ఓడీఐ మార్గంలో విదేశాల్లో స్థిరాస్తి కొనుగోళ్లా?
విదేశాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేసేందుకు కొన్ని సంస్థలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఓడీఐ) మార్గాన్ని ఉపయోగించడం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఆర్బీఐ ఆందోళన
దిల్లీ: విదేశాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేసేందుకు కొన్ని సంస్థలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఓడీఐ) మార్గాన్ని ఉపయోగించడం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై సరైన మార్గదర్శకాలను రూపొందించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది. భారతీయులు ప్రస్తుతం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం(ఎల్ఆర్ఎస్), ఓడీఐ మార్గాల్లో విదేశాలకు డబ్బు పంపించుకునే వీలుంది. వ్యక్తులు ఏడాదికి 2,50,000 డాలర్ల వరకూ ఎల్ఆర్ఎస్ మార్గంలో విదేశాలకు డబ్బు పంపించవచ్చు. ఓడీఐ విధానం కంపెనీలకు వర్తిస్తుంది. ఏడాదికి 1 బిలియన్ డాలర్ల గరిష్ఠ పరిమితి వరకూ డబ్బును పంపించే వీలుంటుంది. సంపన్న వ్యక్తులు విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు వ్యక్తిగతంగా కాకుండా కంపెనీలు లేదా కుటుంబ ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల నిర్దేశించిన వ్యక్తిగత చెల్లింపుల పరిమితిని పక్కదోవ పట్టిస్తున్నారని ఆర్బీఐ గమనించింది.
ఎఫ్ఏక్యూ తీసుకొచ్చే యత్నంలో ఆర్బీఐ: ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పెట్టుబడుల కోసం స్థిరాస్తుల కొనుగోలు అనుమతి లేదని ఇటీవలి డీలర్ బ్యాంకులతో జరిగిన సమావేశంలో ఆర్బీఐ స్పష్టం చేసింది. ఓడీఐ విధానానికి సంబంధించి ఒక ప్రశ్నావళిని(ఎఫ్ఏక్యూ) సిద్ధం చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోందని సంబంధిత వ్యక్తులు తెలిపారు. కొందరు వ్యక్తులు విదేశాల్లో స్థిరాస్తి కొనుగోళ్లకు ఇక్కడి బ్యాంకులు, సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారని ఆర్బీఐ పేర్కొంది. ఆ దేశాల్లో స్థిరాస్తి మార్కెట్ ప్రతికూలంగా మారితే.. ఆ రుణాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
నిషేధం లేదు కానీ..: కచ్చితంగా చెప్పాలంటే భారతీయులు ఓడీఐ విధానంలో విదేశాల్లో ఆస్తులు కొనేందుకు నిషేధం లేదు. కాకపోతే ఆ కొనుగోలు ఒక లక్ష్యంతో ఉండాలి. ఉదాహరణకు ఒక భారతీయ కంపెనీ విదేశాల్లో విస్తరించేందుకు వాణిజ్య స్థలాన్ని కొనుగోలు చేయొచ్చు. ఆ స్థిరాస్తిని పూర్తిగా పెట్టుబడి కోసం కొంటే నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. విదేశీ అనుబంధ సంస్థలు, ఉమ్మడి భాగస్వామ్యాల ఏర్పాటు కోసం ఓడీఐ మార్గంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుంది. కానీ, కొంతమంది ఈ మార్గాన్ని వాడుకొని, లండన్, దుబాయ్లలో స్థిరాస్తి కొనుగోళ్లు చేస్తున్నారని ఆర్బీఐ దృష్టికి వచ్చింది. ఎల్ఆర్ఎస్ మార్గంలోనూ స్థిరాస్తుల కొనుగోలు గురించీ ఆర్బీఐ కొంత ఆందోళన చెందుతోంది. నిర్ణీత పరిమితుల్లో ఉన్నంత వరకూ రెమిటెన్స్ డబ్బును ఏం చేశారని ఆర్బీఐ పట్టించుకోదు అని కేంద్ర బ్యాంక్ మాజీ అధికారి వివరించారు. ఆస్తుల కొనుగోలు నిర్ణీత ప్రయోజనం, లేదా పని కోసం ఉపయోగించినప్పుడు ఆర్బీఐకి ఇబ్బందేమీ ఉండదు. కానీ, పెట్టుబడుల విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉంటుంది. ఊహాజనిత లాభాల కోసం విదేశీ స్థిరాస్తి పెట్టుబడులు పెట్టినప్పుడు ఆర్బీఐ ఆ విషయంపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. సొంత నిధులు లేకపోయినా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, విదేశాల్లో పెట్టుబడులు పెడితే.. మార్కెట్ పరిస్థితులు క్షీణించినప్పుడు రుణదాతలకు ప్రమాదం ఉంటుందని తెలిపారు.
అవకాశాలు కోల్పోయే ఆస్కారం..
మరోవైపు విదేశాల్లో డబ్బును దాచుకునే మార్గంగా ఇది మారకుండా చూడాలనీ ఆర్బీఐ ఆలోచిస్తోందని పేర్కొన్నారు. విదేశీ స్థిరాస్తుల కొనుగోళ్లకు సంబంధించి, స్పష్టమైన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే దేశీయ పెట్టుబడిదారులు విదేశాల్లో ఉన్న అవకాశాలను కోల్పోయే ఆస్కారం ఉందంటున్నారు. సంపన్నులు విదేశాల్లో ఆస్తులు కొని, దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా లాభాలను సంపాదించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు