NV Ramana:కోర్టులు ఆధునికం కావాలి
కోర్టులను ఆధునికంగా తీర్చిదిద్దితే ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయవ్యవస్థకు సంబంధించి పలు సమస్యలపై కేంద్రానికి లేఖలు రాసినా ఇంతవరకూ సరైన స్పందన లేదని చెప్పారు. ఆదివారం వరంగల్లో ‘పది కోర్టుల భవన సముదాయం’ ప్రారంభోత్సవానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మతో కలిసి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ...
అప్పుడే సత్వర న్యాయం సాధ్యం
న్యాయవ్యవస్థ సమస్యలపై కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
వరంగల్లో పది కోర్టుల భవన సముదాయం ప్రారంభం
వరంగల్లో న్యాయస్థాన భవన సముదాయాన్ని ప్రారంభించి ప్రసంగిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ఈనాడు, వరంగల్ - న్యూస్టుడే, వరంగల్ న్యాయవిభాగం: కోర్టులను ఆధునికంగా తీర్చిదిద్దితే ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయవ్యవస్థకు సంబంధించి పలు సమస్యలపై కేంద్రానికి లేఖలు రాసినా ఇంతవరకూ సరైన స్పందన లేదని చెప్పారు. ఆదివారం వరంగల్లో ‘పది కోర్టుల భవన సముదాయం’ ప్రారంభోత్సవానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మతో కలిసి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. న్యాయస్థాన భవనాల సముదాయాన్ని ప్రారంభించి ప్రసంగించారు.
‘‘దేశవ్యాప్తంగా కోర్టుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు ‘భారత మౌలిక వసతుల సంస్థ’ను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ మంత్రిత్వ శాఖకు జులైలోనే లేఖ రాసినా.. ఇంతవరకు సరైన స్పందన రాలేదు. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టం రూపంలో తీసుకొస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నా. కొవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో తాలుకాల్లోని కోర్టుల్లో మొబైల్ వ్యాన్ కోర్టుల ఏర్పాటుపై లేఖ రాసినా, కొవిడ్తో నష్టపోయిన న్యాయవాదులకు ఆర్థిక సాయం చేయాలని కోరినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వరంగల్ నుంచి కూడా సుప్రీంలో కేసు వాదించే అవకాశం వీడియో కాన్ఫరెన్స్ సాంకేతికతతో ఉంది. కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ సిస్టం ఏర్పాటు చేయాలని, లేదంటే చాలామంది పేద న్యాయవాదులు తమ వృత్తిని కోల్పోతే ఒక తరానికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పా. అవసరమైతే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సర్వీస్ ప్రొవైడర్ల నుంచి తాలుకాకు ఒక మొబైల్ నెట్వర్కింగ్ వ్యాన్ పెడితే న్యాయవాదులు అక్కడికి వచ్చి వాదనలు వినిపించే అవకాశం ఉందని సూచించా. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. న్యాయస్థానాల్లో సరిపడా న్యాయమూర్తుల నియామకం, మౌలిక వసతుల కల్పన, న్యాయవాదులకు ఆర్థిక సాయం.. ఈ మూడు సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించాలని కేంద్రాన్ని కోరుతున్నా’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
వరంగల్లోని భద్రకాళి ఆలయంలో ఆశీర్వచనం అందుకుంటున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు,
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ దంపతులు
నా కలలకు ప్రతిరూపంగా కోర్టు నిర్మాణం..
వరంగల్ న్యాయపరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు ప్రత్యేక శ్రద్ధతో వరంగల్లో కోర్టు నూతన భవన నిర్మాణానికి కృషిచేశారు. నేను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో శిథిలావస్థలోని న్యాయస్థానాలను పునర్నిర్మించి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నా. వరంగల్ కోర్టు నిర్మాణం నా కలలకు ప్రతిరూపంగా జరిగింది. ఇక్కడి ఏర్పాట్లను పుస్తకం, వీడియోలుగా రూపొందిస్తే మిగతా రాష్ట్రాల్లోని న్యాయస్థానాలకు పంపించి దీన్నో నమూనాగా తీసుకోవాలని చెబుతా.
రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనం..
వరంగల్ న్యాయస్థానంలోని 23 కోర్టుల్లో 71,248 కేసులు పెండింగులో ఉన్నాయి. ఒక కేసు రెండో సబ్ కోర్టులో ఏకంగా 1984 నుంచీ అపరిష్కృతంగా ఉంది. పెండింగు కేసులు పెరిగిపోవడానికి జడ్జిల కొరత ఒక్కటే కారణం కాదు.. సరైన మౌలిక వసతులు లేని కోర్టుల్లో న్యాయమూర్తులు పనిచేయాలనుకోవడం దురాశే. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా ఇక్కడి కోర్టు భవన సముదాయాన్ని రాష్ట్ర నిధులతో నిర్మించడం తెలంగాణ ప్రభుత్వ గొప్పతనం.
సాహిత్యానికి పెద్దపీట
తెలుగు భాష, సంస్కృతిని అమితంగా అభిమానించే జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రసంగంలో సాహిత్యానికి పెద్దపీట వేశారు. అచ్చతెలుగులో ప్రసంగించారు. ‘తెలుగు బిడ్డవై ఉండి తెలుగు రాదని చెప్పుట సిగ్గులేదెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అంటూ నా గొడవలోని కవితా పంక్తులతో పాటు.. ‘ఓ నిజాం పిశాచమా, కానరాడు నిన్ను పోలిన రాజుమాకెన్నడేని, తీగలను తెంపి అడవిలోకి దింపావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి మాటలను ఉటంకిస్తూ.. పోరుగల్లుకు వందనం, ఓరుగల్లుకు వందనం, వరంగల్లుకు వందనం.. అంటూ సాహిత్యాభిమానాన్ని చాటుకున్నారు. ‘కాకతీయ కీర్తి కమనీయమైన కాంతిపుంజమై వెలుగు దారులు చూపి నడిపించు ఆంధ్రులకు కాకలు తీరిన యోధుల కన్నెదరిమ కర్పూరపు పరిమళమై కాలమంత వ్యాపించె, కళలు నిండిన ఓరుగంటి పట్టణం, కలల ఫలమై నిలిచె కనులకు కట్టినట్టు కనిపించె నాటి వైభవ చిత్రాలివి, నేటికీ ఈనాటికీ మదిగెల్చు చరిత్ర సాక్ష్యాలివే’ అంటూ గుక్క తిప్పుకోకుండా జస్టిస్ ఎన్వీ రమణ కవితను చదవడంతో సభ చప్పట్లతో మార్మోగింది. వరంగల్ దేశానికి ప్రధానమంత్రిని అందించిందంటూ పీవీని స్మరించుకున్నారు. రామప్ప దివ్య క్షేత్రం అద్భుతమని సీజేఐ కొనియాడారు. కాకతీయ రాజుల ఘనమైన వారసత్వ కట్టడాలకు దీటుగా నేడు కోర్టు భవనం నిర్మించారని ప్రశంసించారు. వరంగల్లో తనకు బంధువులు, మిత్రులు ఉన్నారని.. ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉందని.. గతంలో సాహిత్య సదస్సులకు హాజరయ్యాయని చెప్పారు. ‘మాతృభాషలో మాట్లాడండి.. మాతృమూర్తిని ప్రేమించండి.. మాతృభూమిని అభిమానించండి. ఇంట్లో పిల్లలు తెలుగులోనే మాట్లాడేలా చూడండి..’ అంటూ జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రసంగాన్ని ముగించారు.
రాష్ట్రమంతటా ఉండాలి
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర మాట్లాడుతూ.. వరంగల్లో నిర్మించిన కోర్టు భవనం తరహాలో రాష్ట్రంలోని అన్ని కోర్టులు ఉండాలని ఆకాంక్షించారు. అడ్వొకేట్ జనరల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం చెప్పి కోర్టు నిర్మాణాలకు కావాల్సిన నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఆదివారం ఉదయం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ దంపతులు భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..