రిఫండు రాలేదా?
చెల్లించాల్సిన ఆదాయపు పన్నుకు మించి జమ చేసినప్పుడు రిటర్నులు దాఖలు చేసి, రిఫండు కోరాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2020-21కి గాను (2021-22 అసెస్మెంట్ ఇయర్) రిటర్నులు దాఖలు చేసిన వారికి ఎంతోమందికి రిఫండు ఇప్పటికే వచ్చింది. కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల అందలేదు. ఈ జాబితాలో మీరూ ఉంటే.. ఈ అంశాలను పరిశీలించండి.
పన్ను బాకీ ఉంటే: క్రితం ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి చెల్లించాల్సిన పన్ను బాకీ ఉంటే.. ఆదాయపు పన్ను విభాగం రిఫండును నిరాకరిస్తుంది. దీనికి సంబంధించి పన్ను చెల్లింపుదారులకు నోటీసులూ జారీ చేస్తుంది. మీకు ఇలాంటి నోటీసులేమైనా వచ్చాయా చూసుకోండి. వీటికి వ్యవధి లోపు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. మీరిచ్చిన జవాబు ఆధారంగా పన్ను బాకీ పోను, మిగతా మొత్తం రిఫండునిస్తుంది.
బ్యాంకు ఖాతాలో పొరపాటు: రిటర్నులు దాఖలు చేసేటప్పుడు బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు దొర్లినా రిఫండు జమ కాకపోవచ్చు. ఈ వివరాలనూ ఒకసారి తనిఖీ చేసుకోండి.
ఇ-వెరిఫై చేయకుండా: రిటర్నులు దాఖలు చేసినప్పటికీ.. దానిని ఇ-వెరిఫై చేయకుంటే రిఫండు రాదు. రిటర్నులు దాఖలు చేసిన 120 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే.. అది చెల్లదు. కాబట్టి, వెంటనే ఇ-వెరిఫై చేయండి.
అదనపు వివరాలు: మీ రిఫండుకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగానికి కొన్ని సందేహాలు రావొచ్చు. వాటిని నివృత్తి చేసుకునేందుకు అదనంగా కొన్ని వివరాలు కోరొచ్చు. ఇన్కంట్యాక్స్ వెబ్సైటులోకి లాగిన్ అయినప్పుడు ఈ వివరాలు తెలుస్తాయి. వీటికి తగిన సమాధానాలు ఇవ్వాలి.
అర్హత లేకపోయినా: కొన్నిసార్లు మీరు చేసిన లెక్కలకూ, ఆదాయపు పన్ను విభాగం దగ్గర ఉన్న లెక్కలకూ మధ్య వ్యత్యాసం ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో రిఫండును నిరాకరించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను వెబ్సైటులోకి లాగిన్ అయి.. ‘పెండింగ్ యాక్షన్’లో ఏమైనా అదనపు వివరాలు అడిగారా అన్నది చూసి, దానికి తగ్గట్టుగా స్పందించండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zaporizhzhia: ఆ ప్లాంట్ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్
-
India News
Internet shutdowns: ఇంటర్నెట్ సేవల నిలిపివేతలు భారత్లోనే ఎక్కువ.. కాంగ్రెస్ ఎంపీ
-
Sports News
Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
-
Crime News
Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
-
Movies News
Aamir Khan: ‘కేబీసీ’లో ఆమిర్ ఖాన్.. ఎంత గెలుచుకున్నారంటే?
-
General News
Kerala: ఒకరికి అండగా మరొకరు.. ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన తల్లి, కుమారుడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Chinese mobiles: చైనాకు భారత్ మరో షాక్.. ఆ మొబైళ్లపై నిషేధం...?
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు
- Social Look: ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్.. మాల్దీవుల్లో షాలిని.. శ్రీలీల డబ్బింగ్!
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- CWG 2022: కొవిడ్ అని తేలినా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్..ఎలా!
- CWG 2022: భారత్కు పతకాల పంట.. మొత్తం 61 పతకాలు..