అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్
దేశంలోనే అత్యంత విలువైన నమోదిత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది.
2022 బర్గండీ హురున్ ఇండియా-500 జాబితా
73 లక్షల మందికి ఉపాధి
దిల్లీ: దేశంలోనే అత్యంత విలువైన నమోదిత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. రూ.17.25 లక్షల కోట్ల విలువతో ఇది అగ్రస్థానంలో నిలిచినట్లు 2022 బర్గండీ హురున్ ఇండియా-500 జాబితా వెల్లడించింది. ఈ జాబితాను హురున్ ఇండియా, బర్గండీ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ (ప్రైవేటు బ్యాంకింగ్ వ్యాపారం) సంయుక్తంగా రూపొందించాయి. రిలయన్స్ తర్వాతి స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి నిలిచాయి. తొలి 10 సంస్థల్లో అదానీ టోటల్ గ్యాస్(9), అదానీ ఎంటర్ప్రైజెస్(10) కొత్తగా చేరాయి.
దేశ జీడీపీకి సమానంగా కంపెనీల విలువ: దేశ జీడీపీకి సమానంగా ఈ జాబితాలోని 500 కంపెనీల మొత్తం విలువ 2.7 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.224 లక్షల కోట్లు)గా నమోదైంది. ‘ఈ కంపెనీలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి. 820 బి.డాలర్ల విక్రయాలను సాధించాయి. 73 లక్షల మందికి ఉపాధినిస్తున్నాయ’ని హురున్ ఇండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. * ఈ 500 కంపెనీల ఆదాయం భారత జీడీపీలో 29 శాతానికి సమానం. దేశ మొత్తం కార్మికుల్లో 1.5% మందికి ఇవి ఉపాధినిస్తున్నాయి. ఈ జాబితాలోని 67 కంపెనీలు ఏర్పాటై 10 ఏళ్లలోపే కావడం విశేషం. * అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా జాబితాలోని కంపెనీలు గతేడాదితో పోలిస్తే రూ.1.78 లక్షల కోట్ల విలువను కోల్పోయాయి. ఇంధన, రిటైల్, ఆతిథ్య, వినియోగదారు వస్తువుల రంగాలు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. * సాఫ్ట్వేర్, సేవల రంగాలు కలిసి గతేడాదితో పోలిస్తే రూ.6 లక్షల కోట్ల విలువను కోల్పోయాయి.
* మొత్తం 500 కంపెనీల్లో 73 ఆర్థిక సేవల కంపెనీలే కావడం గమనార్హం. ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, వినియోగదారు వస్తువుల కంపెనీలు వరుసగా 60; 37; 37గా ఉన్నాయి. * చైనాలో అత్యంత విలువైన కంపెనీగా టెన్సెంట్(743 బి.డాలర్లు) అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయంగా చూస్తే 2.4 ట్రిలియన్ డాలర్లతో యాపిల్ నం.1గా ఉంది. ఒక్క యాపిల్ విలువే మన టాప్-500 కంపెనీల విలువకు దాదాపు సమానంగా ఉంది.
నమోదు కాని కంపెనీల్లో సీరమ్ హవా: స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కాని కంపెనీల్లో రూ.2.19 లక్షల కోట్ల విలువతో సీరమ్ ఇన్స్టిట్యూట్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో బైజూస్(రూ.1.82 లక్షల కోట్లు), ఎన్ఎస్ఈ(రూ.1.39 లక్షల కోట్లు) నిలిచాయి.
అపోలో బోర్డులో ఆరుగురు మహిళలు: బోర్డుల్లో, మహిళలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించింది అపోలో హాస్పిటల్స్. ప్రమోటర్ల కుటుంబానికి చెందిన ప్రీతారెడ్డి, శోభన కామినేని, సునీతారెడ్డి, సంగీతారెడ్డితో పాటు కవితా దత్, రమా బిజాపుర్కర్ (స్వతంత్ర డైరెక్టర్లు) కలిపి మొత్తం ఆరుగురు మహిళలు ఈ బోర్డులో ఉండడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.