Tax: రూ.19 లక్షల కోట్లకు ఈ ఏడాది ప్రత్యక్ష పన్నుల వసూళ్లు?
Tax collection: ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల ద్వారా పన్ను వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ అంచనాలను మించి రూ.19 లక్షల కోట్లకు చేరతాయని నిపుణులు భావిస్తున్నారు.
దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో (Net direct taxes) ఇప్పటి వరకు 20 శాతం వృద్ధి నమోదైంది. ఇలాగే కొనసాగితే 2024 మార్చి 31 నాటికి వసూళ్లు రూ.19 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన చర్యలే పన్ను వసూళ్ల పెరుగుదలకు దోహదం చేసినట్లు విశ్లేషించారు.
2013-14లో వ్యక్తిగత ఆదాయం (Personal Income tax), కార్పొరేట్ పన్నులతో (Corporate tax) కూడిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23 నాటికి అవి రూ.16.61 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అవి రూ.19 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా. 2023-24 బడ్జెట్ అంచనా అయిన రూ.18.23 లక్షల కోట్లను ఇది దాటేసే అవకాశం ఉంది. తక్కువ రేట్లు, తక్కువ మినహాయింపులతో పన్ను విధానాన్ని సరళీకృతం చేయడానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 2019 నుంచి మినహాయింపులను వదులుకున్న కార్పొరేట్లకు ప్రభుత్వం తక్కువ పన్ను రేటును ఆఫర్ చేస్తోంది. 2020 ఏప్రిల్ నుంచి వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకూ అలాంటి పథకాన్నే తీసుకొచ్చింది.
100 బిలియన్ డాలర్ల క్లబ్లోకి తొలిసారిగా ఆమె..!
శ్లాబులను హేతుబద్ధీకరించడం ద్వారా 2023-24 బడ్జెట్లో పన్ను విధానాన్ని ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేసింది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.మూడు లక్షలకు పెంచింది. రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ను కూడా అందులో చేర్చింది. మరోవైపు ఆదాయ పన్ను విభాగం తీసుకున్న చర్యల వల్ల చెల్లింపుదారుల సంఖ్య సైతం పెరుగుతూ వస్తోంది. 2013-14లో 3.36 కోట్ల ఐటీఆర్లు దాఖలు కాగా.. అక్టోబర్ 2023 నాటికి ఆ సంఖ్య 7.41 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది దాఖలైన వాటిలో 53 లక్షల రిటర్నులు కొత్తవారివి కావడం విశేషం.
మరోవైపు జీఎస్టీ వసూళ్లు సైతం ఏటా పెరుగుతున్నాయి. 2023 ఏప్రిల్లో గరిష్ఠంగా రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023-24లో ఇప్పటి వరకు నెలవారీ సగటు వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
ఉద్యోగం కోసం అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకుంటుంటారు. రిక్రూటర్ మెప్పు పొందేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ