Oil Prices: మ‌ళ్లీ పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు

దేశంలో చ‌మురు ధ‌ర‌లు మ‌రోసారి పెరిగాయి. ఈ నెల‌లో ఇప్ప‌టికే 12 సార్లు ధ‌ర‌ల‌ను పెంచిన చ‌మురు సంస్థ‌లు ఇవాళ

Published : 23 May 2021 10:37 IST

దిల్లీ: దేశంలో చ‌మురు ధ‌ర‌లు మ‌రోసారి పెరిగాయి. ఈ నెల‌లో ఇప్ప‌టికే 12 సార్లు ధ‌ర‌ల‌ను పెంచిన చ‌మురు సంస్థ‌లు ఇవాళ  పెట్రోల్‌పై 18 పైస‌లు, డీజిల్‌పై 29 పైసలు పెంచాయి. దిల్లీలో పెట్రోల్ ధ‌ర రూ.93.21పైస‌లు, డీజిల్ ధ‌ర రూ.84.07 పైస‌లకు చేరింది. ముంబ‌యిలో పెట్రోల్ ధ‌ర సెంచ‌రీకి చేరువైంది.
అక్క‌డ‌ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.99.49, డీజిల్ ధ‌ర రూ.91.30గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.96.88, డీజిల్ లీటర్ ధర రూ. 91.65గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని