‘స్టాన్ ప్లస్’కు రూ.150 కోట్ల నిధులు
అత్యవసర వైద్య సేవల సంస్థ స్టాన్ ప్లస్ ‘సిరీస్- ఏ పెట్టుబడి’ లో భాగంగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.150 కోట్లు) సమీకరించింది. ఇందులో కొంత మూలధన పెట్టుబడి కాగా
ఈనాడు, హైదరాబాద్: అత్యవసర వైద్య సేవల సంస్థ స్టాన్ ప్లస్ ‘సిరీస్- ఏ పెట్టుబడి’ లో భాగంగా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.150 కోట్లు) సమీకరించింది. ఇందులో కొంత మూలధన పెట్టుబడి కాగా మరికొంత సొమ్ము అప్పుగా లభించింది. అగ్రశ్రేణి పెట్టుబడి సంస్థలైన హెల్త్క్వాడ్, కలారి కేపిటల్, హెల్త్ఎక్స్ కేపిటల్ సింగపూర్, పెగసస్, సందీప్ సింఘాల్ (అవానా కేపిటల్), ప్రశాంత్ మాలిక్ తో పాటు మరికొందరు ఏంజెల్ ఇన్వెస్టర్లు ఈ నిధులు సమకూర్చారు. రుణ నిధులను ఎన్ ప్లస్ కేపిటల్ అందించింది. అంబులెన్స్లను అద్దెకు ఇచ్చే వ్యాపారం కోసం గ్రిప్ ఇన్వెస్ట్ అనే సంస్థ నుంచి 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.15 కోట్లు) లభించాయి. దేశీయంగా వైద్య సేవల రంగంలో ఇదే అతిపెద్ద పెట్టుబడి అని, ఈ నిధులతో దేశవ్యాప్తంగా 500 ఆస్పత్రులకు సేవలు అందించగలుగుతామని, 15 నగరాలకు ‘రెడ్ అంబులెన్స్’ బ్రాండెడ్ సేవలు విస్తరిస్తామని స్టాన్ ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రబ్దీప్ సింగ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం