Billionaires: సంపద కొండంత..పన్ను కాసింత!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్న కొంతమంది ప్రముఖ అమెరికన్లు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలు ఇప్పుడు ఆ దేశంలో సంచలనంగా మారాయి. వీటిని ప్రోపబ్లికా అనే మీడియా సంస్థ త......
అమెరికా ధనవంతుల ఐటీ చెల్లింపులపై ప్రోపబ్లికా ఆసక్తికర కథనం
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్న కొంతమంది ప్రముఖ అమెరికన్లు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలు ఇప్పుడు ఆ దేశంలో సంచలనంగా మారాయి. వీటిని ప్రోపబ్లికా అనే మీడియా సంస్థ తమ పరిశోధనాత్మక కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. గత 15 ఏళ్ల ‘ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)’ డేటా రికార్డులను సంపాదించి ఈ విషయాలు బయటకు తెచ్చినట్లు ప్రోపబ్లికా పేర్కొంది. ధనవంతుల జాబితాలోని తొలి 25 మంది ఆదాయ పన్ను వివరాలు విస్తుగొల్పుతున్నాయి. వారి సంపద పెరిగిన తీరుకు, చెల్లిస్తున్న పన్నుకు ఏమాత్రం పొంతన లేదని ప్రోపబ్లికా అభిప్రాయపడింది.
అమెరికా పన్ను వ్యవస్థ చాలా పటిష్ఠమైందన్న వాదన వట్టిదేనని దీంతో తేలిపోయిందని ప్రోపబ్లికా వ్యాఖ్యానించింది. అగ్రరాజ్యంలో ప్రతిఒక్కరూ తమ వాటా పన్ను నిజాయతీగా చెల్లిస్తారని.. ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో కుబేరులు భారీ మొత్తంలో అందజేస్తారని ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారని పేర్కొంది. అయితే, ఈ సమాచారాన్ని ఇంకా ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే, ప్రముఖుల వ్యక్తిగత సమాచారం బయటకు ఎలా పొక్కిందంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని.. సమాచారాన్ని బయకు లీక్ చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
2007లో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ అప్పటికే మల్టీబిలియనీర్గా ఉన్నప్పటికీ ఒక్క డాలర్ కూడా ఆదాయపు పన్ను కింద చెల్లించలేదు. 2011లోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక టెస్లా వ్యవస్థాపకుడు, ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలన్ మస్క్ సైతం 2018లో ఒక్క డాలర్ కూడా ఆదాయపు పన్ను చెల్లించలేదు. మైకేల్ బ్లూమ్బెర్డ్, బిలియనీర్ ఇన్వెస్టర్ కార్ల్ ఇకాన్, జార్జ్ సోరోస్ సైతం పలు సార్లు ఒక్క డాలర్ ఆదాయపు పన్ను కూడా చెల్లించలేదు. దీంతో పాటు వారెట్ బఫెట్, బిల్గేట్స్, రూపర్ట్ ముర్డోచ్, మార్క్ జుకర్బర్గ్ వంటి ప్రముఖులకు సంబంధించి విస్తుగొలిపే ఆర్థిక విషయాలు ఐఆర్ఎస్ డేటా ద్వారా బయటకు వచ్చాయని ప్రోపబ్లికా పేర్కొంది.
అమెరికాలో సగటున ఒక్కో వ్యక్తి ఏడాదికి 70 వేల డాలర్లు ఆర్జిస్తున్నాడని ప్రోపబ్లికా తెలిపింది. దీంట్లో 14 శాతం పన్ను కింద చెల్లిస్తున్నారని పేర్కొంది. ఇక 6,28,300 డాలర్లకు పైగా ఆర్జించే దంపతులు గరిష్ఠంగా 37 శాతం ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని తెలిపింది. కానీ, కుబేరులు మాత్రం ఈ వ్యవస్థను చాలా విజయవంతంగా కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోందని.. ధనవంతులు పన్ను ఎలా ఎగవేశారు? ఎలాంటి పద్ధతులను అనుసరించారు? చట్టంలో వారికి సహకరించిన అంశాలేంటి? అనే అంశాలపై తదుపరి కథనాల్లో వెల్లడిస్తామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..