వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు.
సమీక్ష
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. రూపాయి తగ్గడం, విదేశీ అమ్మకాలు ఇందుకు తోడయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు నష్టపోయి 83.35 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.31% లాభంతో 89.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు అదే ధోరణిలో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 74,509.31 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. గరిష్ఠాల్లో అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్న సూచీ, మళ్లీ కోలుకోలేకపోయింది. ఒకదశలో 73,616.65 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 609.28 పాయింట్ల నష్టంతో 73,730.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 150.40 పాయింట్లు కోల్పోయి 22,419.95 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,385.55- 22,620.40 పాయింట్ల మధ్య కదలాడింది.
- త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు ఇంట్రాడేలో 8.26% క్షీణించి రూ.6,691.40 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 7.73% నష్టంతో రూ.6,729.85 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.34,914.48 కోట్లు తగ్గి రూ.4.16 లక్షల కోట్లకు పరిమితమైంది.
- ఆదాయ వృద్ధి, మార్జిన్లను పెంచేందుకు మూడేళ్ల కార్యాచరణను ప్రకటించడంతో టెక్ మహీంద్రా షేరు ఇంట్రాడేలో 13% దూసుకెళ్లి రూ.1,344.95 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 7.34% లాభంతో రూ.1,277.45 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.8,537.51 కోట్లు పెరిగి రూ.1.24 లక్షల కోట్లకు చేరింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 24 నష్టపోయాయి. బజాజ్ ఫిన్సర్వ్ 3.55%, ఇండస్ఇండ్ బ్యాంక్ 3.36%, నెస్లే 3.08%, ఎం అండ్ ఎం 2.45%, కోటక్ బ్యాంక్ 2.11%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.09%, హెచ్సీఎల్ టెక్ 2.08%, మారుతీ 1.70%, ఎస్బీఐ 1.38% డీలాపడ్డాయి. విప్రో 0.79%, ఐటీసీ 0.56% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, టెక్, వాహన, టెలికాం 0.70% వరకు నీరసపడ్డాయి. ఇంధన, ఆరోగ్య సంరక్షణ, సేవలు, విద్యుత్ పెరిగాయి. బీఎస్ఈలో 1866 షేర్లు నష్టాల్లో ముగియగా, 1920 స్క్రిప్లు లాభపడ్డాయి. 127 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
- ఆర్బీఐ చర్యలతో కోటక్ బ్యాంక్పై ప్రభావం: ఎస్ అండ్ పీ: కోటక్ మహీంద్రా బ్యాంక్పై ఆర్బీఐ చర్యలతో బ్యాంక్ రుణాల వృద్ధి, లాభదాయకతపై ప్రభావం పడొచ్చని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. ఆన్లైన్లో కొత్త ఖాతాదార్లను చేర్చుకోవద్దని, తాజాగా క్రెడిట్ కార్డులు జారీ చేయొద్దని బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్కు క్రెడిట్ కార్డులు అధిక లాభాలను తీసుకువచ్చే విభాగమని, డిసెంబరు త్రైమాసికానికి ఈ విభాగం 52 శాతం వృద్ధి చెందితే, మొత్తం రుణాల వృద్ధి 19 శాతంగా ఉందని ఎస్ అండ్ పీ తెలిపింది. ఆర్బీఐ తాజా చర్యలతో బ్యాంక్ శాఖల విస్తరణపై ఎక్కువ ఆధారపడాల్సి వస్తుందని, దీంతో నిర్వహణ వ్యయాలు అధికమవుతాయని అభిప్రాయపడింది. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ బీబీబీ- రేటింగ్లో మాత్రం మార్పులు చేయలేదు.
- ప్రమోటర్ గ్రూప్ పతంజలి ఆయుర్వేద్కు చెందిన ఆహారేతర వ్యాపారాన్ని కొనుగోలు చేసే ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు పతంజలి ఫుడ్స్ తెలిపింది.
నేటి బోర్డు సమావేశాలు: ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. -
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. -
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. -
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో జీవనకాల గరిష్ఠానికి ఎంఎఫ్ల వాటా
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్నకు చెందిన ప్రైమ్ఇన్ఫోబేస్.కామ్ వెల్లడించింది. -
నరేశ్ గోయెల్కు మధ్యంతర బెయిలు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. -
అంతర్జాతీయ మొబైల్ నంబర్తోనూ యూపీఐ చెల్లింపులు: ఐసీఐసీఐ బ్యాంక్
భారత్లో ఉన్న ప్రవాసులు (ఎన్ఆర్ఐ), అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. -
సేవల రంగ వృద్ధి వేగవంతంగానే
దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది. -
ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువుల పిచికారీ
30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు
ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్, నారాయణన్ వెల్లాయన్ నియమితులయ్యారు. -
జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా
జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీఎస్టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే.. జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న జీఎస్టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. -
ఫరూఖ్నగర్లో 48 ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) హైదరాబాద్ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది. -
ఆఫ్లైన్లోనూ ఇ-రుపీ
ఇ-రుపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని ఆఫ్లైన్ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
మాస్చిప్ టెక్నాలజీస్ ఆదాయాల్లో వృద్ధి
సెమీకండక్టర్, సాఫ్ట్వేర్, సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మాస్చిప్ టెక్నాలజీస్ 2023-24 పూర్తి కాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.293.91 కోట్ల ఆదాయాన్ని, రూ.9.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
సంక్షిప్త వార్తలు(7)
సువెన్ లైఫ్సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.6.66 కోట్ల ఆదాయాన్ని, రూ.26.54 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం 8.21 కోట్లు, నష్టం రూ.27.64 కోట్లు ఉండటం గమనార్హం
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..