అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్
దేశంలోనే అత్యంత విలువైన నమోదిత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది.
2022 బర్గండీ హురున్ ఇండియా-500 జాబితా
73 లక్షల మందికి ఉపాధి
దిల్లీ: దేశంలోనే అత్యంత విలువైన నమోదిత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. రూ.17.25 లక్షల కోట్ల విలువతో ఇది అగ్రస్థానంలో నిలిచినట్లు 2022 బర్గండీ హురున్ ఇండియా-500 జాబితా వెల్లడించింది. ఈ జాబితాను హురున్ ఇండియా, బర్గండీ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ (ప్రైవేటు బ్యాంకింగ్ వ్యాపారం) సంయుక్తంగా రూపొందించాయి. రిలయన్స్ తర్వాతి స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి నిలిచాయి. తొలి 10 సంస్థల్లో అదానీ టోటల్ గ్యాస్(9), అదానీ ఎంటర్ప్రైజెస్(10) కొత్తగా చేరాయి.
దేశ జీడీపీకి సమానంగా కంపెనీల విలువ: దేశ జీడీపీకి సమానంగా ఈ జాబితాలోని 500 కంపెనీల మొత్తం విలువ 2.7 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.224 లక్షల కోట్లు)గా నమోదైంది. ‘ఈ కంపెనీలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి. 820 బి.డాలర్ల విక్రయాలను సాధించాయి. 73 లక్షల మందికి ఉపాధినిస్తున్నాయ’ని హురున్ ఇండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. * ఈ 500 కంపెనీల ఆదాయం భారత జీడీపీలో 29 శాతానికి సమానం. దేశ మొత్తం కార్మికుల్లో 1.5% మందికి ఇవి ఉపాధినిస్తున్నాయి. ఈ జాబితాలోని 67 కంపెనీలు ఏర్పాటై 10 ఏళ్లలోపే కావడం విశేషం. * అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా జాబితాలోని కంపెనీలు గతేడాదితో పోలిస్తే రూ.1.78 లక్షల కోట్ల విలువను కోల్పోయాయి. ఇంధన, రిటైల్, ఆతిథ్య, వినియోగదారు వస్తువుల రంగాలు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. * సాఫ్ట్వేర్, సేవల రంగాలు కలిసి గతేడాదితో పోలిస్తే రూ.6 లక్షల కోట్ల విలువను కోల్పోయాయి.
* మొత్తం 500 కంపెనీల్లో 73 ఆర్థిక సేవల కంపెనీలే కావడం గమనార్హం. ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, వినియోగదారు వస్తువుల కంపెనీలు వరుసగా 60; 37; 37గా ఉన్నాయి. * చైనాలో అత్యంత విలువైన కంపెనీగా టెన్సెంట్(743 బి.డాలర్లు) అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయంగా చూస్తే 2.4 ట్రిలియన్ డాలర్లతో యాపిల్ నం.1గా ఉంది. ఒక్క యాపిల్ విలువే మన టాప్-500 కంపెనీల విలువకు దాదాపు సమానంగా ఉంది.
నమోదు కాని కంపెనీల్లో సీరమ్ హవా: స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కాని కంపెనీల్లో రూ.2.19 లక్షల కోట్ల విలువతో సీరమ్ ఇన్స్టిట్యూట్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో బైజూస్(రూ.1.82 లక్షల కోట్లు), ఎన్ఎస్ఈ(రూ.1.39 లక్షల కోట్లు) నిలిచాయి.
అపోలో బోర్డులో ఆరుగురు మహిళలు: బోర్డుల్లో, మహిళలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించింది అపోలో హాస్పిటల్స్. ప్రమోటర్ల కుటుంబానికి చెందిన ప్రీతారెడ్డి, శోభన కామినేని, సునీతారెడ్డి, సంగీతారెడ్డితో పాటు కవితా దత్, రమా బిజాపుర్కర్ (స్వతంత్ర డైరెక్టర్లు) కలిపి మొత్తం ఆరుగురు మహిళలు ఈ బోర్డులో ఉండడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి. -
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
Nithin Kamath: కర్మ ఫలితం అనుభవిస్తున్నానని అంటున్నారు జిరోదా సీఈవో నితిన్ కామత్. స్పామ్ కాల్స్పై ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. -
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. -
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
ఉద్యోగం కోసం అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకుంటుంటారు. రిక్రూటర్ మెప్పు పొందేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు