పీఎమ్జేడీవై ఖాతాదారులకు రూ.2 లక్షల బీమా
పీఎమ్జేడీవై ఖాతాలకు సగటు నెలవారీ బ్యాలెన్స్ను మినహాయించామని ఎస్బీఐ తెలిపింది
దేశంలోని అగ్ర రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన జన ధన్ ఖాతాదారులకు ఎస్బీఐ రూపే జాన్ ధన్ కార్డ్' కోసం దరఖాస్తు చేసుకుంటే వారు ప్రమాద బీమా కవరును రూ. 2 లక్షల వరకు పొందవచ్చని వెల్లడించింది.. వెంటనే ఎస్బీఐ రూపే జన్ధన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని వినియోగదారులకు తెలిపింది.
ప్రధాన మంత్రి జన-ధన్ యోజన (పిఎమ్జెడివై) గ్రామీణ, పట్టణ గృహాల కవరేజీపై దృష్టి సారించింది. పీఎమ్జేడీవై బ్యాంకింగ్ / పొదుపు, డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పెన్షన్ వంటి ఆర్థిక సేవలను సులభతరం చేస్తుంది. పీఎమ్జేడీవై ఖాతాలకు సగటు నెలవారీ బ్యాలెన్స్ను మినహాయించామని ఎస్బీఐ తెలిపింది.
జన ధన్ ఖాతా ఎవరికి?
10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఎవరైనా జన ధన్ ఖాతా తెరవవచ్చు. మీ పొదుపు ఖాతాను కూడా జన ధన్ యోజన ఖాతాకు బదిలీ చేయవచ్చు.
పీఎంజేడీవై తెరవడానికి అవసరమైన పత్రాలు
* ఆధార్ కార్డు / ఆధార్ నంబర్ లేదా ఆధార్ కలిగి ఉన్నట్లు రుజువు అందుబాటులో ఉంటే ఇతర పత్రాలు అవసరం లేదు. చిరునామా మారితే, ప్రస్తుత చిరునామా స్వీయ ధృవీకరణ సరిపోతుంది.
* ఆధార్ కార్డ్ అందుబాటులో లేకపోతే ఓటరు ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ & ఎన్ఆర్ఈజీఏ కార్డ్ వంటివి ఉంటే సరిపోతుంది. ఈ పత్రాల్లో మీ చిరునామాను కూడా కలిగి ఉంటే, అది గుర్తింపు కార్డుగా, చిరునామా రుజువుగా కూడా ఉపయోగపడుతుంది.
జన ధన్ ఖాతా ప్రత్యేక ప్రయోజనాలు:
*డిపాజిట్పై వడ్డీ
* ప్రమాద బీమా రూ. 1 లక్షలు (కొత్త పీఎంజేడీవై ఖాతాలకు రూ. 2 లక్షలు)
* కనీస బ్యాలెన్స్ అవసరం లేదు.
* భారతదేశం అంతటా సులభంగా డబ్బు బదిలీ
* ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఈ ఖాతాల్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ లభిస్తుంది.
* ఖాతా తెరిచిన 6 నెలలు తరువాత, అర్హత ప్రమాణాలకు లోబడి ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం అనుమతించబడుతుంది.
* పెన్షన్, భీమా ఉత్పత్తులకు ప్రాప్యత.
మరోవైపు ప్రధాన్ మంత్రి జన ధన్ యోజన (పిఎంజెడివై) కింద మొత్తం 41.75 కోట్ల ఖాతాలు తెరిచినట్లు ప్రభుత్వం తెలిపింది. అందులో 35.96 కోట్ల ఖాతాలు పనిచేస్తున్నాయి. లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్