రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Published : 07 May 2024 04:37 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, నంద్యాల, జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. సోమవారం పల్నాడు,  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం గుంటూరు జిల్లాలో 11, అల్లూరి సీతారామరాజు 3, కాకినాడ 3, ఎన్టీఆర్‌ జిల్లాలోని 2 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. సోమవారం అత్యధికంగా నంద్యాల జిల్లా బనగానపల్లి, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 45.4, కర్నూలు జిల్లా పంచలింగాల, ప్రకాశం జిల్లా తర్లపాడులో 44.9, పల్నాడు జిల్లా రావిపాడులో 44.6, నెల్లూరు జిల్లా గోనుపల్లిలో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని