పన్ను చెల్లింపుదారులు ఈ తేదీలను గుర్తుంచుకోండి
పాన్-ఆధార్తో అనుసంధానించడానికి గడువు మార్చి 31, 2021 వరకు పొడగించింది
వివిధ పన్నులకు సంబంధించిన చివరి తేదిలను ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే చాలాసార్లు సవరించింది. కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా పన్ను చెల్లింపు గడువులను వాయిదా వేస్తూ వచ్చింది. జూలైలో ఆదాయపన్ను శాఖ ఆర్థిక సంవత్సరం 2020 కోసం ఐటిఆర్ను దాఖలు చేయడానికి గడువును పొడిగించింది. దీంతోపాటు 2019 ఆర్థిక సంవత్సర ఆలస్య చెల్లింపుల గడువును కూడా పెంచింది. 2020 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆదా పెట్టుబడులు పెట్టడానికి గడువు జూలై 31 న ఆమోదించింది.
మీ పన్ను సంబంధిత పనులను సకాలంలో పూర్తి చేయడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన తేదీలు…
ఆగస్ట్ 15
2020 ఆర్థిక సంవత్సరానికి ఫారం 16 జారీకి చివరి తేది:
మీరు వేతనజీవులైతే ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఫారం 16 అవసరం. అందులో మీరు తీసుకున్న వేతనం, టీడీఎస్, పన్ను ఆదా పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. టీడీఎస్ దాఖలు చేసేందుకు సంస్థలకు గడువును ప్రభుత్వం జులై 31 వరకు పెంచింది. సాధారణంగా టీడీఎస్ దాఖలు చేసిన 15 రోజుల్లోపు ఉద్యోగులకు సంస్థ ఫారం 16 జారీచేయాల్సి ఉంటుంది. అందుకే ఆగస్ట్ 15 లోపు మీకు ఫారం 16 జారీచేయకపోతే ఒకసారి సంస్థను సంప్రదించడం మంచిది.
సెప్టెంబర్ 30
మూలధన లాభాల తిరిగి పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ:
మూలధన లాభాలపై పన్ను ఆదా చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి గడువు కూడా పొడిగించింది. “రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులను అమ్మడం ద్వారా మీరు ఏదైనా దీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్టిసిజి) పొందితే, పేర్కొన్న బాండ్లలో అదే పెట్టుబడి పెట్టడం ద్వారా లేదా నిర్దిష్ట వ్యవధిలో నివాస ఆస్తులను కొనుగోలు చేయడం లేదా నిర్మించడం ద్వారా పన్ను మినహాయించవచ్చు. సాధారణంగా మార్చి 20 నుంచి సెప్టెంబర్ 29 మధ్య చేయాల్సిన పెట్టుబడుల కోసం (ఎల్టిసిజిపై మినహాయింపు పొందటానికి) పన్ను శాఖ సెప్టెంబర్ 30 వరకు కాలపరిమితిని పొడిగించింది.
2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆలస్యంగా దాఖలు చేసే ఐటీఆర్ గడువు వరుసగా మూడోసారి సెప్టెంబర్ 30 వరకు పెరిగింది. ఇంతకుముందు ఒకసారి జూన్ 30, ఆ తర్వాత జులై 31 గా రెండుసార్లు సవరించగా ఇప్పుడు మరోసారి గడువు పెంచింది. ఆలస్యమైన ఐటీఆర్ అంటే గడువు తర్వాత దాఖలు చేసేవి. ఇవి సాధారణంగా మదింపు సంవత్సరంలో జులై 31 వరకే చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు 2019 ఆర్థిక సంవత్సరానికి ఐటిఆర్ దాఖలు చేయాల్సిన తేదీ ఆగస్టు 31, మదింపు సంవత్సరం మార్చి 2020 వరకు ఉంది. ఆలస్యమైన ఐటీర్ దాఖలు చేసేందుకు రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కూడా ఇచ్చిన గడువులోపు ఫైలింగ్ చేయపోతే పన్ను శాఖ మీకు నోటీసులు పంపిస్తుంది. ఆ తర్వాత చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తుంది.
నవంబర్ 30
ఇది 2019- 2020 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేది. గడువు పొడగింపు కావడంతో ఆలస్య రుసుము నవంబర్ వరకు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఇది వర్తిస్తుంది.
చెల్లించని పన్నుపై వడ్డీపై సడలింపు:
2020 ఆర్థిక సంవత్సరం కోసం చెల్లించని పన్నుపై విధించాల్సిన వడ్డీపై ఆదాయపన్ను శాఖ కొంత సడలింపును అందించింది. పన్ను చెల్లింపుదారులందరికీ, బ్యాలెన్స్ ట్యాక్స్ బాధ్యత (టిడిఎస్ తరువాత) ఒక లక్షకు మించకపోతే సెక్షన్ 234 ఎ కింద వడ్డీ వర్తించదు. బ్యాలెన్స్ టాక్స్ బాధ్యత లక్షకు మించి ఉంటే, అప్పుడు పన్ను చెల్లింపుదారుడు సెక్షన్ 234 ఎ కింద నెలకు 1శాతం లేదా 2020 ఆగస్టు 1 నుంచి పన్ను చెల్లించే తేదీ వరకు నెలలో కొంత భాగానికి వడ్డీకి బాధ్యత వహిస్తాడు.
ఇంకా, సెక్షన్ 234 ఎ కింద చెల్లించని పన్నుపై చెల్లించాల్సిన వడ్డీపై సీనియర్ సిటిజన్లకు సడలింపు ప్రకటించింది. వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం లేని సీనియర్ సిటిజన్లకు, వారు జూలై 31, 2020 వరకు FY20 కోసం ఏదైనా పన్ను చెల్లించినట్లయితే, ఈ చెల్లింపు తర్వాత మిగిలిన పన్ను బాధ్యత రూ. 1 లక్ష కన్నా తక్కువ ఉంటే, అప్పుడు 30 నవంబర్ 2020 వరకు పొడిగించిన గడువు తేదీ నాటికి ఐటిఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం చేసినందుకు సెక్షన్ 234 ఎ కింద వారికి వడ్డీ వర్తించదు
అయితే, జూలై 31, 2020 దాటిన బ్యాలెన్స్ టాక్స్ బాధ్యత రూ. లక్షకు మించి ఉంటే సెక్షన్ 234 ఎ కింద అటువంటి రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు వడ్డీకి బాధ్యత వహిస్తారు.
అలాగే, ముందస్తు పన్ను చెల్లించాల్సిన పన్ను చెల్లింపుదారులు (టిడిఎస్కు అకౌంటింగ్ చేసిన తర్వాత రూ.10,000 కంటే ఎక్కువ పన్ను బాధ్యత కలిగిన పన్ను చెల్లింపుదారులు) ముందస్తు పన్ను చెల్లించడంలో ఆలస్యం లేదా డిఫాల్ట్ కోసం సెక్షన్లు 234 బి మరియు 234 సి కింద వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుడు ముందస్తు పన్నును జమ చేయకపోతే లేదా ముందస్తు పన్ను జమ చేసిన మొత్తం పన్ను బాధ్యతలో 90% కన్నా తక్కువ ఉంటే సెక్షన్ 234 బి కింద వడ్డీ వర్తిస్తుంది. నిర్ణీత త్రైమాసిక వాయిదాల ప్రకారం పన్ను చెల్లింపుదారుడు ముందస్తు పన్నును జమ చేయకపోతే సెక్షన్ 234 సి కింద వడ్డీ పడుతుంది
డిసెంబర్ 31
వివాద్ సే విశ్వాస్ స్కీమ్ చివరితేది:
ప్రత్యక్ష పన్ను వివాదాలను పరిష్కరించడానికి 2020 బడ్జెట్లో ప్రభుత్వం వివాద్ సే విశ్వస్ పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం, 2020 జనవరి 31 న లేదా అంతకు ముందు పెండింగ్లో ఉన్న పన్ను పిటిషన్లు ఉన్న వారందరూ వివాదాస్పదమైన మొత్తాన్ని డిసెంబర్ 31 పొడిగించిన గడువుకు లేదా అంతకు ముందే చెల్లించినట్లయితే, వడ్డీ లేదా జరిమానా పూర్తిగా మాఫీ పొందవచ్చు.
మార్చి 31, 2021
పాన్ -ఆధార్ అనుసంధానానికి చివరితేది:
మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ను ఆధార్తో అనుసంధానించడానికి గడువు 31 మార్చి 2021 వరకు పొడగించింది. మీరు మీ పాన్ను నిర్ణీత తేదీకి ముందే లింక్ చేయకపోతే, అది పనిచేయనిదిగా పరిగణిస్తారు. మీరు పనిచేయని పాన్ ఉపయోగిస్తుంటే, ఉపయోగిస్తున్న ప్రయోజనాన్ని బట్టి పన్ను శాఖ మీపై రూ. 10,000 జరిమానా విధించవచ్చు.పన్ను సంబంధిత పనులను సకాలంలో పూర్తి చేయడానికి ఈ తేదీలను గుర్తుంచుకోండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM