మరో కొత్త కంపెనీలో రతన్ టాటా పెట్టుబడులు
టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా.. తమ సంస్థలో వాటాలు కొనుగోలు చేసినట్లు ప్రితీశ్ నందీ కమ్యూనికేషన్స్ వెల్లడించింది. గత వారం ఆయన తన వ్యక్తిగత హోదాలో
ముంబయి: టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా.. తమ సంస్థలో వాటాలు కొనుగోలు చేసినట్లు ప్రితీశ్ నందీ కమ్యూనికేషన్స్ వెల్లడించింది. గత వారం ఆయన తన వ్యక్తిగత హోదాలో మార్కెట్ పర్చేజ్ ద్వారా వాటాల్ని దక్కించుకున్నట్లు తెలిపింది. అంకుర సంస్థలు, సాంకేతికత సంస్థల్ని ప్రోత్సహించేందుకు రతన్ టాటా వాటిల్లో పెట్టుబడులు పెడుతుంటారని గుర్తుచేసింది.
ప్రితీశ్ నందీ కమ్యూనికేషన్స్ని 1993లో స్థాపించారు. టీవీ కంటెంట్ అందించే సంస్థగా ఏర్పాటైన ఈ కంపెనీ అనేక వార్తా, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్ని నిర్వహించింది. 2000 సంవత్సరంలో ఐపీవోకి వచ్చింది. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలోని ఓ కార్పొరేట్ సంస్థ పబ్లిక్ ఇష్యూకి రావడం అదే తొలిసారి. గత 18 ఏళ్లలో సంస్థ స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.2,653గా ఉన్నట్లు సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434