సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మధ్యతరగతి చిన్న కమతాల వారికి ఇబ్బందే
టీఆర్ఓగా ఎవరినైనా నియమించడం చట్టంలో తీవ్రమైన లోపం
భూవివాదాలు స్థానిక సివిల్కోర్టుల్లో పరిష్కరించుకునే వీలు లేదు
హైకోర్టును ఆశ్రయించాల్సిందే
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టంపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, గుంటూరు లీగల్: ‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. భూవివాదాలు వచ్చినప్పుడు స్థానిక సివిల్ న్యాయస్థానాల్లో పరిష్కరించుకునే వెసులుబాటు లేకపోవడంతో అందరూ హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. సామాన్యులు, నిరక్షరాస్యులకు ఈ చట్టం తీవ్ర ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది’ అని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ చట్టం లోపభూయిష్ఠంగా ఉండడం వల్ల భవిష్యత్తులో సమాజంలో విపరిణామాలు చోటుచేసుకుంటాయని అభిప్రాయపడ్డారు. ‘టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా (టీఆర్వో) ఎవరినైనా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉండడమే చట్టంలో తీవ్రమైన లోపం. నీతి ఆయోగ్ సూచించిన విధివిధానాలను పూర్తిగా పొందుపరచకుండా చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం వల్ల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది’ అని ఆయన తెలిపారు.
‘చాలామందికి చిన్న చిన్న కమతాలే ఉన్నందున ఈ చట్టంపై అందరికీ అవగాహన లేక పెద్దఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. దూరప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నవారికి మరీ ఇబ్బందులు రావచ్చు. ఆస్ట్రేలియాలో అమలవుతున్న ఈ చట్టాన్ని.. ఇక్కడ అమలు చేయడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం బాధ్యత తీసుకుని బీమా ద్వారా రక్షణ కల్పిస్తోంది. ఇక్కడ ప్రభుత్వ పరంగా అలాంటి వెసులుబాటును చట్టంలో పేర్కొనలేదు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఎవరినైనా ప్రభుత్వం నియమించుకోవచ్చనే నిబంధన మరీ ప్రమాదకరమైంది. దీని ద్వారా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వారికి అనుకూలమైన వారిని టీఆరోవోగా నియమించుకోవచ్చు. దీనికి ఎలాంటి అర్హతలు, విధానాలు నిర్దేశించలేదు. ఈ అధికారులకు నిర్ణీత కాలపరిమితి కూడా లేదు. ఎవరినైనా నియమించుకోవచ్చనే అంశమే చట్టవిరుద్ధం. దీనివల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఈ చట్టంపై బాధితులకు అవగాహన లేకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. టీఆర్వో వెలువరించిన నిర్ణయంపై కాలపరిమితి లోపల మేల్కొనకపోతే ఆస్తులు కోల్పోవచ్చు. మధ్యతరగతి, చిన్న చిన్న కమతాలు ఉన్నవారు, గ్రామీణులు ఇబ్బందులు ఎదుర్కొంటారు’ అని విశ్రాంత న్యాయమూర్తి పేర్కొన్నారు.
అధికారుల చేతుల్లోకి చట్టం
‘ఇప్పటికే అమలులో ఉన్న పలు చట్టాలకు ఏపీ భూయాజమాన్య హక్కు చట్టంలో రూపొందించిన నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి. వందేళ్ల క్రితం నుంచి దేశంలో అమలులో ఉన్న సివిల్ ప్రొసీజర్ కోడ్లోని నిబంధనలు ఈ చట్టం పరిధిలోకి తీసుకురాలేదు. దీంతో టీఆర్వో విధి విధానాలపై స్పష్టత లేదు. ఇప్పటివరకు స్వల్ప స్థాయి భూవివాదాలను స్థానిక కోర్టుల్లోనే పరిష్కరించుకుని బాధితులు ఉపశమనం పొందుతున్నారు. ఈ చట్టం ద్వారా బాధితులు హైకోర్టును మాత్రమే ఆశ్రయించాలి. దీనివల్ల హైకోర్టులో మరింత పనిభారం పెరిగి వివాదాల పరిష్కారానికి జాప్యం జరగడంతో పాటు బాధితులపై మోయలేని ఆర్థికభారం పడుతుంది. హైకోర్టు దాకా వెళ్లలేని సామాన్యులు నిస్సహాయస్థితిలో వారి ఆస్తులపై హక్కులను వదులుకోక తప్పదు. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమితులయ్యే వ్యక్తికి ఎలాంటి అర్హతా నిర్ధారించకపోవడంతో వారికి భూహక్కులు, చట్టాలపై కనీస అవగాహన ఉండే అవకాశం లేదు. దీంతో బాధితులకు న్యాయపరమైన రక్షణ, భరోసా కల్పించే అవకాశం తక్కువ. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం’ అని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. -
సింహాచలంలో విద్యుత్ బస్సు
తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
కిర్గిజ్స్థాన్లో దాడులు.. ఇక్కడి తల్లిదండ్రుల్లో ఆందోళన
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో గత రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య విద్యకు ఏపీ నుంచి కిర్గిజ్స్థాన్ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. -
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
సిట్ పర్యటన వేళ పల్నాడులో కేసులు
పోలింగ్ నేపథ్యంలో జరిగిన గొడవలు, దాడుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న వేళ.. పోలీసులు కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. -
డ్రమ్ములు, డబ్బాలు, సీసాల్లో పెట్రోలు, డీజిల్ పోయొద్దు
డ్రమ్ములు, డబ్బాలు, సీసాల్లో పెట్రోలు, డీజిల్ నింపవద్దని పెట్రోలు బంకుల యాజమాన్యాలను జిల్లాల ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా జూన్ 10 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, వాహనాలకు మాత్రమే వాటిని నింపాలని కలెక్టర్(పౌరసరఫరాలు) పేరుతో నోటీసులు పంపారు. -
ఎన్ని కేసులు పెట్టారు.. ఎంతమందిని అరెస్టు చేశారు?
-
5 రోజుల్లో రూ.7,546 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఫైనాన్స్ కోడ్ ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నామని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
భయపెడుతున్న రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు రూ.55 లక్షల జరిమానా
బోధన నిపుణుల కొరత, ఇతర లోపాల కారణంగా రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) జరిమానాలు విధించింది. ఎంబీబీఎస్ సీట్లు, ఇతరత్ర వాటి గుర్తింపు పునరుద్ధరణకు కళాశాలల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ఎన్ఎంసీ అధికారులు పలు లోపాలు గుర్తించారు. -
నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన
సుమారు రెండు నెలలకు పైగా ఎన్నికల ప్రచారం కోసం వరుస పర్యటనలతో తలమునకలైన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు.. -
‘పది’లో ఈ ఏడాది సీబీఎస్ఈ పాఠ్యపుస్తకాలు
రాష్ట్రంలో ఈ ఏడాది పదో తరగతి సిలబస్ మొత్తం మారిపోయింది. పాత పాఠ్యపుస్తకాలు పూర్తిగా మారాయి. 2023-24 వరకు రాష్ట్ర సిలబస్ పాఠ్యపుస్తకాలు ఉండగా.. 2024-25 విద్యా సంవత్సరానికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ-సీబీఎస్ఈ) సిలబస్ పాఠ్యపుస్తకాలను ముద్రించారు. -
ఇదీ సంగతి
తాజా వార్తలు (Latest News)
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి