంది నిర్విరామంగా పని చేశారు.
హావ్డా-చెన్నై రైల్వే ప్రధాన మార్గంలో భద్రతపై విస్తృత సమీక్ష జరపాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. ఈ మేరకు రైల్వేశాఖకు సోమవారం ఆయన లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..!
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
-
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?