RBI: రూ.500 నకిలీ నోట్లున్నాయ్.. జాగ్రత్త
దేశీయంగా అందుబాటులో ఉన్న నగదులో.. విలువ పరంగా రూ.500 నోట్ల వాటా 77% పైగా ఉంది. ఈ నోట్లలోనే నకిలీలు ఏటా పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన 2022-23 వార్షిక నివేదిక వెల్లడించింది.
క్రెడిట్ కార్డు చెల్లింపులు పెరిగాయ్.. డెబిట్కార్డువి తగ్గాయి
యూపీఐ చెల్లింపుల్లో 65% వృద్ధి
ఆర్బీఐ వార్షిక నివేదిక
ఈనాడు-దిల్లీ
దేశీయంగా అందుబాటులో ఉన్న నగదులో.. విలువ పరంగా రూ.500 నోట్ల వాటా 77% పైగా ఉంది. ఈ నోట్లలోనే నకిలీలు ఏటా పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన 2022-23 వార్షిక నివేదిక వెల్లడించింది. బ్యాంకుల్లో కనపడుతున్న రూ.500 నకిలీ నోట్ల సంఖ్య రెండేళ్లలో 130% అధికమైంది. 2022-23లో మొత్తం 2,25,769 నకిలీ కరెన్సీ నోట్లను బ్యాంకుల స్థాయిలో గుర్తించారు. ఇందులో 4.6% నోట్లను రిజర్వ్బ్యాంకు స్థాయిలో, 95.4% నోట్లను ఇతర బ్యాంకుల్లో కనిపెట్టారు. 2021-22తో పోలిస్తే రూ.20 నోట్లలో నకిలీలు 8.4%, రూ.500 నోట్లలో 14.4% పెరిగాయి. ఇదే సమయంలో రూ.10 నోట్లలో 11.6%, రూ.100 నోట్లలో 14.7%, రూ.2,000 నోట్లలో 27.9% తగ్గాయి.
చెలామణిలో రూ.33,48,228 కోట్ల నగదు
* 2023 మార్చి ఆఖరుకు ఆర్థిక వ్యవస్థలో రూ.33,48,228 కోట్ల నగదు చెలామణిలో ఉంది. 2021-21తో పోలిస్తే 2022-23లో చెలామణిలో ఉన్న నోట్ల విలువ 7.8%, పరిమాణం 4.4% మేర అధికమైంది.
* మొత్తం నగదులో విలువ పరంగా 77.1%, సంఖ్యాపరంగా 37.9% వాటా రూ.500 నోట్లదే. విలువ పరంగా రూ.2వేల నోట్ల వాటా 10.8%. ఈ రెండు పెద్ద నోట్ల విలువే, మొత్తం ఆర్థిక వ్యవస్థలో 87.9% ఉంది. ఏడాది క్రితం వీటి వాటా 87.1 శాతమే.
రూ.2000 నోట్ల వాటా 1.3 శాతమే
* దేశ ఆర్థిక వ్యవస్థలో రూ.2,000 నోట్ల వాటా మార్చి ఆఖరుకు 1.3 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఈ వాటా 1.6%. విలువ పరంగా చూసినా వీటి వాటా 13.8% నుంచి 10.8 శాతానికి పరిమితమైంది. సెప్టెంబరు 30లోపు రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో జమచేయాలని లేదా ఇతర నోట్లలోకి మార్చుకోవాలని ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.
* నోట్ల ముద్రణ కోసం 2022-23లో ఆర్బీఐ రూ.4,682.80 కోట్లు ఖర్చుచేసింది. 2021-22లో ఇందుకు వెచ్చించిన రూ.4,984.80 కోట్లతో పోలిస్తే 6.05% తక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం 2,26,000 నోట్లను ముద్రించింది. 2022-23లో మొత్తం 2,29,264 చిరిగిపోయిన నోట్లను పక్కనపెట్టింది.
* ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఇ-రూపీ-టోకు విలువ రూ.10.69 కోట్ల మేర; ఇ-రూపీ-రిటైల్ విలువ రూ.5.70 కోట్ల మేర ఉంది.
* 2022-23లో క్రెడిట్ కార్డు చెల్లింపులు పెరిగి, డెబిట్కార్డు చెల్లింపులు తగ్గాయి. 2021-22లో రూ.9.72 లక్షల కోట్ల మేర ఉన్న క్రెడిట్ కార్డు చెల్లింపులు, 2022-23లో రూ.14.32 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో డెబిట్కార్డు చెల్లింపులు రూ.7.30 లక్షల కోట్ల నుంచి రూ.7.20 లక్షల కోట్లకు తగ్గాయి.
* యూపీఐ చెల్లింపులు రూ.84.16 లక్షల కోట్ల నుంచి 65.33% వృద్ధితో రూ.139.15 లక్షల కోట్లకు; ఆన్లైన్లో నగదు బదిలీకి ఉపయోగ పడే ఐఎంపీఎస్ లావాదేవీల విలువ రూ.41.71 లక్షల కోట్ల నుంచి 33.90% పెరిగి రూ.55.85 లక్షల కోట్లకు చేరాయి.
* డిజిటల్ చెల్లింపులు రూ.1,774.01 లక్షల కోట్ల నుంచి రూ.2,086.87 లక్షల కోట్లకు చేరాయి.
* రూ.2000 నోట్ల ఉపసంహరణ వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.లక్ష కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు