అడ్వెంట్ ఇంటర్నేషనల్ చేతికి సువెన్ ఫార్మా
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సువెన్ ఫార్మాస్యూటికల్స్లో మెజార్టీ వాటాను ఆ సంస్థ ప్రమోటరు వెంకట్ జాస్తి విక్రయిస్తున్నారు. కంపెనీలో ఆయనకు 60 శాతం వాటా ఉండగా, అందులో 50.1% వాటాను రూ.6,313.08 కోట్లకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థకు విక్రయించనున్నారు.
రూ.6,313.08 కోట్లకు 50.1% వాటా విక్రయిస్తున్న ప్రమోటరు వెంకట్ జాస్తి
కొంతకాలం పాటు ముఖ్య సలహాదారుడిగా కంపెనీకి సేవలు
కొహాన్స్ లైఫ్సైన్సెస్లో సువెన్ ఫార్మాను విలీనం చేసే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సువెన్ ఫార్మాస్యూటికల్స్లో మెజార్టీ వాటాను ఆ సంస్థ ప్రమోటరు వెంకట్ జాస్తి విక్రయిస్తున్నారు. కంపెనీలో ఆయనకు 60 శాతం వాటా ఉండగా, అందులో 50.1% వాటాను రూ.6,313.08 కోట్లకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థకు విక్రయించనున్నారు. రూ.1 ముఖ విలువ కల ఒక్కో షేరును ఆయన రూ.495 ధరకు విక్రయిస్తున్నారు. ఈ విక్రయం తర్వాత ఇంకా ఆయనకు సువెన్ ఫార్మాస్యూటికల్స్లో 9 శాతం వాటా మిగులుతుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు సువెన్ ఫార్మా సోమవారం వెల్లడించింది. వచ్చే అయిదారు నెలల్లో ఈ లావాదేవీ పూర్తవుతుందని అంచనా. ఆ తర్వాత కంపెనీ సీఎండీ స్థానం నుంచి వెంకట్ జాస్తి తప్పుకుంటారు. ముఖ్య సలహాదారుడిగా కంపెనీకి కొంతకాలం సేవలు అందిస్తారు. అడ్వెంట్ ఇంటర్నేషనల్కు ఆరోగ్య సేవల రంగంలో ఎంతో అనుభవం ఉన్నందున, భవిష్యత్తులో సువెన్ ఫార్మాను ఇంకా అభివృద్ధి పథంలో నడిపే అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా వెంకట్ జాస్తి పేర్కొన్నారు. సీడీఎంఓ (కాంట్రాక్టు పరిశోధన, తయారీ సేవల) విభాగంలో సువెన్ ఫార్మాను అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఇండియా ఎండీ శ్వేత జలాన్ వివరించారు.
కొహాన్స్ లైఫ్సైన్సెస్లో విలీన ప్రతిపాదన
అడ్వెంట్ ఇంటర్నేషనల్ గత రెండేళ్లలో మనదేశంలోని 3 ఫార్మా కంపెనీల్లో మెజార్టీ వాటా కొనుగోలు చేసింది. అందులో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆర్ ఏ కెమ్ ఫార్మా, అవ్రా లేబొరేటరీస్, ముంబయికి చెందిన జడ్సీఎల్ కెమికల్స్ ఉన్నాయి. ఈ మూడు కంపెనీల్లోని పెట్టుబడులను కొంతకాలం క్రితం కొహాన్స్ లైఫ్సైన్సెస్ అనే సంస్థ కిందకు అడ్వెంట్ తీసుకొచ్చింది.
* ఆర్ ఏ కెమ్ ఫార్మా ఏపీఐ ఔషధాలు ఉత్పత్తి చేసే సంస్థ కాగా, అవ్రా ల్యాబ్స్ ఫార్మా పరిశోధనా కార్యకలాపాలు సాగిస్తోంది. జడ్సీఎల్ కెమికల్స్ స్పెషాలిటీ కెమికల్్్సనూ తయారు చేస్తోంది. దీనికి అదనంగా సీడీఎంఓ విభాగానికి చెందిన కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా ఒక సమీకృత ఫార్మా కంపెనీగా కొహాన్స్ లైఫ్సైన్సెస్ను తీర్చిదిద్దాలనే ఆలోచనలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ కొంతకాలంగా ఉంది. దీనికి అనుగుణంగానే సువెన్ ఫార్మాను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొహాన్స్లో సువెన్ ఫార్మాను విలీనం చేసే ప్రతిపాదనను సమీప భవిష్యత్తులో పరిశీలిస్తామని అడ్వెంట్ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
ఓపెన్ ఆఫర్ కూడా
సువెన్ ఫార్మా ప్రమోటర్ అయిన వెంటక్ జాస్తి నుంచి మెజార్టీ వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నందున, సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం సువెన్ ఫార్మాలోని సాధారణ తరగతి వాటాదార్ల నుంచి 26 శాతం వాటా కొనుగోలు కోసం అడ్వెంట్ ఇంటర్నేషనల్ ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేయాల్సి వస్తుంది. అడ్వెంట్ తరఫున కోటక్ మహీంద్రా కేపిటల్ కంపెనీ ‘ఓపెన్ ఆఫర్’ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో షేరుకు రూ.495 చొప్పున చెల్లించనున్నట్లు, మొత్తం 6,61,86,889 ఈక్విటీ షేర్లు (సువెన్ ఫార్మా జారీ మూలధనంలో 26 శాతం) కొనుగోలు చేయడానికి సిద్ధమని ప్రకటించింది. రూ.495 ధర ప్రకారం ఈ షేర్ల విలువ రూ.3,276 కోట్లకు పైగానే ఉంటుంది. అడ్వెంట్ ఇంటర్నేషనల్కు అనుబంధ సంస్థ అయిన సైప్రస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బెర్హైందా లిమిటెడ్ ఈ షేర్లను కొనుగోలు చేస్తుంది.
* ఈ వార్తల నేపథ్యంలో, సువెన్ ఫార్మా షేరు బీఎస్ఈలో సోమవారం రూ.511.70 వద్ద ప్రారంభమై, రూ.520.35 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అయితే తరవాత నష్టపోయి రూ.470.70 వద్ద కనిష్ఠాన్ని తాకినా, చివరకు రూ.472.20 వద్ద స్థిరపడింది. శుక్రవారం ముగింపు ధర రూ.498.20తో పోలిస్తే, ఇది రూ.26 తక్కువ.
అతిపెద్ద ఒప్పందం
ఔషధ, ఐటీ రంగాలకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉండగా.. ఈ విభాగాల కంపెనీల్లో ఇటీవల కాలంలో సువెన్ ఫార్మాదే అతిపెద్ద ‘కార్పొరేట్ డీల్’ . దాదాపు రూ.13,000 కోట్ల సంస్థాగత విలువ ప్రకారం, ఈ కంపెనీలో మెజార్టీ వాటాను వెంకట్ జాస్తి విక్రయిస్తున్నారు. సువెన్ ఫార్మా వాటా కోసం ప్రధానంగా బ్లాక్స్టోన్, అడ్వెంట్ ఇంటర్నేషనల్ పోటీ పడ్డాయి. చివరకు అడ్వెంట్ ఇంటర్నేషనల్దే పైచేయి అయింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మరొక ఫార్మా కంపెనీ ప్రమోటర్లు కూడా వాటా విక్రయించే ఉద్దేశంలో ఉన్నారనే ప్రచారం కొంతకాలంగా ఉంది. కానీ తక్కువ సమయంలోనే సువెన్ ఫార్మా లావాదేవీ పూర్తయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( )
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు