Google Chrome: బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోకపోతే ఇబ్బందే.. క్రోమ్‌ యూజర్లకు కేంద్రం సూచన

గూగుల్‌ క్రోమ్‌ (Google Chorme) ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ కంప్యూటర్లలో బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్‌-ఇన్‌ (CERT-In) సూచించింది.

Updated : 11 Aug 2023 17:44 IST

దిల్లీ: గూగుల్‌ క్రోమ్‌ (Google Chrome) యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. కంప్యూటర్లలో క్రోమ్‌ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు.. వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్‌ ఆఫ్ ఇండియా (CERT-IN) క్రోమ్‌ బ్రౌజర్‌లో లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. వీటి వల్ల డేటా చౌర్యం, మాల్‌వేర్‌ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

ట్రూకాలర్‌ అసిస్టెంట్‌.. మీ ఫోన్‌కు కొత్త ఏఐ టూల్‌

గూగుల్‌ క్రోమ్‌లోని ప్రాంప్ట్స్‌, వెబ్‌ పేమెంట్స్‌ ఏపీఐ, స్విఫ్ట్‌షేడర్‌, వుల్కన్‌, వీడియో, వెబ్‌ ఆర్‌టీసీ వంటి వాటి ద్వారా సైబర్‌ నేరగాళ్లు యూజర్‌ కంప్యూటర్‌లోకి మాల్‌వేర్‌ను పంపి బ్యాంకింగ్‌ సమాచారంతోపాటు, వ్యక్తిగత వివరాలను సేకరించే అవకాశం ఉందని పేర్కొంది. యూజర్లు క్రోమ్‌ బ్రౌజర్‌లో అశ్లీల వెబ్‌సైట్‌లు, తక్కువ భద్రతా ప్రమాణాలు కలిగిన వెబ్‌ పేజ్‌లను ఓపెన్‌ చేసినప్పుడు మాల్‌వేర్‌ ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. లైనెక్స్‌, మ్యాక్‌ కంప్యూటర్లలో గూగుల్‌ క్రోమ్‌ వెర్షన్‌ 115. 0.5790.170 వాడుతున్న వారు, విండోస్‌లో 115.0.5790.170/.171 వెర్షన్‌ ఉపయోగిస్తున్నవారు వెంటనే తమ బ్రౌజర్లను అప్‌డేట్ చేసుకోవాలని సెర్ట్‌-ఇన్‌ సూచించింది. 

  • గూగుల్ క్రోమ్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు.. ముందుగా బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్‌ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి. 
  • సెట్టింగ్స్‌ పేజ్‌లో ఎడమవైపు ఓ జాబితా కనిపిస్తుంది. అందులో చివర ‘అబౌట్‌ క్రోమ్‌’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ బ్రౌజర్‌ అప్‌డేట్‌ అయిందా? లేదా?అనేది చూపిస్తుంది. 
  • ఒకవేళ బ్రౌజర్‌ అప్‌డేట్‌ కాకుంటే రీలాంచ్‌ చేసి అప్‌డేట్ చేయాలి. బ్రౌజర్‌ ఆటోమేటిగ్గా అప్‌డేట్ అయితే ‘క్రోమ్‌ ఈజ్‌ అప్‌ టూ డేట్‌’ అని చూపిస్తుంది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు