Gold Rate: పెరిగిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలతో ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం పెరిగింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై......

Published : 21 Jun 2021 17:38 IST

దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం కాస్త పెరిగింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.250లు పెరగడంతో రూ.46,277కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ. 46,027గా ఉంది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు పుంజుకోవడం, రూపాయి విలువ తగ్గడంతో పసిడి ధర పెరిగినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. మరోవైపు, వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండిపై రూ.258లు పెరగడంతో కిలో వెండి ధర సోమవారం రూ.66,842కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర అత్యధికంగా 1782 డాలర్లుగా ట్రేడ్‌ అవుతుండగా.. ఔన్సు వెండి ధర స్వల్పంగా పెరిగి 26.05 డాలర్లుగా ఉంది. గత వారం 15 నెలల్లో అత్యంత క్షీణతను నమోదు చేసిన బంగారం సోమవారం కాస్త పుంజుకున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ (కమోడటీస్‌) సీనియర్‌ విశ్లేషకుడు  తపన్‌ పటేల్‌ తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,600లకు పైగా ట్రేడ్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని