సరైన సమయంలోనే రేట్లు పెంచాం
కీలక రేట్లను కాస్త ముందుగానే పెంచడం మొదలుపెట్టి ఉండాల్సిందన్న విమర్శలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. కొన్ని దేశాల కేంద్రబ్యాంకులు ముందుగానే రేట్లు పెంచగా, ఆర్బీఐ మే నెల నుంచి రెపోరేటును పెంచడం ప్రారంభించి, ఇప్పటికి 190 బేసిస్ పాయింట్లు అధికం చేసింది.
తొందరపడితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేది
ద్రవ్యోల్బణ అదుపుపై దృష్టి పెట్టాం
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబయి: కీలక రేట్లను కాస్త ముందుగానే పెంచడం మొదలుపెట్టి ఉండాల్సిందన్న విమర్శలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. కొన్ని దేశాల కేంద్రబ్యాంకులు ముందుగానే రేట్లు పెంచగా, ఆర్బీఐ మే నెల నుంచి రెపోరేటును పెంచడం ప్రారంభించి, ఇప్పటికి 190 బేసిస్ పాయింట్లు అధికం చేసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు రేట్లను ముందే పెంచిఉంటే, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలేదని దాస్ అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ ఇపుడు స్థిరత్వంతో, ప్రపంచానికే ఆశావహంగా మారిందన్నారు. ద్రవ్యోల్బణం కూడా దిగి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. గత 3 త్రైమాసికాలుగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని గరిష్ఠ లక్ష్యమైన 6 శాతంలోపు ఉంచడంలో విఫలమైనందుకు, కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
ద్రవ్యోల్బణం: ఈ విషయంలో లక్ష్యాన్ని చేరలేకపోయాం. ఒక వేళ ముందస్తుగా రేట్లు పెంచితే, దేశ పౌరులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యేవారు. ఆర్థిక వ్యవస్థ రికవరీకి భంగం కలిగించకుండా, భద్రంగా ముందుకు తీసుకెళ్లాం. అర్జునుడు మత్య్సయంత్రంపై గురిపెట్టినట్లుగా, మేం కూడా ద్రవ్యోల్బణంపై దృష్టి కేంద్రీకరించే పనిచేస్తున్నాం.
యుద్ధం వల్లే : ద్రవ్యోల్బణ లక్ష్యమైన 2-6 శాతం కంటే కాస్త అధికమైనా భరించగలిగేలా, పరపతి విధానంలో ఉన్న సౌలభ్యాన్ని కొవిడ్ సమయంలో ఆర్బీఐ ఉపయోగించుకుంది. తద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించగలిగాం. 2020-21లో కరోనా పరిణామాల వల్ల క్షీణించిన జీడీపీ, ఆ తర్వాత పుంజుకుంటోంది. 2023-24లోనూ రాణించగలదనే అంచనా వేస్తున్నాం. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలవడానికి ముందు వరకు, ద్రవ్యోల్బణం 4.3 శాతానికి వస్తుందని ఆర్బీఐ అంచనా వేసింది. యుద్ధంతో అన్ని అంచనాలు తప్పాయి.
ప్రభుత్వానికి వెల్లడిస్తాం: 9 నెలల పాటు రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువన ఉండడానికి గల కారణాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. 2-6 శాతం శ్రేణికి ఎప్పుడు తిరిగి వస్తుంది.. అందుకు చేపట్టాల్సిన చర్యలనూ తెలియజేస్తాం. వీటిని ఇపుడే బయటకు వెల్లడించలేం.
రిటైల్ ఇ-రూపాయి ఈ నెలలోనే
టోకు కార్యకలాపాల కోసం ఆవిష్కరించిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) గొప్ప మార్పు తీసుకొస్తుంది. ఈ నెలలోపే రిటైల్లోనూ ప్రవేశపెడతాం. పూర్తి స్థాయిలో సీబీడీసీని సమీప భవిష్యత్లోనే ఆవిష్కరిస్తాం. ప్రపంచంలోనే తొలిసారిగా చేస్తున్నందున తొందరపడ దలచుకోలేదు.
రూపాయి విలువ క్షీణత తక్కువగానే
ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలవు క్షీణత తక్కువగానే ఉంది. అంతర్జాతీయ అనిశ్చితిలో, రూపాయి స్థిరంగానే కదలినట్లు పరిగణించాలి. స్విస్ ఫ్రాంక్, సింగపూర్ డాలరు, రష్యా రూబుల్ వంటివి మినహా మిగతా అన్ని కరెన్సీలూ రూపాయి కంటే ఎక్కువ క్షీణించాయి. జపనీస్ యెన్తో పోలిస్తే 12.4%; చైనీస్ యువాన్తో పోలిస్తే 5.9%; పౌండ్తో పోలిస్తే 4.6%; యూరోతో పోలిస్తే 2.5% చొప్పున రూపాయి బలపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( )
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు