మార్కెట్ ధర తక్కువగా ఉన్న షేర్లలో...
నష్టభయం తక్కువగా ఉండి.. దీర్ఘకాలిక కాంపౌండింగ్ పద్ధతిలో అధిక విలువ సాధించే లక్ష్యంతో ‘వాల్యూ ఫండ్’ను కెనరా రొబెకో మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించింది....
కెనరా రొబెకో వాల్యూ మ్యూచువల్ ఫండ్
నష్టభయం తక్కువగా ఉండి.. దీర్ఘకాలిక కాంపౌండింగ్ పద్ధతిలో అధిక విలువ సాధించే లక్ష్యంతో ‘వాల్యూ ఫండ్’ను కెనరా రొబెకో మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించింది. ‘కెనరా రొబెకో వాల్యూ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 27. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. క్రయవిక్రయాలు వచ్చే నెల 6వ తేదీ నుంచి మొదలవుతాయి. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. సిప్ (క్రమానుగత పెట్టుబడి) పద్ధతిలో అయితే నెలకు రూ.1,000 మదుపు చేయాలి. ప్రధానంగా అధిక వాస్తవిక విలువ ఉండి, మార్కెట్ ధర తక్కువగా కంపెనీ షేర్లను పెట్టుబడి కోసం ఎంచుకోవటం, తద్వారా మదుపరులకు అధిక లాభాలు తెచ్చిపెట్టటం ఈ పథకం ప్రధానోద్దేశం. ఎస్అండ్పీ బీఎస్ఈ 500 టీఆర్ఐ సూచీని దీనికి ప్రామాణికంగా పరిగణిస్తారు. కెనరా రొబెకో వాల్యూ ఫండ్ కు విశాల్ మిశ్రా ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తారు. వాల్యూ ఫండ్ విభాగంలో ఇప్పటికే ఇతర మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి పథకాలు ఉన్నాయి. గత మూడేళ్ల కాలంలో వాల్యూ ఫండ్స్ సగటున 11.6 శాతం ప్రతిఫలాన్ని ఆర్జించాయి. ప్రస్తుతం స్టాక్మార్కెట్ సూచీలు ఎంతో అధికంగా ఉన్న పరిస్థితుల్లో వాల్యూ ఫండ్స్ ద్వారా అధిక విలువ కలిగి ధర తక్కువగా ఉన్న ఈక్విటీ షేర్లపై పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఎంచుకోవటం మేలనే అభిప్రాయం ఉంది. అంతేగాక తమ పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో కొంత వైవిధ్యం ఉండాలనుకునే మదుపరులకు కెనరా రొబెకో వాల్యూ ఫండ్ అనుకూలంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం