Tata Motors: వాణిజ్య వాహనాల ధరలు పెంచిన టాటామోటార్స్
టాటామోటార్స్ వాణిజ్య వాహనాల ధరలను పెంచింది. ఈ పెంపు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం ప్రకటించింది. ముడిపదర్థాల ధరలు పెరడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.
ఇంటర్నెట్డెస్క్: టాటామోటార్స్ వాణిజ్య వాహనాల ధరలను పెంచింది. ఈ పెంపు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం ప్రకటించింది. ముడిపదార్థాల ధరలు పెరడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ఇటీవల కాలంలో స్టీలు, విలువైన లోహాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పెరుగుదల సుమారు 2 శాతం వరకు ఉండొచ్చు. మోడల్ని బట్టి ఇది మారుతుంటుంది.
టాటామోటార్స్ దేశంలోనే వాణిజ్య వాహనాలు తయారు చేసే అతిపెద్ద సంస్థ. ఈ సంస్థ బస్సులు, ట్రక్కులు, తేలికపాటి వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తట్టుకోవడానికి వీలైనంత తక్కువగానే ధరల పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ నెల మొదట్లో దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కూడా మరోసారి ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపు వాహనాలను బట్టి 1.9శాతం వరకు ఉంది. వాస్తవానికి మారుతీ ఈ ఏడాది ధరలను మూడుసార్లు పెంచింది. ఇక ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటార్ కార్ప్ కూడా రూ.3 వేల వరకు ధరను పెంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?