GST on paratha: చపాతీ వేరు పరోటా వేరు.. 18 శాతం జీఎస్టీ కట్టాల్సిందే
‘చపాతీ/రోటీ వేరు.. పరోటా వేరు. కాబట్టి 18 శాతం జీఎస్టీ కట్టాల్సిందే అంటూ గుజరాత్ అప్పీలేట్ అథారిటీ స్పష్టంచేసింది.
దిల్లీ: ‘‘చపాతీ/రోటీ వేరు.. పరోటా వేరు. పరోటాను వినియోగించే ముందు దానికి కొంత ప్రాసిసెంగ్ అవసరం. అలానే పరోటా తయారీలో పిండితో పాటు కొన్ని ఇతర పదార్థాలనూ వినియోగిస్తారు. కాబట్టి 18 శాతం జీఎస్టీ కట్టాల్సిందే’’ అంటూ గుజరాత్ అప్పీలేట్ అథారిటీ స్పష్టంచేసింది. తమ కంపెనీ తయారు చేసే పరోటాలపై 18 జీఎస్టీని విధించడంపై వాదిలాల్ అనే కంపెనీ అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించగా.. ఈ మేరకు తీర్పు వెలువరించింది.
గుజరాత్కు చెందిన వాదిలాల్ ఇండస్ట్రీస్ వివిధ రకాల పరోటాలను తయారు చేస్తోంది. అయితే ఈ పరోటాలు చపాతీ, రోటీనే మాదిరి కాదని, తినడానికి సిద్ధంగా ఉన్న ఈ పరోటాలకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని గుజరాత్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (AAR) 2021లో తీర్పు వెలువరించింది. దీనిపై ఆ కంపెనీ అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించింది. ఏఏఆర్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తాజాగా అప్పీలేట్ అథారిటీ తీర్పు వెలువరించింది. అయితే చపాతీ, రోటీ వ్యవహారం ఇదే కొత్తది కాదు. గతంలో ఏఏఆర్ కర్ణాటక బెంచ్ సైతం ఇలాంటి తీర్పునే వెలువరించింది. బెంగళూరుకు చెందిన ఐడీ ఫ్రెడ్ ఫుడ్స్ తయారు చేసే ఫ్రొజెన్ పరోటాల విషయంలోనూ 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తీర్పు వెలువరించింది. దీంతో అప్పట్లో మీమ్స్ వరద పారింది. తాజాగా గుజరాత్ అప్పీలేట్ ఇచ్చిన తాజా తీర్పుపైనా సోషల్ మీడియాలో మరోసారి మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమాఅందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా