Air India: నయా లుక్‌లో ‘ఎయిరిండియా’ సిబ్బంది.. ఫొటోలు వైరల్‌!

‘ఎయిరిండియా’ విమానయాన సంస్థ తన సిబ్బంది కోసం రూపొందించిన సరికొత్త యూనిఫాంల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

Published : 12 Dec 2023 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎయిరిండియా (Air India)ను కొనుగోలు చేసినప్పటినుంచి దాని అభివృద్ధిలో భాగంగా ‘టాటా గ్రూప్‌ (Tata Group)’.. వివిధ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇటీవల సంస్థ లోగో (Logo), ఎయిర్‌క్రాఫ్ట్‌ లివరీ (విమానాల రూపు)లో మార్పులు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా సంస్థ పైలట్లు, క్యాబిన్‌ క్రూ సహా సంస్థ సిబ్బంది కోసం రూపొందించిన సరికొత్త యూనిఫాం (Air India Uniform)ల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. భారతీయ వస్త్రశైలిని ప్రతిబింబిస్తోన్న ఆ దుస్తులను ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్ మనీశ్‌ మల్హోత్రా రూపొందించినట్లు ‘ఎయిరిండియా’ తెలిపింది.

ఎయిరిండియా విమానాల కొత్త రూపు

‘మా సరికొత్త పైలట్, క్యాబిన్ క్రూ యూనిఫాంలను పరిచయం చేస్తున్నాం. ఎయిరిండియా గొప్ప చరిత్రకు ఇవి నిదర్శనం. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా వీటిని రూపొందించారు. మూడు అత్యుత్తమ భారతీయ రంగుల(ఎరుపు, వంకాయ రంగు, పసిడి)ను ఇందులో భాగం చేశాం. ఇవి శక్తిమంతమైన నూతన భారతదేశాన్ని సూచిస్తాయి’ అని ఎయిర్‌ ఇండియా ట్వీట్‌ చేసింది. నూతన యూనిఫాంలకు సంబంధించిన ఓ వీడియోనూ విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. ఆరు దశాబ్దాల కాలంలో సిబ్బంది యూనిఫాంలను మార్చడం ఇదే మొదటిసారి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని