Fuel Price: మళ్లీ పెట్రో వడ్డన.. హైదరాబాద్‌లో ఎంత పెరిగిందంటే?

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ఫై 91పైసలు, డీజిల్‌పై 87 పైసలు

Updated : 03 Apr 2022 08:43 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ఫై 91పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. దీంతో భాగ్యనగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.117.21, డీజిల్‌ రూ.103.03కి చేరింది. ఏపీలోని గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. దీంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ.119.07, డీజిల్‌ రూ.104.78కి చేరుకుంది. దిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌పై 80 పైసలు పెంచారు. గత 13 రోజుల వ్యవధిలో 11 సార్లు పెంపు నిర్ణయం తీసుకోగా.. రూ.8కి పైగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని