Ratan Tata: క్రిప్టో సంస్థలతో నాకు సంబంధంలేదు.. నెటిజన్లకు రతన్ టాటా విజ్ఞప్తి
క్రిప్టోకరెన్సీ (Cryptocurrency) సంస్థల్లో తాను పెట్టుబడులు పెట్టినట్లు కొందరు మోసపూరిత ప్రకటనలు వ్యాప్తి చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని టాటా సన్స్ (Tata Sons) మాజీ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.
ముంబయి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ నేరాలపట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ.. రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ (Tata Sons) మాజీ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) పేరుతో కొత్త తరహా మోసానికి తెరలేపారు. క్రిప్టోకరెన్సీ ( Cryptocurrency) సంస్థల్లో రతన్ టాటా పెట్టుబడులు పెట్టారని ఒక ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రసారం చేసినట్లు ఉన్న ఫొటోను రూపొందించి.. దాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్నారు. ఈ నకిలీ ఫొటోపై రతన్ టాటా స్పందించారు. ‘‘నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఏ క్రిప్టోకరెన్సీ సంస్థలతో ఏ విధమైన సంబంధంలేదు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. దాంతోపాటు రాసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు.
‘‘ఇది చాలా ముఖ్యమైన ప్రకటన. క్రిప్టోకరెన్సీ సంస్థలతో నాకు సంబంధం ఉందని, నా పేరుతో ఏవైనా ప్రకటనలు లేదా వార్తా కథనాలు మీకు కనిపిస్తే వాటిని నమ్మకండి. అవి పూర్తిగా అవాస్తవ ప్రకటనలు. ప్రజలను మోసం చేసేందుకు కొందరు ఇలాంటివి సృష్టిస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ క్రింది ఫొటో’’ అంటూ ఒక ప్రముఖ వార్తా సంస్థ ప్రసారం చేసినట్లు ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన నెటిజన్లు బాధ్యతగా వ్యవహరించి, ప్రజలను అప్రమత్తం చేసినందుకు రతన్ టాటాకు ధన్యవాదాలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
‘ మీ గురించి మాకు పూర్తిగా తెలుసు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలను మేము ఎప్పటికీ నమ్మం’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘క్రిప్టోకరెన్సీ గురించి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి స్కామ్ల గురించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు’ అని మరో నెటిజన్ కామెంట్స్లో పేర్కొన్నారు. అంతకుముందు మరో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సైతం క్రిప్టోలో పెట్టుబడుల గురించి నకిలీ వార్తలను వ్యాప్తి చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలానే, ఇప్పటి వరకు క్రిప్టోలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ మదుపర్లలో ఎన్నికల గుబులు
దశాబ్దకాలంలోనే తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తోంది. -
బీసీజీ షేర్ల ట్రేడింగ్పై జూన్ 14 నుంచి సస్పెన్షన్
బీసీజీ (బ్రైట్కామ్ గ్రూపు) సంస్థకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్పై బీఎస్ఈ, ఎన్ఎన్సీ సస్పెన్షన్ విధించాయి. -
విదేశీ ఖనిజాలపై కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ దృష్టి
ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్యూ)లైన కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. -
టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. -
ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు
రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
కేవైసీ ధ్రువీకరణ మరింత సులభం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ)ల ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకో) వివరాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. -
4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
మనదేశం నుంచి వస్తు ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్లో 34.99 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
ఎల్ఐసీకి మరో మూడేళ్ల సమయం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రజల కనీస వాటా 10 శాతానికి చేరేందుకు మరో మూడేళ్ల గడువు లభించింది. 2022 మే 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది. -
సోరియాసిస్ వ్యాధికి ఔషధం
జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ మనదేశంలో సొరియాసిస్ (జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో (స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఫోన్ ఛార్జీలు పెంచాల్సిందే
ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో టెలికాం ఛార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. -
సంక్షిప్త వార్తలు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బెర్జర్ పెయింట్స్ రూ.222.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే